పుట:2015.372978.Andhra-Kavithva.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

భావప్రకటనము.

299

________________



ఉత్పత్స్యతే స్తి మమ గో౽పి సమానధర్మా
కాలో హ్యయం నిరవధిర్విపులా చ పృథ్వీ.

అనుశ్లోకమునఁ జెప్పినరీతిని 'నిరంకుశాః కవయః' యను. సాహిత్యసూత్రమున నిర్వచింపఁబడురీతిని స్వాతంత్ర్యపథమునే తొక్కెను, నవత నిసర్గదూష్యము గాదనుటకుఁ గాళిదాసు మాళవికాగ్ని మిత్రమున

 శ్లో. పురాణమి త్యేవ న సాధు సర్వం
న చాపి కావ్యం నవమిత్య వద్యం
సంతః పరీ డ్యాన్యతరత్ భజంతే
మూఢః వర ప్రత్యయ నేయబుద్ధిః.

అని చెప్పిన శ్లోకమే ప్రబలమయిన తార్కా ణము; "కవికుల తిలకుండగు కాళిదాసుని మత మేమనఁ 'గావ్య, మున బుద్ధిమంతులు గుణదోషములనే విమర్శించి గ్రహింపు దగుఁగానీ, 'యిది కొత్త, యిది ప్రాత' యను తర్కము చేయం దగ దనియే. అట్లనుటలోఁ గావ్వముయొక్క నవత నిసర్గ దూష్యము గా నేరక యతరగుణములతోడి సాంగత్యమువలన గుణముగనో లోపముగనో పరిణమిం చును.

ఆంధ్ర పండితుల విపరీత వాదము.

ఈవిషయమయియే చెప్పవలసివచ్చిన దనఁగా, కొందఱు సాహిత్య విమర్శకులు 'రసము యావత్తు సౌందర్యముయావత్తు,, సంస్క.. తాదిపురాతనభాషల యంద కలదుగాని యిప్పటి భాష లలో నేమున్నడయ్యా!" అందురు. వీరి యభిప్రాయము • సంస్కృతాదిపురాతనభాషలయం దే రసమునకుఁ దావు గల దనియు, నాంధ్ర మాదిగాఁగల భాషలకు గౌరవమును రస.