పుట:Aandhrakavula-charitramu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

176

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

ఈతని కాలమువరకును నన్నయభట్టు విడిచిన యారణ్యపర్వశేషము తెనిఁగింపఁబడక భారతము కొఱఁతపడి యుండుట చూచి యితఁడు తాను దానిని తెనిఁగింప నెంచియు తన పేరిట నాంధ్రీకరించినచో నన్నయభట్టారకునిఁ బోలెఁ దనకు నేదో కీడు మూడునని భయపడి మిగిలిన భాగమును రాజరాజనరేంద్రున కంకితముగా నన్నయభట్టు పేరితోనే రచియించెను. భారతములో నీతఁడు రచియించినభాగములోని మొదటి పద్యము

       చ. "స్పురదరుణాంశురాగరుచి బొంపిరివోయి నిరస్తనీరదా
            వరణములైదళత్కమలపైభవజృంభణ ముల్లసిల్ల ను
            ద్ధురతరహంససారసమధువ్రతనిస్వనము ల్చెలంగఁగాఁ
            గరము వెలింగె వాసరముఖంబులు శారద వేళఁ జూడఁగన్."

అనునది. కాబట్టి యీ కవి రచియించిన దారణ్యపర్వములో సగమకంటె నధికము నుండును.

ఎఱ్ఱాప్రెగడ కవిత్వము మృదువును మధురమునయి. కదళీపాకమై, చాల వఱకు సోమయాజులకవిత్వమును పోలియుండును. ఇతఁడు రచియించిన భారతభాగమునం దించుమించుగా సంస్కృతపదములును, తెలుఁగుపదములును సమానముగా నుండును ఇతని భాషాంతరమును పయి యిరువుర దానివలెనే మూలమైన సంస్కృతగ్రంథానుసారముగా నుండదు. ఈక్రింది శ్లోకములను పద్యములును కొంతవఱకీ యంశమును తేటపఱుపవచ్చును.


                     సంస్కృతారణ్యపర్వము.
          శ్లో. తవ వశ్యా హి సతతం పాండవాః ప్రియదర్శినే
              ముఖప్రేక్షా శ్చతే సర్వే తత్త్వమేత ద్బ్రవీహి మే.
             వ్రతచర్యా తపో వాస్తి ప్నానమంత్రౌషధాని వా,
             విద్యావీర్యం మూలవీర్యం జపహోమాగదాస్తదా.
                          తెలుఁగు
              సీ. నీ ప్రియభర్తల నిర్మలవృత్తులC
                        బ్రకట తేజుల లోకపాలనిభులఁ