పుట:Aandhrakavula-charitramu.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

388

వే ము ల వా డ భీ మ క వి

వ్రాతప్రతులలోఁ బయి పద్యమునకుఁ బూర్వమునం దుండిననియు నైన వీక్రింది పద్యములు

          "క. పరఁగిన విమలయశోభా
              సురనిరతుఁడు భీమనాగ్రసుతుఁ డఖిలకళా
              పరిణతుఁ డయ్యెను భూసుర
              వరుఁడు ప్రసాదోదిత ధ్రువ శ్రీయుతుఁడై.

           క. అసమానదానరవితన
              యసమానోన్నతుఁడు యాచకాభరణుఁడు ప్రా
              ణసమానమిత్రుఁ డీ కృతి కి
              సహాయుఁడుగా నుదాత్తకీర్తి ప్రీతిన్.

ఈ పద్యములయందైనను గ్రంథమును భీమన చేసినట్టు చెప్పఁబడలేదు.
భీమన యను భూసురుని యగ్రపుత్రుఁ డెవ్వఁడో గ్రంథరచనయందు శ్రావకాభరణాంకుఁ డైన రేచనకు సహాయఁ డయినట్టున్నది. భీమన కొడుకయిన బ్రాహ్మణుఁ డెవ్వఁడో కవిజనాశ్రయమును తాను జేసి ధనస్వీకారము చేసి మహా ధనికుఁడైన జైనకోమటి రేచన్న చేసినట్టయినను జెప్పియుండును, లేదా, పయి పద్యములయం దున్నట్టుగా గ్రంథ రచనమునందు మల్లియ రేచన్నకు తోడుపడి యయిన నుండవలెను, వేఱొకచోట నేను భీమనాగ్రసుతు డనగా భీమనయే యని సాధింపఁ జేసిన యర్థము తప్ప భీమతనూజుఁ డని యింకొకచోటఁ బుస్తకమునందే యంత్యప్రాసమున కుదాహరణముగాఁ జెప్పఁబడిన యీ క్రిందిపద్యమునందున్నది.

          క. 'జననుతభీమతనూజా !
              సునయార్పిత విభవ తేజ సుభగమనోజా!
              వినుత విశిష్ట సమాజా
              యన నంత్యప్రాసమగు నహర్పతితేజా"

ప్రక్షిప్తమని విడిచిపెట్ట బడిన యింకొక పద్యమును రామయ్యపంతులుగారు తమ పీఠికయందీ క్రిందిదాని నుదాహరించియున్నారు.