పుట:Aandhrakavula-charitramu.pdf/514

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

487

శ్రీనాథుఁడు

సరిగా నిర్ధారణము చేయుటకుఁ బ్రయత్నింతము. కవి తిప్పయ్యసెట్టితమ్ముఁడై న తిరుమలనాధ సెట్టిని వర్ణించుచు నీ రీతిని జెప్పెను.

       చ. 'హరిహరరాయ ఫేరొజసహాసురధాణ గజాధిపాదిభూ
            వరులు నిజప్రభావ మభివర్ణన చేయఁ గుమారగిర్యధీ
            శ్వరుని వసంత వైభవము సర్వము నొక్కఁడ నిర్వహించు
            మా తిరుమలనాథ సెట్టికిని ధీగుణభట్టికి నెవ్వఁ డీ డగున్? [పీఠిక-24]

ఈ పద్యమునందు హరిహరరాయలు, ఫేరొజిసహా, మొదలయినవారు మెచ్చు నట్లుగా కుమారగిరిభూకాంతుని వసంతోత్సవ వైభవమును తిరుమలనాథ నెట్టి యొక్కఁడే నిర్వహించుచుండినట్లు చెప్పఁబడినది. కాబట్టి హరవిలాసము రచియించునప్పటికి సమకాలీనులైన యీ ముగ్గురు రాజులును జీవించి యుండుట స్పష్టము. ఈ మువ్వురిలో (రెండవ) హరి హరరాయలు 1377 మొదలుకొని 1404-వ సంవత్సరమువఱకును రాజ్య పాలనము చేసెను; "ఫేరోజిసహా 1397 మొదలుకొని 1422-వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసెను; కుమారగిరిభూపాలుఁడు 1387 మొదలుకొని 1400-వ సంవత్సరము వఱకును రాజ్యపాలనము చేసెను. ఆందుచేత నీ ముగ్గురును నుండి రాజ్యపాలనము చేయుచుండిన కాలము 1397. 1398.1399 1400 సంవత్సరములు.కాబట్టి 1397 నకును 1400 లకును నడిమి కాలములో ననఁగా 1400 వ సంవత్సర ప్రాంతమున హరవిలాసము రచియింపఁబడెను. అప్పటికీ శ్రీనాధునికి ముప్పదినాలుగు ముప్పదియైదు సంవత్సరముల వయస్సుండును. కవి ధనలాభముకొఱకు కృతిపతిని "తిప్పప్రభుఁ" డనియు, "ఆస్థానమండపంబున సుఖోపవిష్టుండై " యనియు, అతిశయోక్తులతో నెంతయెక్కువగా వర్ణించినను, తిప్పయసెట్టి సముద్రవ్యాపారమును జేయుచు, కుమారగిరికి వలెనే యితర రాజులకును కస్తూరీకుంకుమాది సుగంధద్రవ్యములను, చీనాంబరాదులను హయరత్నాదులను విదేశములనుండి తెప్పించి విక్రయించుచు పెద్ద యంగడి పెట్టిన లక్షాధికారి యైన పెద్దకోమటియే గాని మహారాజు కాఁడు. ప్రథమాశ్వాసాంతమునందలి