పుట:Aandhrakavula-charitramu.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

386

వే ము ల వా డ భీ మ క వి

         భానుసహస్రభాసి వృషభాధిపుఁడన్నటు లర్ధయుక్తమై
         పూనినచో నఖండవళి పొల్పగు నాదికవి ప్రణీతమై.
                                                       [కవిజనాశ్రయము]

      ఉ. వారక వారకామినుల వర్తుల చారుకుచోపగూహముల్
          కోరక కోరకోల్ల సిత కుంజములం జిగురాకుపానుపుల్
          చేరక చారు కేరళ కళింగ కుళింగనరేంద్రమందిర
          ద్వారవిహారులై సిరుల నందక నందకపాణిఁ గొల్వరే.

అప్పకవీయమునం దుదాహరింపఁబడిన యీ కడపటి పద్యమును రంగరాట్ఛందమునం దుదాహరింపఁబడిన మొదటి పద్యమును భీమన వగువో కావో విచారింపవలసి యున్నది. భీమన విరచిత శతకంధర రామాయణము లోని వని యీ క్రింది పద్యము లొకలక్షణ గ్రంధములో నుదాహరింపబడినవి -

      క. భువిఁబుట్టి పీcచమడcచెను
         దివిజారాతుల దినేశదీప్తు లడర రా
         ఘవుడనుచు మునులు పొగడిరి
         దివిని దివౌకసులు మిగుల దీవించి రొగిన్

     ఉ. కలగకుడీ నభశ్చరులు కంపముఁ జెందకుఁడెప్డుఁగిన్నరుల్
         తలఁకకు డచ్చరల్ మునులు తత్తఱ మొందకుఁడేను వచ్చి మీ
         యలజడు లెల్లఁబాపి మిము నందఱ గాచెద నంతవట్టుమీ
         గలిబిలి మాని యుండుఁడని కైటభమర్దనుఁడోలిఁబల్కినన్.

భీమన నృసింహపురాణములోని వని యీ క్రింది పద్యము లొక లక్షణ గ్రంధమునుండి రామకృష్ణకవిగారి చేతను తన్మిత్రులు ప్రభాకర శాస్త్రి గారిచేతను వరుసగా నుదాహరింపఁబడినవి.

     ఉ. వాండిమి నల్లసిద్ధిజనవల్లభుఁడోర్చిన రాజు భీతుఁడై
         యాండ్రను గానకుండ వృషభాంకము బెట్టికొనంగఁ జూచితో