పుట:Aandhrakavula-charitramu.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

367

వే ము ల వా డ భీ మ క వి

        భీమేశ్వరుండును బ్రియముతో భక్తుల
                    కోర్కు లొసంగుచుఁ గొమరు మిగుల
        నొకనాఁడు తత్పురియువతులు కొందఱు
                    భక్తి భీమేశ్వరుభవనమునకుఁ
        బోయి పుత్రుల వేఁడ ముగ్ధత్వమున నొక్క
                    విధవ కుమారుని వేడ్కఁ గోర
        నాలేమముగ్ధత కపహసించుచు నల
                    భీమేశ్వరుఁడు పుత్రుఁ బ్రీతి నొసఁగె
        నా కాంత గర్భిణియై కాంచెఁ దనయుని
                    గలియుగాదిని బ్రేమ కడలుకొనఁగఁ
        బ్రభవవర్షంబున శ్రావణమాసంబు
                    శుక్లపక్షంబున శోభనంబు
        మీఱఁ బంచమి శుక్రవారంబునను హస్త
                    యందుఁ గన్యాలగ్నమCదు వెలయ,
        వెలిపెట్టి రక్కాంత విధవ పుత్త్రునిఁ గాంచె
                    నని నింద మెడఁగట్టి యఖిలజనులు
        నంతఁ దత్తనయుండు నై దేండ్ల బాలుడై
                    పురి బాలకులతోడఁ బొసఁగనాడ
        జను లెల్ల గోళకుండని నిందఁజేసిన
                    రోషించి యాతండు దూషిత యని
        రా యెత్తి తల్లిపై నేయఁబోయిన నది
                    భీమేశ్వరుఁడు తండ్రి వేయు మనిన
        వెసc జని యాతని వ్రేయ నుంకించిన
                    భీమేశ్వరుఁడు దయ పెద్ద గలిగి
       ప్రత్యక్షమయి, వత్స! రమ్మని తగc జీఱి
                   పశుపక్షిమృగములఁ బ్రాణికోట్లఁ
       .....................................
                    .......................