పుట:2015.396258.Vyasavali.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
104

వ్యాసావళి

ధిక వచనమునకు చెన్నపట్టణములో ఉండిన చిన్నయ సూరి గారేబ్రహ్మ." అని వ్రాసినారు. బాగా ఆలోచించండి. తంజావూరు, తిరుచునాపల్లి,మదుర, చన్నపట్టణము--ఇవి అరవ దేశములోనివి. అక్కడ కాపురముండిన తెలుగులు ఎట్టి తెలుగున సంభాషింతు రో వారితో మాట్లాడిన వారికి గాని తెలియదు. చన్నపట్నము మొదలుకొని రామేశ్వరము వరకూ ఉన్న పెద్దపట్టణములలోఉన్న తెలుగువారిని కొందరిని చూచి వారితో సంభాషించి యున్నందువల్ల మాకాసంగతి బాగా తెలుసును. పాతతెలుగు మాటలు కొన్ని, కొత్తవికొన్ని అరవమాటలు కొన్నికలిపి చిత్రమైన ఏసతోను, స్వరముతోను వారు మాట్లాడుతారు. *కొంత పరిచయము కుదిరేవరకూ వారిమనోబావము స్పష్టముకాదు. ఇట్టి తెలుగు వ్యావహారిక బాషగా గలవారు తెలుగు పండితులుగా ఉంటే వారు రచించే గ్రంధములు ప్రాచీన కావ్యముల శైలిని కాక మరియేలా గున వ్రాయగలరు? వేగినాడు, వెలనాడు, పాకనాడు, కమ్మనాడు, పల్నాడు మొదలయిన వాళ్ళు నిజమయిన తెలుగుదేశములోనిది. ఇక్కడి వారు వందలు వందలు వ్రాసిపెట్టినారు. గ్రంధాలు నానావిధములయినవిన్నీ, అందులో మీదను చెప్పినట్లు ప్రబంధాలన్నీ కావ్యభాషలొనున్ను, వచన గ్రంధాలన్నీ వ్యావహారిక భాషలో నున్ను ఉన్నవి.

    ఇదీ తెలుగుదేశములో మొన్న మొన్నటివరకూ సంప్రదాయము. పెద్దనగారు మనుచరిత్ర వ్రాసినట్టు కావ్యభాషలో వ్రాయించక వ్యావహారిక భాషలో వ్రాయించినారు. తమ దానశాసనములు. కృష్ణదేవరాయలవారి ధర్మశాసనములు వాడుక భాషలోఉన్నవి. గాని ఆముక్తమాల్యద వలె కావ్యభాషలో లేవు. శ్రీ సకల కవితా స్వతంత్రభట్టారక యెలకూచి బాల

________________________________

  • తంజావూరి గ్రంధాలయములో అరవైకంటే అధికముగా తెలుగు నాటకాలున్నవి. వాటిలో స్పష్ట ముగా కనబడుతుంది అరవతెలుగు ఎట్టిదో