పుట:2015.392383.Kavi-Kokila.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46 కవికోకిల గ్రంథావళి [చతుర్థాంకము

                     త్యామలవర్తనుండు, కరుణామృత సాగరుఁ డా యయోధ్యలో
                     నేమియు నాపదంబొరయ కే సుఖ మొందుచు నున్నవాఁడొకో?

లక్ష్మ : అన్నగారు సుఖముగనే యున్నారు.

సీత : లక్ష్మణా. నామనమునఁ దెలుపనలవిగాని యనుమాన ముప్పతిల్లుచున్నది. నేను వనములకు వెడలునప్పుడు రాజకార్యలంపటుఁడయి హృదయేశ్వరుఁడు నన్ను వీడ్కొలుపఁడాయె. అన్నా, శత్రుఘ్నుని సమరయాత్రలో నేమియు అమంగళము వినవుగదా ! సవనదర్శానార్థమేఁగిన భరతకుమారుఁడును గురుజనులు కుశలముగ నున్నారా?

లక్ష్మ : పూజ్యురాలా, అందఱకుం గుశలమే.

సీత :: లక్ష్మణా, మీయన్న జనరంజకముగఁ బాలించుటలేదా?

లక్ష్మ : అమ్మా, లోకుల సంతోష పెట్టఁ దన యర్థాంగినైనఁగాన పాలుసేయ సాహసించు కీర్తికాముఁడు ధరాతలమెల్ల శాసింప నిఁక జనరంజకత వేఱ చెప్పవలయునా ?

సీత : అట్లైన నీహృదయాందోళనమున కేమికారణము?

                     పరమసౌఖ్యములను భార్యను విడనాడి
                     యన్న ననుసరించి యటవికేఁగు
                     నప్పుడైన నిట్టి యార్తితోఁ గుందవు
                     చింతఁబొంద నేల చెప్పుమన్న.

లక్ష్మ : [కన్నీటితో] తల్లీ లోకపావనీ.

ఏమని దెల్పుదున్ రఘుకులేశ్వరునాజ్ఞ- [నిట్టూర్చును.]