పుట:Aandhrakavula-charitramu.pdf/715

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెన్నెలకంటి-సూరన్న


ఈ కవి విష్ణుపురాణమును తెనిఁగించెను. ఇతఁడించుమించుగా పదునేనవ శతాబ్దాంతము నందుండినట్టు తోఁచుచున్నది. విక్రమార్క చరిత్రమును కృతినందిన పెద్దన్న మంత్రికి పెద్దతండ్రి యయిన వెన్నెలకంటి సూరయ్య యనుకవి యొకఁడు వేమారెడ్డికాలములో నున్నట్లు విక్రమార్క చరిత్రము లోని యీ క్రిందిపద్యమువలనఁ దెలియవచ్చుచున్నది.

        ఉ. వెన్నెలకంటి సూర్యుఁడు వివేకగుణాడ్యుఁడు వేదశాస్త్రసం
            పన్నుఁడు రెడ్డి వేమనరపాలకుచేత మహాగ్రహారముల్
            గొన్న కవీంద్రకుంజరుఁ డకుంఠిత తేజుఁడు పెద్దతండ్రిగా
            సన్నుతిఁగన్న సిద్దనకు సంతత దానకళా వినోదికిన్.

ఇందుఁ జెప్పఁబడిన రెడ్డవేముఁడు, ప్రోలయ వేముఁడు, విష్ణుపురాణమునందు కవిచే నీ కవిని గూర్చియే యీ క్రింది పద్యమునందు వ్రాయఁబడి యున్నది.

        ఉ. ఈ నిఖిలంబు మేచ్చ నమరేశ్వర దేవుడు చూడఁ గృష్ణవే
           ణీనది సాక్షిగా ననికి నిల్చిన రావుతుఁ గేసభూవిభుం
           గాసకుఁ దోలి వెన్నడిచి కాచిన వేమయయన్న పోతభూ
           జానికి సత్ప్రబంధము లొసంగిన వెన్నెలగంటివారిలోన్.

ఈ రెండు పద్యములలోను వర్ణింపఁబడిన వెన్నెలగంటి యతఁడొక్కఁడే యనుటకు సందేహము లేదు. మొదటి పద్యములో "వేమనరపాలకుచేత మహాగ్రహారముల్ గొన్న కవీంద్రకుంజరుఁ" డనియు, రెండవపద్యములో “వేమయ యన్న పోతభూజానికి సత్ప్రబంధము లొసంగిన వెన్నెలగంటివా" రనియుఁ జెప్పఁబడి యున్నను, వేమారెడ్డియు, నాతని పుత్రుడైన యనపోతరెడ్డియు నేకకాలమునందే యుండినందున వెన్నెలకంటి సూరయ్య