పుట:2015.333901.Kridabhimanamu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'అదె నియద్వాహిని యదె మణికర్ణిక
    యదె కాశి నిఖిలకళ్యాణరాశి '- ఇత్యాది (కాశీ. 5-171)
అదె దారువభూమి--ఇత్యాదిసీస ()191 ప.) మును
దాని తర్వాతిది.
'తియ్యనివింటిజోరు రతిదేవిచనుంగన నొత్తిగిల్లి యె
య్యొయ్యన వంక చక్కబడ నొత్తెడు జూచితె
            పుష్పబాణముల్ ' (క్రీడా. 192 వ)

"ప్రతిభవన భిత్తిభాగంబునం జిత్రించిన చిత్తరువులయందుంగోరకితనేత్రత్రిభాగుండై కుసుమకంకవత్రంబుల వంకలొత్తుచు రతిదేవువృత్తస్తనంబులమీద నత్తమిల్లిన యున్మత్తచిత్తభవు విక్రమసంపత్తి ప్రకారంబును, బట్టపగలు యోజనగంధ యను గంధగజగమనవట్రువచమంగవ సూచి తొట్రుప్డువసిష్ఠపౌత్రుని దృష్టిప్రియత్వంబును నాచార్యుభార్య యగుతారాదేవిమీద దారకారాజు పఱపు చీటంబు వాటంబునేయు లలితకటాక్షవీక్షా విక్షేపములును, ధృతి మాలి మాలినీనైకతంబున నేకతంబున గురువెందపొదలో వేలుపులంజియ కెంజిగురుచవి సూచిన కుశిక నందను రాగావేశంబును గుసుమకోదండ జయడిండిమం బగు విభాండకసుతుని వనితామండలాసక్తియు బృందావనంబుయ్నందు ముకుందుం డినరించిన నందప్రజవధూవిహారాడంబరంబును నంబురుహసూతి యాడువట్టిం బట్టికొనినపట్టునుం బురుహూతుండు గౌతమకళత్రంబుమీద గల్పించిన చీకటితప్పును" (హర. 5-38)