పుట:Aandhrakavula-charitramu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1]

57

న న్న య భ ట్టు


మునం దెప్పడో గాని రాని కలజ్యను బంధమును నిత్యముగా విధించు నట్టియు నివి నన్నయసూత్రము లయి యుండవు.

"కవిభల్లటైః క్రియాణాం నామ్నాం చోల్లోవ ఇష్యతే హ్యేషు,
  ప్రధమైక వచనమాత్రేవికృతౌ నాన్తాదయోపి కధ్యన్తే "

అనెడి యాంధ్రశబ్ద చింతామణి సూత్రము (చూడర్జనులు, విల్సూని, ఇత్యాది స్థలములలో) క్రియాపదముల యొక్కయు నామపదముల యొక్క_యు ఉకారము లోపించునని కవిభల్లటులచేత విధింపఁబడినట్లు చెప్పు చున్నది. నన్నయ్యభట్టునకుఁ బూర్వమునందే యిట్టి సూక్ష్మాంశములను సహితము దెలుపు తెలుగుఁ వ్యాకరణము లుండిన యెడల నాంధ్ర శబ్ద చింతామణితో బ్రయోజనమే యుండదు. కవిభల్లటుఁడు నన్నయ్యభట్టునకుఁ దరువాతివాఁ డయినట్లు తెలియ వచ్చుచున్నది. ఈ కవి విక్రమార్కచరితమును రచించి యున్నాఁడు. ఇట్లాంధ్రశబ్ద చింతామణిలో నిటీవలివారి పేరు లుండుట యది నన్నయభట్టవిరచితము కాదని నిర్వివాదముగా స్థాపించు చున్నది. __________________________________________________________________________ ( * ఆంధ్రశబ్ద చింతామణి నన్నయభట్ట విరిచితమే యని శ్రీవజ్ఝల సీతారామస్వామిశా స్త్రిగా రభిప్రాయపడుచున్నారు. శ్రీ శాస్త్రి గారు తమ 'చింతామణి విషయ పరిశోధ నము'లో శ్రీ వీరేశలింగము పంతులుగారు చూపిన యాక్షేపణ లకు సమాధానములను వ్రాయుచు నిట్లనుచున్నారు. 'సర్వత్రాజ్వత్కార్యం జ్ఞేయం యస్య ద్రుతపకృతి కేభ్యః ' అను సూత్రము ద్రుతప్రకృతికము కంటె బరమందున్న యకారమున కంతటను నచ్చువ లెc గార్యమగునని చెప్పుచున్నదనియు, నిది భారత ప్రయోగ విరుద్ధమగుటచే చింతామణి నన్నయ రచితము కానేరదనియు నొక యుక్తిని పంతులు గారు చెప్పిరి. ఎప్పడు మొదలగు శబ్దములలోఁ బదాది నచ్చే యున్నదని కొందఱ యాశయము అచట యకార ము పదము కంటె బరమగునపుడు సంధి వేళలో లోపించుననియుఁ జింతామణికారుని యభిప్రాయము ఉచ్చారణములోనున్న యకారము లేదనుట సరికాదని తలచి చింతామణికారు దద్దానిని నంగీకరించుచుఁ జ్రయోగ విషయమున బాధ లేకుండఁ బైరీతిని సరిపెట్టెను. [చూ. విషయము 47]

'చింతామణి ప్రథమ పురుషేకార సంధియు నిత్యమే యని చెప్పుచున్నదనియు నయ్యది నన్నయ భారతప్రయోగములకు విరుద్ధమనియు మఱొక యుక్తిని జెప్పుచు వీరేశలింగం పంతులుగారు దాహరించిరి . . తెలుగునఁబాదాంతమగు నవుడు

8