పుట:Aandhrakavula-charitramu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

198

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

           బూనిన మత్కృతం బఖిలమున్ వృథ యయ్యె విధాత చెయ్వు లె
           వ్వానికి మాన్పఁగా నకట • వచ్చునె మానుషతుచ్చయ్నతన్.


పూర్వ .ఆ.5


                                                          
      శా. పాపాత్ముండగు దైత్యుచేఁ బడిన మీపాటంతయుం జెప్పఁగాఁ
           గోపం బుత్కటమై మనంబునను సంక్షోభంబు ప్రాపించె మ
           ద్రూపం బొండొక భంగి మీకు నిటలై తోఁచెన్ భవన్మంజులా
           లాపంబుల్ ప్రకృతిస్థుఁ జేసె నను నుల్లాసంబుతోఁ గ్రమ్మఱన్.


ఉ.ఆ. 4


                                                           

                          నృసింహపురాణము

       చ. సురుచిరపానపాత్రమున సుందరి యొక్క తె కేల నిండు చం
           దురుఁడు ప్రకంపితాంగకముతోఁ దిలకించెఁ దదాననాంబుజ
           స్ఫురితవికాసవైభవము సొంపు లడంకువ మ్రుచ్చలింపఁ జె
           చ్చెరఁ జనుదెంచి పట్టువడి చేడ్పడి భీతి వడంకుచాడ్పునన్.

       చ. ఇదె చనుదెంచెఁ జైత్రుఁడని యెల్లవనంబులకుం బ్రమోదముల్
           పొదలఁగ మేలివార్తఁ గొని బోరన వచ్చిన దాడికాఁడనన్
           మృదువన దేవతాముఖసమీర మెదుర్కొన నుల్లసిల్లె నిం
           పొదవఁగ దక్షిణానిల మనూనమనోహరఖేలనంబునన్.

ఈ నృసింహపురాణముమాత్రము నరాంకితము చేయక యెఱ్ఱాప్రెగడ యహోబలస్వామి కంకితముచేసి యున్నాఁడు. ఈ క్రింది దా పురాణము లోని మొదటి పద్యము :

       ఉ. 'శ్రీకి నిరంతరంబు కడుఁ జెన్నెసలారెడు రాగలీల ను
            త్సేకముఁ బొంది యొప్పు తనచిత్తము చూపెడుమాడ్కి నిత్యర
            మ్యాకృతి యైన కౌస్తుభము నక్కుపయిం బచరించు నుత్తమ
            శ్లోకుఁ డహొలోబలేశుఁ డతిలోకుఁడు లోకముఁ గాచుఁగావుతన్.