పుట:2015.372978.Andhra-Kavithva.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

భావ ప్రకటనము.

303


త్రివిధాంధ్ర కవులు 1. స్వతం త్రాంధ్రకవులు.

ఆంధ్ర కవులు ముత్తెగలకుం జేరుదురు ఎట్లనఁగా భావ ముల విషయమునను, భావ విషయమునను సంస్కృత పారతం త్ర్యము సంగీకరించుట కొల్లక సంపూర్ణాంధ్ర విలక్షణత్వమునే ప్రతిపాదింపఁ జేసిన యాంధ్ర కవులును, భావముల విషయ మునను, భాషావిషయమునను, సంపూర్ణముగ సంస్కృతపొర తంత్ర్యము నంగీకరించి యాంధ్రస్వాతంత్ర్యము 'నాఁకటికిం గొనిపోయి" కర్ణాటకిరాటకీచకుల కమ్మినవారును, భాషావిషయ "మునఁగాని భావముల విషయమునఁగాని యే దేని యొకవిషయ మున నాంధ్ర త్వమును బోషించుచు వేవొకవిషయమున సంస్కృతసాహాయ్యము నంగీకరించి సమాన ప్రతిపత్తి గల బంధువులభాతి సాంధ్రమునకును 'సంస్కృతమునకును బాంధ ప్యముల గల్పించిన వారును నను మూఁడు తెగలకుం 'జెంది 'యున్నారు. యక్షగానములను జంగముకథలను పదములను ఏలపాటలును మొదలగు ప్రత్యేకాంధ్ర విలక్షణతను సూచించు కావ్యముల రచించినకవులు మన 'కెంతయు వంద్యులు. వీరి వలననే యాంధ్రత్వము నేటివఱకును జీవించి నశింపక, యేక థారగాఁ బ్రవహించుచు దినదినాభివృద్ధి. గాంచుచున్నది. నేఁటివఱకును బొబ్బిలికథయును, కాంభోజ రాజుకథయును, బాలనాగమ్మకథయును, పలనాఁటివీరచరిత్రమును, ధర్మాంగదచరి త్రమును, కామమ్మకథయును మొదలగునవి యాంధ్ర జనుల హృదయముల వశముఁ గావించుకొ సురీతిని గావ్య ప్రబంధ నాటకాదులు గావించుకొనఁజాలవు. నేఁటివఱకును యక్ష గానములును వీథి భాగవతములును ఆంధ్ర జనులకు నమితా