పుట:Aandhrakavula-charitramu.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

387

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

             నేండిది యేమి నీవనుచు నెచ్చెలులెల్లహసింప నంతలో
             మూండవకంటితోడిదొర మూర్తి వహించిన మొక్కి రంగనల్

          క. ఈ క్షితికి వచ్చి వేగమ
             దాక్షారామమున వారతరుణులనృత్యం
             వీక్షించి యంతకంటెను
             దక్షిణమున నేర్చి రంభ తగ వేర్పడగన్.

ఈ పుస్తకములను జూచి పరీక్షించిఁ గాని యివి యీకవి వగునో కావో యీ కవి యేకాలమువాడో నిర్ణయించుట కనుకూలపడవు. ఇందుదాహరింపబడిన నల్లసిద్ధి పండ్రెండు పదమూడవ శతాబ్దములలోనివాడు. ఈ నడుమ నాంధ్రసాహిత్య పరిషన్మం డలివారు ప్రచురింపఁబూనుకొన్న కవిజనాశ్రయము ముద్రిత ప్రతి యొకటి నేను జూడఁదటస్థించినది. దాని పీఠిక యింకను ముద్రింపఁబడకపోయినను తత్పుస్తకసంపాదకు లగు జయంతి రామయ్య పంతులుగారి దయవలన నేను దానిని జదువఁగలిగితిని. దానియందు వారు భీమకవికాలవిషయమున నేను వ్రాసిన దానిని ఖండించి యాతని కాలము పండ్రెండవ శతాబ్దమనియు, అతడు నన్నయ భట్టారకునకును తిక్కన సోమయాజులకును నడిమి కాలములందుండువాఁ డనియు, నిర్ధారణము చేయఁబ్రయత్నించిరి. దానిని సావధానముగాc జదివి యాలోచించిన మీఁదటఁ గూడ నా యభిప్రాయము మాఱినది కాదు. ఇప్పడు కవిజనాశ్రయము భీమకవిరచితము కానే కాదని నాకు తోచుచున్నది. పుస్తకమునందెక్కడను భీమకవివిరచిత మని చెప్పఁబడక పోపటమేకాక

          క. "అనవద్యకావ్యలక్షణ
              మొనరంగాఁ గవిజనాశ్రయుడు మల్లియరే
              చన సుకవి కవిజనాశ్రయ
              మను ఛందము దెనుఁగుబాస నరుదుగఁ జెప్పెన్"

అను పద్యమునందు మల్లయరేచఁడు దానిని రచియించినట్టు స్పష్టముగాc జెప్పఁబడి యున్నది. భీమకవివిరచితమని యూహించుటకుఁగల యాధారములు ప్రక్షిప్తము లని రామయ్యపంతులుగారు విడిచిపెట్టినవియు, గొన్ని