పుట:Aandhrakavula-charitramu.pdf/669

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దగ్గుపల్లి దుగ్గయ్య


ఈ కవి భారతానుశాసనికపర్వములోఁ జెప్పఁబడిన కధ ననుసరించి [1]నాచికేతూపాఖ్యానమును రచియించి యనంతామాత్య గంగన కంకితము చేసెను. దుగ్గయకవి శ్రీనాథమహాకవిశిష్యుడును, మఱదియు నయి యుండెను; శ్రీనాధుని భార్యతమ్ముఁడనియు నాతనియొద్దనే యుండి చిన్నతనమునందు విద్యాభ్యాసము చేసెననియు తోఁచుచున్నది.[2] 'నాచికేతూపాఖ్యానాశ్వాసాంతగద్య మి ట్లున్నది.

     గద్య. ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్రకవిసార్వ
            భౌమ సకలవిద్యాసనాథ శ్రీనాధమహాకవీంద్ర ప్రసాదలబ్దకవితావిశేష దగ్గుపల్లి తిప్పనార్య
            ప్రియతనూజ దుగ్గననామధేయ ప్రణీతంబైన నాసికేతూపాఖ్యానంబను మహా
            ప్రబంధంబునందు ...

కృతిపతి కవి నుద్దేశించి యిట్లనియెను.

           క. హితమతివి సకలవిద్యా
              చతురుండవు చాటుపద్యజాలంబుల నా
              కతులితకీర్తులు కలిగిం
              చితి దుగ్గనకవివరేణ్య ! శివకారుణ్యా !

  1. [దుగ్గయకవి గ్రంథము • నాసికేతోపాఖ్యానము' గాఁ బ్రసిద్ధము.]
  2. [దుగ్గయకనవి నివాసమైన దగ్గుపల్లి యేదియో నిశ్చయింపఁ జాలమనియు, కృష్ణాజిల్లా, బందరు తాలూకాలోను, గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోను కూడ దగ్గుపల్లి కలదఁట ! బాపట్ల తాలూకాలోఁ గల దగ్గుబాడయినను, ఇతని నివాసము కావచ్చునఁట ! (ఆంధ్రకవి తరంగిణి సం, 6 ఫుట 101)]