పుట:Aandhrakavula-charitramu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

81

న న్న య భ ట్టు

పురాణేతిహాసార్థజ్ఞ కౌశలమనీషావిరాజిత మహాయశుండై యొక్కనాడు విబుధకవిగాయక సార్థకమాగధవంది బృందసమేతంబుగాఁ బేరోలగంబున్నసమయంబున 26

    
    సీ. వెన్నెల నదలించి విఱ్ఱవీఁగు విభూతి
             పూఁత శృంగారమై పొల్పు మీఱ
        మహనీయదండ కమండలంబులు హస్త
             పద్మంబులను రూఢిఁ బరిఢవిల్ల
        మేఘంబులో నుండు మెఱుపుదీగలరీతిఁ
             బరఁగుచుండెడి జటాపంక్తి మెఱయ
        సిద్ధౌషధంబులఁ జెలువొందు కంధయు
             గాషాయ వస్త్రముల్గరిమఁ జెలఁగఁ
       
     గీ. జూపరులకు నద్భుతంబుగఁ జూచుచుండ
        నాకసంబుననుండి తా నతిముదమున
        వచ్చు తపసునిభంగి సభాస్థలంబుఁ
        జేర వచ్చెను నపు డొక్క సిద్ధయోగి.

వ. వచ్చిన నాశ్చర్యానందభయభక్తి సమేతుండై దిగ్గన లేచి యెదుర్కొని జాంబూనదరత్నమయ సింహాసనమున సుఖాసీనుంజేసి యర్ఘ్య పాద్యంబు లొసంగి తత్పాదోదకంబు శిరంబున నిడుకొని పుణ్యశరీరుండునైతి. దేవా మీరు వేంచేయుటకు నిమిత్తం బెయ్యది యది సవిస్తరంబుగ నానతీయుండని విజ్ఞాపన పూర్వకంబు గాcబలికిన నమ్మహాసిద్ద లోకేశ్వరుం డిట్లనియె. 28

    
     మ. కమనీయాత్ములఁ జూచి తెంతయును నే గాళింగకాంభోజ
         మత్స్యమహారాష్ట్ర పుళిందహూణ శకవంగాంగాదిభూమీశులన్
         క్షమలో వారలు నిన్ను వంటి సుగుణ స్థైర్యాధికుల్గారు నిన్
         గొమరొప్పన్మరి గంటి సంతసిలి నీ గోష్ఠంతయుం జూచితిన్. 29