పుట:Aandhrakavula-charitramu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

       శా. అంతంతం కబళింపఁగాఁ గడఁగె బాలార్కున్ ఫలభ్రాంతి వే
           శంతోల్లంఘన కేళి దాటెను సరస్వంతున్ మహాదానవా
           క్రాంతారామమహీయహంబుల నుదగ్రక్రీడఁ ద్రుంచెన్ హనూ
           మంతుండుం గపి యన్యము ల్గపులె సామాన్యాటవీచారముల్.
                                                        సౌగంధికాపహరణము
       8. పోతరాజు వీరయ్య - ఇతడు త్రిపురవిజయము చేసెను.

       సీ. తమ్ముల బెదరించుతళుకు వెన్నెలసోగ
                            కన్నె గేదఁగి రేకు గారవింప
          పదినూఱుపడిగెలఁ బరపైనపదకంబు
                            సవడిముత్యపుఁబన్న సరముఁ బ్రోవ -త్రిపురవిజయము

       9. వాసిరాజు రామయ్య - ఇతడు బృహన్నారదీయమును చేసెను

       సీ. మల్లికానవసముత్ఫుల్ల పాటల పుష్ప
                             వల్లరీసౌరభ్యవాసితంబు
          కాసారనీరజవ్యాసక్త మధుకరీ
                             ఝంకారముఖరితాశాముఖంబు-బృహన్నార.

       10. గంగరాజు చౌడప్ప-ఇతcడు నందచరిత్రమును జేసెను.

       చ. ముదిమికి మందు వాగ్మితకు ముంగలిజిహ్వ తపఃఫలంబు స
           మ్మదమునివాస మింపుగని మారవికారముప్రోది కామినీ
           వదన విభూషణంబు జనవశ్యము హాస్యరసాబ్ది లాస్యసం
           పదయుదరస్థలంబు మధుపానసుఖంబు జగత్రయంబునన్ -

                                                            నందచరిత్రము

ఈ ప్రకారముగా సంకలితగ్రంథములలోను లక్షణ గ్రంథములలోను బేర్కొనఁబడిన వారు జినేంద్ర పురాణమును రచించిన పద్మకవి (ప్రభాచంద్రుఁడు), ముద్రామాత్యము రచించిన శివదేవయ్య, ప్రద్యుమ్నవిజయము రచించిన ఫణిధవుఁడు, జలపాలి మహత్వము రచించిన నడివాసిమల్లుభట్టు పద్మినీవల్లభము, శంకరవిజయము, మంగళగిరి విలాసము రచించిన బొడ్డపాటి పేరయ్య, వాసవదత్తోపాఖ్యానము, రేవతీపరిణయము రచించిన మద్దికాయల మల్లయ్య, ఆదిపురాణము రచించిన సర్వదేవయ్య, కుశలవోపాఖ్యానము, ఐరావతచరిత్రము రచించిన చిరుమూరిగంగాధఁరుడు, పద్మావతీకళ్యాణము