పుట:2015.396258.Vyasavali.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

103

విన్నపము

ప్రబంధమువలెనే శతకములు వ్రాసినవారు కొందరున్నా, పాటలు మొదలయినవి మాత్రము పూర్వులందరూ సరసముగా వాడుకమాటలతోనే కూర్చినారు. ఈ పాటలు చందోబద్ధములు కావా? ఆ పాటలు రచించినవారు కవులుకారా? త్యాగరాయలను వారి కృతులను తలచుకోండి. ఇక వచనముల మాట చెప్పుతాము. చంపూకావ్యములలో అక్కడక్కడ ఉన్న ' వచనములు ' మాత్రము వాటిలోని పద్యములవలెనే ప్రాచీన భాషామయమయిన కావ్యభాషలో వ్రాసిఉన్నవి. తదితరములైన వచనగ్రంధమేది చూచినా వ్యావహారిక భాషలోనే రచించిన వచనగ్రంధము నిజమయిన తెలుగు దేశములో మాకు ఎక్కడనూ కనబడలెదు. తంతావూరు మొదలుకొని గంజాం జిల్లా లోని చత్రపురము వరకూ ఏయేచోట్ల తాటాకు పుస్తకములున్నవని మాకు తెలిసినచో ఆయాచోట్లకు పోయి అవి చూచినాము. ఆంధ్రసాహిత్యపరిషత్తువారు సంపాదించిన తాటాకు పుస్తకములలో నాలుగయిదు కాబోలు ఉన్నవి. అంతే, కావ్యభాషలో రచించిన వచనగ్రందములు. వాటిలో జైమిని భారతము మాత్రము నిరుడు పరిషత్తువారు అచ్చువేయించినారు.కొన్నిటికి ప్రతులు చన్నపట్టణము గవర్నమెంటువారి గ్రంధాలయమం దున్న, తంజావూరు గ్రంధాలయమందున్ను ఉన్నవి; మరియెక్కడనూ మాకు కానరాలేదు. ఈ అద్భుత వచన గ్రంధములు రచించిన వారెవరో తెలుసుకొంటే, ఎందుచేత అట్టి అద్భుతవచనము వారు రచించినారో ఊహించవచ్చును. మ.రా.రా.జయంతి రామయ్య పంతులుగారే ఒకపుస్తకములో *"తంజావూరు, తిరుచునాపల్లి,మధుర--ఈ రాజ్యములు పాలించిన 'నాయక ' రాజుల కాలములో ఇవి పుట్టినవి. ఇవి మొన్న మొన్న దొరికినవి. ఇంతవరకూ ఈ గ్రంధము లున్నవని ఎవరూ ఎరుగరు. ఇప్పటి గ్రాం _________________________________

  • Defence of Literary Telugu. P.2.