పుట:Aandhrakavula-charitramu.pdf/714

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

687

దూ బ గుం ట నా రా య ణ క వి

      
         చ. మిగుల హితుండు నావలన మేలును బొందె వితండు నాయెడం
             నెగఁడని ధూర్తు నమ్మి చెడుఁ దెల్లము సజ్జనశబ్ద మాత్రమే
             నెగడును గాని యప్పు డవనిన్ సుజనుం డనువానిఁ గాన ని
             మ్ముగ ధనలేశమాత్రమున మోహనిబద్ధము లోకమంతయున్
                                                                  సుహృల్లాభము.

         చ. అతులితసత్ప్రతాపమహిమాస్పదుఁడైన విరోధి దూరసం
             స్థితుఁ డగునేనిఁ దద్విపుల తేజముఁ దా నడఁగించు; నల్పుఁడా
             యతశితశస్త్రహస్తుఁడయి యౌదలదగ్గఱ నుండె నేనియున్
             జతురుఁడు గాఁడు వైరిజన సంహరణంబునకు న్నిజంబుగన్
                                                                  సంథివిగ్రహము.

         ఉ. గుండియ పుచ్చి పెట్టుకొని కొమ్మపయిఁ బదిలంబు చేసి నే
             నుండుదు నట్టిభారమున కోర్వక యెప్పుడు; నేఁడు నే నభా
             గ్యుండను నీకు నక్కఱకుఁ గూర్చిన సొమ్మని మున్నెఱింగి తే
             కుండుటఁజేసి యేమని ప్రియోక్తులు పల్కుదు? నేమి చేయుదున్.
                                                                    లబ్ధనాశనము
         ఉ. అక్కఱలెల్లఁ దీఱవు నృపాగ్రణికిం బొడచూపకున్న నా
             కిక్కడ వెన్నపాపనికి నెవ్వరు కాఁ పిఁక వేళ దప్పెఁబో
             నక్కడనే ప్రయోజనము లబ్బు మనంబున మానవుండు దా
             నొక్కటి చింత చేయ విధి యొక్కటి వేఱ తలంచు నక్కటా. [1]
                                                            అసంప్రేక్ష్యకారిత్వము.

  1. [బైచరాజు వెంకటనాధుఁడు, శిష్టు కృష్ణమూర్తిశాస్త్రి, భానుకవి కూడ పంచతంత్రమును పద్యకావ్యములు గా వ్రాసినట్టు తెలియుచున్నది.]