పుట:Aandhrakavula-charitramu.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హుళక్కి భాస్కరుఁడు


భాస్కరుఁ డనెడి యీ కవి రామాయణము పద్యకావ్యముగా తెనిఁగింపc బడుటకు ముఖ్యకారకుఁడు. తిక్కనసోమయాజుల పితామహుఁడును. గుంటూరిసీమకు పాలకుఁడు నగు మంత్రి భాస్కరునిచే రామాయణ మంతయు తెనిఁగింపఁబడినదనియు, ఆది యే హేతువు చేతనో యొక్క యారణ్యపర్వము తప్పఁ దక్కినభాగ మంతయు నుత్సన్నము కాఁగా పిమ్మట హుళక్కి భాస్కరుఁడు మొదలయినవారు తక్కిన కాండములను మరల రచించి గ్రంధపూర్తి చేసిరనియు ఒక ప్రతీతి కలదు. ఈ రామాయణమునకు భాస్కరరామాయణ మన్న పేరు మంత్రిభాస్కరునిచేత నయినను, హుళక్కి భాస్కరునిచేత నైనను రావచ్చును: గాని, ఆరణ్య కాండము తక్కినకాండములవలెఁ గాక యా శ్వాసములను కలిగి యుండుటను బట్టియు దాని శైలినిబట్టియు విచారించి చూడఁగా భాస్కరరామాయణము లోని యారణ్యకాండము మంత్రి భాస్కరునిచేతనే రచియింపఁబడినదేమో యని సందేహము కలుగుచున్నది. యుద్ధకాండములోని 1134 పద్యములను హుళక్కి భాస్కరుఁడు రచియించినను, దాని నా శ్వాసములుఁగా విభాగింపకుండుటయు, ఆరణ్యకాండ మంతటిలోను 830 పద్యములకంటె నెక్కువ లేకపోయినను దానిని రెండాశ్వాసములుగా భాగించుటయు, విచారింపఁగా నీ రెండు కాండములను రచియించినవా రొక్కరు కారనియు వేఱువేఱు భాస్కరులనియు నూహింపఁదగి యున్నది. యుద్ధకాండములోని "శ్రీయుత మూర్తియైన" యను పద్యము మొదలుకొని వేదగిరినాయనింగారి ప్రేరణమువలన నయ్యలార్యునిచే రచియింపఁబడినట్టు ప్రాచీన తాళపత్రసంపుటములలోఁ గొన్నిటిలో వ్రాయఁబడియున్నది.

ఒక్క యారణ్యకాండమునం దక్క మఱి యేకాండములోను నాశ్వాస విభాగము చేయఁబడలేదు. అంతేకాక యారణ్యకాండమునందలి ప్రథమ ద్వితీయాశ్వాసాంతపద్యములు కృతిపతినిగూర్చిన సంబోధనములు గాక