పుట:Aandhrakavula-charitramu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

165

తి క్క న సో మ యా జి

     క. "మానుగ ధర్మక్షేతం
         కురుక్షేత్రమున మహాహావమునకున్
         బూని మనబలముఁ బాండవ
         సేనయు నిటు పన్ని యేమి చేసెం జెపుమా?"
అనియు,

     శ్లో. "యత్రయోగేశ్వరః కృష్ణో యత్ర పార్థోధనుర్ధరః |
         తత్రశ్రీర్విజయో భూతి ర్ధృ వా నీతి ర్మతిర్మమ ||

 అను నంత్యశ్లోకమును

     గీ. "అధిప యోగేశ్వరేశ్వరుఁడై న కృష్ణుఁ
         డును ధనుర్ధరవర్యుఁ డర్జునుఁడు నెచట
         నిలిచి రచ్చట విజయంబు నీతి సిరియు
         భూతి నిత్యంబు లగు నిది నాతలంపు "

అనియు, తెలిఁగించి నడుమ నాలుగయిదు పద్యములు వేయుట గ్రంథమును భాషాంతరీకరించుట కానేరదు. ఇది గుహ్యమైన యోగశాస్త్ర మనియో యుద్దమధ్యమున శత్రువు లెదుటనుcడఁగా పదునెనిమిది యధ్యాయములు గల మహా గ్రంధమును గృష్ణు డర్జునునకుఁ జెప్పెననుట విశ్వాసయోగ్యముగా నుండదని భావించియో, తిక్కన భగవద్గీతలను దెలిఁగింపఁడయ్యెను.

ఈయన సంస్కృతమును తెలిఁగించిన రీతిని దెలుపుటకయి మూలగ్రంథము లోని కొన్ని శ్లోకములను వానియర్ధమును దెలుపు పద్యములను కొన్నిటిని క్రింద వివరించుచున్నాను--

విరాటపర్వము శ్లోకము

      శ్లో. ఆలోకయసి కి వృక్షం సూద దారుకృతేన వై
         యది తే దారుభిః కృత్యం బహిగ్వక్షాన్ని గృహ్యతామ్.