పుట:2015.372978.Andhra-Kavithva.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ



విప్లవములచే జనించిన వాజ్ఞ్మయము తాత్కాలికముగ నిర్మింపఁ బడు పొఁకలు, పందిళ్లుంబోలె దిట్టమగు పునాదులు లేనివగుట శీఘ్రముగ నధఃపతనము నొందునవస్థకు రాఁగలవు. దీనికి దార్కాణము విప్లవానంతరమున నొకశతాబ్దమేనియు ముగియకపూర్వమే తిరిగి ల్యాటిన్ వాజ్మయమునెడఁ బక్షపాతము. మొలకెత్తుటే!

మాత్యూ ఆ ర్నాల్డు.

'ఆర్' నాల్డు' అనువిమర్శకుడు కావ్యము జీవిత విమర్శన మని యొక యపరూపసిద్ధాంతముఁ గావిం చెసు. ఇతఁడు 'కావ్య. కర్తను సృష్టికర్తగఁ గాని 'ఛాయాపట గ్రాహకునిగఁ గాని భావింపక జీవితవిషయములను విమర్శించి, శాస్త్ర దృష్టితోడ నని సమయముఁ జెప్పినను సత్యదూరముగాదు.) యాదర్శమును సర్పించువానిఁగ నిర్ధారించెను.

ఆధునికాంధ్ర కావ్య పద్ధతి.

వెంటనే కవి విమర్శకుఁడు గాఁడనియు, సృష్టికర్తయే యనియుఁ, గవిస్వతంత్ర జీవియే కాని పరులపై నాధారపడి యుండు వాఁడు కాఁడనియుఁ, గావ్యమునకుఁ గావ్యదృష్టిదక్క శాస్త్ర దృష్టియు విమర్శక దృష్టియు న ప్రధానము లనియుఁ, గావ్య మునకుఁ బరమావధి హ్లాదై కమయతయే యనియు సిద్ధాంతము గావించి యనేకులగు విమర్శకులు ఆర్ నాల్డుమతముసు బూర్వ పక్షముఁగావించి రసికమతమును నిల్పిరి. 'నేఁటివర కును భగవత్ కృపవలన నామతము మార లేదు. మొస మొన్న నే తిరిగి 'యను. కరణ' పద్దతి నవలలయందును, నాటకములయందును, గొన్ని