పుట:2015.372978.Andhra-Kavithva.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

300

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ట



ప్రతిపాదనశక్తియు లేవనియు నట్టి శక్తి యలవడవలయునన్న నీ భాషలు సంస్కృతమునే యాశ్రయింపవలయుననియు, నందుచే సంస్కృతసాహిత్య నియమములును సంస్కృత కవిసమయము లును నాంధ్ర భాషయందు సర్వత్ర ప్రభుత వహించుననియు నయియున్నది. ఇందు సత్యము కొంచెమున్నను నసత్యము' మెండుగ నున్నది. సంస్కృతమునకుఁ గల గౌరవము అందలి కావ్యముల గుణాతిశయమువలనను, భాషా ప్రాశస్త్యమువల నను, గల్గినదిగాని కేవల ప్రాచీనతవలనఁ గల్గినది గాదు. అది 'యునుంగాక సంస్కృతమున నున్న కావ్యములు సర్వమును గుణవంతము లనియు, నేలోపమును లేనివనియుఁ జెప్ప నెంతటి "వెఱయయినను సాహసింపఁడు. దేశ కాలపాత్రముల వలనను, రాజుపోషణములవలనను ఈ రెండింటికన్న ను వేయి ముడుంగు లేక్కువగం గవుల నిస్తంద్ర స్వతంత్ర ప్రతిభావి శేష ములవలనను, సంస్కృత సాహిత్యము పేరును, వాసియుఁ గాంచినది. కాని క్రలగ్ర మేణ సంస్కృతమును క్షీణించి కుక పుల నాశ్రయించి యాలంకారికనియమశృంఖలాబద్దమయి స్వచ్ఛందసంచార మొనర్పంజూలక సూర్యుని వెలుఁగుఁ జూడఁజూలక రాత్రులమాత్రము సూక్ష్మ దృష్టిఁ గలిగి సంచ రించు మార్జాలాదులభంగా స్వాతంత్ర్య తేజమును గని వెఱఁ గందుచు నాలంకారికకల్పిత కారాగారముల నంధ కారముతో బైబిలాడుచుఁ దృప్తినొంది, క్షీణించి క్షీణించి, కరికరిభిద్దిరిగిరి భిత్కరిభిద్దిరిభి త్తనునట్లు చిత్ర కవిత్వపు మిణువురుల మెఱుంగు లకుఁ గనులు పెదటి కవిసమయములను జీవన ప్రాయములుగ గ్రహించి బ్రదుకుచు శల్యావశిష్టమయినది. నవకవితాప్రా చుర్యమున సొంపుమిగులు సంస్కృతకావ్యపథూటిని మన

-