పుట:Aandhrakavula-charitramu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

177

ఎ ఱ్ఱా ప్రె గ డ

                  బార్థుల నీ వొకభంగిన వదలక
                         చెలువ యెబ్బంగి భజింతు దగిలి ?
                  యొక్కఁ డొక్కనికంటె నువిద నీ కెక్కుడు
                         ననురక్తు లగుట యత్యద్భుతంబు
                  నగుమొగంబులకాని నాతి నీదెస నెప్డు
                         బతులకుఁ గిన్క యెప్పాట లేదు

                  వ్రతము పెంపొ మంత్రౌషధవైభవంబొ
                  సరసనైపథ్యకర్మకౌశలమొ చతుర
                  విభ్రమోల్లాసరేఖయొు వెలఁది నీవి
                  శేషసౌభాగ్య హేతువుఁ జెపుమ నాకు."

ఇందలి సీసపాదముల నాలిగింటను మూలములో లేని నిర్మలవ్పత్తులఁ బ్రకట తేజుల మొదలయిన విశేషణాదులచేత గ్రంథము విస్తారముగా బెంపఁబడినను గీత పాదములయందు మూలమునందలి తపస్సు స్నానము జపము హోమము మొదలైనమాటలు విడిచిపెట్టఁబడినవి.

 
                             సంస్కృతము

       శ్లో. "యదైవ భర్తా జానీయా న్మంత్ర మూలపరాం స్త్రియమ్,
           ఉద్విజేత తదై వాస్యాః స ర్పా ద్వేశ్మగతా దివ.
           ఉద్విగ్నస్య కుత శ్శాంతి రసాంతస్య కుత స్సుఖం,
           న జాతు వశగో భర్తాస్త్రీయాః స్యాన్మంత్రకర్మణా.
           అమిత్ర ప్రహితాంశ్చాపి గదాన్ పరమదారుణాన్,
           మూలప్రచారైర్హి, విషం ప్రయచ్ఛంతి జిఘాాంసవః.
           జిహ్వయా యాని పురుష స్త్వచా వా ప్యుప సేవతే,
           తత్ర చూర్ణాని దత్తావి హన్యు క్షిప్ర మసంశయః.
           జలోదరసమాయుక్తాః శ్విత్రిణః ....స్తథా,
           అపుమాంసః కృతా శ్రీభిః జడాంధబధిరస్తథా.