పుట:2015.372978.Andhra-Kavithva.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

304

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ట


సందాద్భుతరసములఁ గూర్చును. ఆంధ్రులకుఁ గల ప్రత్యేక నాగరకతాచిహ్నము లన్నియు జాతివిలక్షణము లన్నియు నీ కథలయందును, వీధినాటకములయందును, ఏలపాటలయందును, భక్తగీతములయందును, పడవవాండ్ర పోకిరిపదములయందును, కోలాటపు బాటలయందును, వినోదక ఖావళులందును వ్యక్తమగు రీతిని సంస్కృతసాహిత్య మ్యూదల సనుసరించి రచియింపఁబడిన 'కావ్య ప్రబంధాదులయందు వ్యక్తము గాదు. పై గ్రంథములయందుఁ బెక్కెడల సంసొరచ్యుతిఁ గల్లెడు. గాక, లోపము లుండుఁగాక, ఛందోభంగ మొద వెడుఁగాక, అట్టి లోపము లన్నియు, సంస్కారచ్యుతి యెల్ల ను, ఛందో భంగము లెల్లను,గుణాధిక్యము క్రింద దీపము క్రింది నీడయుం బోలె, వంకరతలపాఁగఁ జుట్టుకొని ముదుకబట్టలు కట్టుకొని సంస్కారరహీతములగు సంభాషణములు కొవించుచు 'మోటు మానిసిచందమున నరుగు దెంచు 'రెడ్డివీరుని హృదయాంతరాళ మున నడఁగి రగులుచుండు ప్రతాపాగ్ని యుంబోలె, జాల గుట్టలయొక్క తీఱు 'తెన్ను లేని సుందరాకారముంబోలె, శ్రుతీయు, లయయు, రాగమును లేకపోయినను నవ్య క్తమధుర మయిన పతులకలకలనినాదమునుంబో లె, నవ్యాజూనందమును గూర్పంజాలును.

సంస్కృత స్నేహాభిలాషులు.

.ఇఁకఁ బురాణాది గ్రంథరచయితలును గొందఱు కాన్య రచయితలును భాషా విషయముననో లేక భాపముల విషయము సనోయే దేనియొక్క విషయమున నే సంస్కృత సాహాయ్యమును గొని యాంధ్రమునకును సంస్కృతమునకును సరిసమాన ప్రతి.