పుట:Aandhrakavula-charitramu.pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

402

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

దీనినిబట్టి ( కర=2, యుగ =4, అనల = 3 మృగాంక= 1) శాలివాహనశకము 1342 వ సంవత్సరమునకు సరియైన క్రీస్తుశకము 1420 వ శార్వరి సంవత్సరమున మార్గశీర్ష శుద్ధపంచమీ బుధవారము నాఁడు పద్మపురాణము ముగింపఁబడెనని తెలియవచ్చుచున్నది. కృతిపతి యైన కందనామాత్యునిఁ గవి వర్ణించిన రెండు సీసపద్యముల నిం దుదాహరించుచున్నాను.

          సీ. 'స్వామిభక్తుఁడు కార్యచతురుండు బహుకళా
                       వేది నీతిజ్ఞుడు విప్రహితుఁడు
               సరససల్లాపుఁడు సప్తాంగరక్షణ
                       క్షముఁడు భావజ్ఞుడు సర్వసులభుఁ
               డరిమంత్రభేదనపరుఁడు ధర్మాత్ముడు
                       సుందరాకారుండు సుజనవినుతుఁ
               డురుదయాపరుఁడు నిత్యోత్సవాసక్తుండు
                       సద్గుణాధారుండు సౌమ్యమూర్తి
 
               సతతగురుదేవతాపరిచారరతుఁడు
               గుణసముద్రుండు కాశ్యపగోత్రజనితుఁ
               డనఁగ నుతికెక్కి పెంపున నతిశయిల్ల
               మదనసదృశుండు కందనమంత్రివరుఁడు.

          సీ. ఈ ధర్మచారిత్రు నే ధాత్రిపతి యేలు
                     నాధాత్రిపతి యేలు నఖిల జగము
               నీ కామినీకాము నే కామినులు చూడు
                     రా కామినులు చూడ రన్య పురుషు
               నీ యర్కసుతతుల్య నే యర్ధి గొనియాడు
                    నా యర్థి యొరు వేఁఁడ నాససేయఁ
               డీ మంత్రికులచంద్రు నే మంత్రి పురణించు