పుట:2015.372978.Andhra-Kavithva.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసాత్మకం వాక్యం కావ్యమ్

25


లాక్షణిక కవిత్వము.

షేక్సియరును, నతనిమతముననే కొంతవరకు ప్రవర్థ మాసుఁడైన 'మిల్టన్' కవియు సూర్యచంద్రులు వోలె సం. గతులగుట చేతను, నప్పటి కాలసరణివలనను నింగ్లండు దేశము నను నితరములగు నైరోపీయ దేశములను స్వతంత్ర కావ్యరచనా ప్రతిభ కొంతవటి కడుగంటిన కతన యా దేశముల కవు లెల్లరును దిరిగి ల్యాటిన్ కవు లేర్పఱచిన లాక్షణికపథమునే తొక్క వలసిన వారైరి. ఆ కాలమున సమకాలికాచారవ్యవహారములు ల్యా టిన్ కవుల చేవ లె నాంగ్ల పరాసుకవులచే మిక్కిలి విరివిగఁ గావ్యముల వర్ణితములై స్వతంత్ర 'కావ్యరచనా ప్రతిభను నగాధ సముద్రమున నడుగంటఁ దొక్కి వైచెను.

పరాసు విప్లవము

కాని సముద్రుఁడును నెంత గభీరుఁడయ్యును నట్టి శుష్క కావ్యముల జీర్ణించుకొన లేక వానినెల్ల నొక్క పెట్టున 'పరాసువిప్లవ' మను మహాజ్వాలకు నాహుతియగునటులఁ బై కి వెడలఁగ్రక్కెను. నిరంకుశ పరిపాలన వ్యథను దరతరములఁ గుంది యొక్క మాఱుగ దాస్య పొరతం త్ర్యాది శృంఖలలను భేదింప దొరకొన్న పరాసులు కావ్యమునఁ గూడఁ బూర్వకవి సాంప్రదాయ దాస్యమును ఛేదించి స్వతంత్ర కావ్య సృష్టికి దారులు తీసిన వారైరి, పరాసు విప్లవ ఫలితముగ నైరోపాఖండ మునఁ గాన సృష్టియే ప్రధానముగ నెంచఁబడి ఛాయాపట రూపానుకరణము గౌరవపదమును గోలుపోయి స్వతంత్ర వాజ్మ యము బయలు వడుటయు సంభ విశ్వప్నము లెప్పుడుసు జిరస్థాయిగ నుండునటుల మతము ఖాతరు నేరవు.