మౌల్వీలు
ఖాన్, రహీం, మజ్నూషా, ఖుతుబ్ షా, సర్వర్ షా, షేక్ అలీ, షేక్ ఫర్మూద్ అలీ, షేక్ మన్నూ, సిరాజుద్దీన్, సయ్యద్ అహ్మద్, వజీర్ తదితరులు ఉన్నారు. (The Heroes of Cellular Jail, S.N .Aggarwal, Rupa & Co, New Delhi, 2006, Pp. 306 - 317)
ఈ మౌల్వీలతోపాటుగా ఢిల్లీకి చెందిన ముఫ్తి మహజర్ కరీం, లక్నోకు చెందిన మున్షీ ఇనాయత్ అహమ్మద్లు కూడ అండమాన్ జీవితాన్ని గడిపిన తొలినాి యోధులలో ఉన్నారు.
ప్రముఖ మౌలానా యహ్యా అలీ థానేశ్వరి అండమాన్ దీవుల్లో చనిపోయినప్పుడు ఆయన అంత్య క్రి య లలో పాల్గొ నేందుకు శిక్షలు అనుభ వి స్తున్న మౌల్వీలను
స్వాతంత్య్ర సమరయోధులను కఠిన శిక్షలకు గురిచేసిన అండమాన్లోని సెల్యూలర్ జైలు
అనుమతించారు. ఆ సందర్భంగా ఆయన జనాజా నమాజ్లో సుమారు నాలుగు వేల మంది మౌల్వీలు పాల్గొన్నారని మౌలానా జాఫర్ అలీ థానేశ్వరి తన డైరీలో రాసుకున్నారు. ఈ సంఖ్యను బట్టి బ్రిటిషు ప్రభుత్వం ఆ రోజుల్లో మొత్తం మీద నాలుగు వేల మందిని నిర్భంధించి అండమాన్ దీవుల పంపినట్టుగా అర్థమౌతుంది. ఈ విధంగా పంపబడిన వారిలో అత్యధికు లు సన్నిహితులకు, బంధు వులకు, కుటుంబీకులకు దూరంగా ఒంటరిగా గడపి కన్నుమూశారు. ఈ విధంగా దాశాబ్దాల పాటు అండమాన్ కారాగారంలో మగ్గిపోయి చివరకు కాలధర్మం చేసిన మౌల్వీలు వందల సంఖ్యలో ఉన్నారు.
109