పుట:Aandhrakavula-charitramu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

190

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

యెఱ్ఱనప్రెగ్గడ నొక్కనిని దన పూర్వునిఁ జెప్పి యుండుటఁ జూచి సూక్ష్మముగా విచారింపక స్థూలదృష్టిచేత నీ యెఱ్ఱనప్రెగ్గడయే యా యెఱ్ఱనప్రెగ్గడ యని భ్రమపడుటవలన గలిగినది. ఈ యెఱ్ఱన లిరువురును గాక మణియొక యెఱ్ఱనకవి గూడఁ గలఁడని కొక్కోకమునందు గ్రంధకర్త తన్నుఁగూర్చి చెప్పుకొన్న యీ క్రిందిపద్యమువలనఁ దెలియుచున్నది.

        సీ. 'శ్రీవత్సగోత్రప్రసిద్ధసంభూతి నా
                    పస్తంబసూత్రప్రశస్తఘనుఁడ
             గురదయానిధి యైన మాచనమంత్రికి
                    నంగనామణి ముత్తమాంబికకును
             దనయుండ సత్కవీంద్రసుమాన్యచరితుండ
                    శివకృపాను జ్ఞానశేఖరుండ
             నారూఢవిద్యాచలానంద యోగీంద్ర
                    శిష్ట ప్రచార విశిష్టఘనుఁడ

             నెఱ్ఱనామాత్యుఁడను సత్కవీంద్రహితుఁడఁ
             గవిత వాక్ప్రౌఢిఁ గొక్కోకకవివరుండఁ
             జతురమతితోడ రతికళాశాస్త్ర మిదియుఁ
             దెనుఁగు గావింతు రసికులు వినుతి చేయ'

ఇcకను మనము చెదలువాడ యెఱ్ఱాప్రెగడ కాలమునుగూర్చి యించుక విచారింప వలసియున్నది. ఇతఁడు తాను రచించిన రామాయణమును హరి వంశమును పోలయవేమున కంకితము చేసి యుండుటచేతను, పోలయ వేముఁడు 1320 మొదలుకొని (కొందఱనునట్లు 1324 మొదలుకొని) 1349-వ సంవత్సరమువఱకును సామంతుఁడు గానో స్వతంత్రుఁడు గానో ప్రజాపాలనము చేసి యుండుటచేతను, ఇతc డా కాలమున నుండె ననుటకు సందేహము లేదు. ఇతఁడు తిక్కనసోమయాజి తరువాత నిరువది ముప్పది సంవత్సరములలోపలనే యుండియున్నట్టు కనబడుచున్నాఁడు. "ప్రజ్ఞాపవిత్రుc" డన్న నృసింహపురాణపద్యమునుబట్టి చూడఁగా నీతని వంశవృక్ష మీ విధముగా నున్నది.