పుట:Aandhrakavula-charitramu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

                              పద్యము

      మ. వలలుం డెక్కడఁ జూచె? నొండెడ ససేవ్యక్ష్మాజముల్ పుట్టవే?
          ఫలితంబై వరశాఖ లొప్పఁగ ననల్ప ప్రీతి సంధించుచున్
          విలసచ్ఛాాయ నుపాశ్రితప్రతతికి న్విశ్రాంతిఁ గావింపఁగాఁ
          గల యీ భూజము వంటకట్టియలకై ఖండింపఁగా నేటికిన్ ?

                             శ్లోకములు

      శ్లో. సా సభా ద్వార మాసాద్య రుదితీ మత్స్య మబ్రవీన్,
          అపేక్షమాణా సుశ్రోణి పతీం స్తాన్ దీనచేతస8,
          ఆకార మభిరక్షంతీ ప్రతిజ్ఞాం ధర్మసంహితాం
          దహ్యమానేన రౌద్రేణ చక్షుషా ద్రుపదాత్మజా

      సీ. ఏలఁదీగఁ గప్పిన లలితపరాగంబు
                  క్రియ మేన మేదినీ రేణు వొప్ప
          చంపకంబున నవసౌరభం బెసcగెడు
                   కరణి నాసిక వేఁడిగాడ్పు నిగుడ
          తోయజదళములతుది నుంచు దొరిఁగెడు
                   గతిఁ గన్నుఁగవ నశ్రుకణము లురుల
          నిందుబింబముమీఁది కదుచందంబునఁ
                   గురులు నెమ్మొగమున నెరసియుండ

          సర్వజనవంద్య యైన పాంచాలి సింహ
          బిలునిచే నివ్విధంబున భంగపాటు
          తనకు వచ్చిస నెంతయు దైన్య మొంది
          యవ్విరాటుని సభc జేగ సరిగి నిలిచి.

      ఉ. పంబిన కోపము న్సమయభంగభయంబును నగ్గలించి యు
          ల్లంబు పెనంగొనంగఁ బతులం దగు సభ్యులఁ జూచు మాడ్కి రూ
          క్షంబగు చూడ్కి. నాద్రుపదుకన్నియ చూచి సభా జనప్రతా
          నంబును మత్స్యనాధుఁడు వినంగ నెలుంగు చలింప నిట్లనున్."