హైందవ స్వరాజ్యము/తొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

తొమ్మిదవ ప్రకరణము.


భారతభూమిస్థితి, రైళ్లు.


చదువరి : భారతభూమిలో శాంతిక లదను భావము పెట్టు కొని నేసందుచుడినసంతుష్టిని మీరు పోనాడితిరి.


సంపా: మతనిషయమున మాత్రము నే నిదివరకు నాకు నా యభిప్రాయమును తెలిపినాను. భారతభూమి దారిద్ర్యమును గురించి నా భావములను తమకు తెల్పుచో తమరు నాయెడ నని ష్టముకలవారుకూడ కావచ్చును. ఏలయన, మీరు నేను ఇదివర లో ఏది భారతభూమికి ఉపయోగకరమని యెంచియుంటి మో అదినాకు ఇప్పుడు ఏమాత్రము పనికివచ్చునదిగా తోచదు.


చదువరి: అది యేమది ?


సంపా: రైళ్లు, వకీళ్లు, వైద్యులు దేశమును పేద చేసినారు. త్వరగా మేల్కొననియెడల మనకు నాశము సిద్ధము.


చదువరి : మనము ఏకీభవింపచాలక పోవచ్చుననుట నా కిప్పుడు స్పష్టమగుచున్నది. ఏసంస్థలు మంచివని ఇంతకాల మను కొనినామో వాని నే మీరిప్పుడు ఖండింపనున్నారు.


సంపా: దయచేసి ఓపిక పట్టవలయును. నాగరకమున నంత

ర్గర్భితమైయుండు కీడులను నిదానముమీద గాని మీరు గ్రహిం

47

భారతభూమిస్థితి : రైళ్లు.

డాక్టరుల నడగినయెడిల క్షయరోగి కొక గుణము నహజమని చెప్పుదురు. చచ్చనప్పుడుకూడ అత డింకను బ్రతికి యున్నట్లే భావించుచుండునట ! క్షయ బయట స్ఫుటముగా కాన్పించురోగము కాదు. రోగిముఖమునకు దివ్యమగు కాంతి నిచ్చి ఆరోగ్య మనంతమను మోహమున పడ వేయును. నాగర కము ఇట్టిరోగమే. మనము బహుజాగ్రత్తగా నుండవలెను.


చదువరి: మంచిది. రైళ్లనుగురించి సెలవిండు.


సంపా: రైళ్లే లేకపోయినచో భారతభూమిని ఇంగ్లీష వారు ఇంతపూర్ణముగా వశమున నుంచుకొన లేరనుట మీకు విది తమేగదా ! రైళ్లవల్ల నేకదా బొబ్బల మారి వ్యాపించినది ! రైళ్లు లేనియెడల ప్రజలు గుంపుగుంపులుగా ప్రయాణములు చేయు టకు నీలు లేదు. మహామారి పురుగులను అవి మోసుకొని వచ్చుచున్నవి. పూర్వము సహజముగానే ప్రత్యేకత్వముండినది. రాకపోకలు సులువైనందున ఎక్కడ ప్రియముగా అమ్ముననిన అక్కడికి రైతులు ధాన్యము ఎగుమతి చేసి వేయుదురు. అందు చేత క్షామములు నిరంతరమయినవి. ఇది రైళ్లవలన కలిగిన స్థితియే. ప్రజలు అజాగరూకులయి క్షామభాధ హెచ్చైనది. రై ళ్లు మానవుని దుస్స్వభావమును పెంచినవి.దుష్టులైన వారు శీఘ్ర తరముగ తమయుద్దేశములను నెరవేర్చుకొనుటకు అవకాశము

కలిగినది. భారతభూమి లోని పవిత్ర క్షేత్రములు అపవిత్రములయి
48

హైందవ స్వరాజ్యము.


నవి. పూర్వము ఈస్థలములకు ప్రజలు మిక్కిలి కష్టపడిపోవు చుండువారు. కాబట్టి నిజముగా భక్తికలవారే సాధాణముగా పోవుచుందురు. నేటి ఎందరో దురాత్ములు తమ దుర్మార్గ మును సాగించుకొనుటకు అక్కడకు పోయి చేరుచున్నారు.


చదువరి: మీరుమాటలాడునది పక్షపాతముగా నున్నది. క్షేత్రములకు దుర్మార్గులు పోవచ్చును. మంచివారును పోవ చ్చును. రైళ్ల నేల వీరు వినియోగించుకొనరాదు ?


సంపా : మంచితనము. నత్తవో లె నిదానముగా ప్రయాణము చేయును. కాబట్టి దానికి రైళ్లతో నెక్కువసంబంధ మక్కర లేదు. మంచి చేయుదలచు వారికి స్వార్థపరత లేదు. వారు తొందర పడ నవసరము లేదు. ప్రజలకు మంచితనము పట్టించుటకు దీర్ఘ కాలము కావలయునని వా రెరుగుదురు. చెడుగునకు రెక్కలు కలవు. ఇల్లు కట్టుట 'కేండ్లు కాన లెను. పడగొట్టుట పరమసుల భము. ఈ కారణములచేత రైళ్లు చెడుగును వ్యాపింప జేయుటకు సాధనములగుట సంభావ్యము. రైళ్లు క్షామమును వ్యాపింప జేయునా అనుప్రశ్న విమర్శనీయము కావచ్చును గానీ అవి చెడుగును వ్యాపింప జేయు సాధనమనుటకు మాత్రము సందే హము లేదు.


చదువరి : అది యెట్లై నను కాని భారతభూమిలో జాతీయత

45

భారతభూమిస్థితి: రైళ్లు

యనున వీ స తేజమును రైళ్లేకదా వ్యాపింపఁ జేసినవి. అదొక్క మేలు చాలదా?. అన్ని నష్టములను కప్పుటకు.

సంపా: ఇది తప్పని నాయభిప్రాయము.మనము ముందొక జాతిగా నుండ లేదని, మన మొక్క జాతి యగుటకు యుగములు పట్టునని ఇంగ్లీషు వారుమనకు నేర్పినారు. దీని కేమియు ఆధారము లేదు. ఇంగ్లీషువారు. భారతభూమికి రాకముందు మన మొక్క జాతిగా నే ఉండినాము. మనభావప్రపంచమంతయు నొకటే. మనజీవితమార్గమంతయు నేక మే. మనమందరు ఒక్క జాతిగా నుండినందుననే వారు రాజ్యమును నిర్మింపగలిగిరి. తరువాత నే వారు మనలను విభాగించినది.

చదు వరి: ఇది వివరించి చెప్పవ లెను.

నంజ : మనము ఒక జూతిగా నున్నందువలన మనలో విభేద ములే ఉండలేదని నేను చెప్పరాలేదు. చెప్పదలఁచిన దిది. మననాయకులు భారతభూమియంతటను బండ్ల మీదనో నడచి యో సంచారము చేయుచుండువారు. ఒండొరులభాష నేచ్చు కొనువారు. ప్రత్యేకత్వము పాటించువారుగారు. దక్షిణమున సేతుబంధరామేశ్వరము ఈశాన్యమున జగన్నాథము. ఉత్తరము న హరిద్వారము పుణ్య క్షేత్రములుగా నియమించిన మన పూర్వి కులయు దేశ మేమయి యుండునో చెప్పగలరా ? వారు వెర్రి

వారుకారుకదా ! క్షేత్రములలోవలె దేవ తారాధన ఇంటిలోనే
50

హైందవ స్వరాజ్యము.


చేసుకొనవచ్చునని వారెరుగుదురు. భక్తిప్రపూర్ణములైన హృదయములే గంగా ప్రవాహములని వారు మన కుబోధచేయ నే చేసిరి. కాని వారు భారతభూమి దైవనిర్మితమైన ఏకప్రదేశ మనుటను గురుతించిరి. అందుచేత అది ఏకజాతిగా నుండవలసిన దని తీర్మానించిరి. తదనుగుణముగా భారతభూమి పది చెరగు లను పవిత్రక్షేత్రములను స్థాపించి మరిభూలోకమున నెచ్చటను ప్రయత్నింపని భావోద్రేక పద్దతిని అనుసరించి భారత జాతీయతను స్థిరపరచిరి. ఇరువుగాంగ్లేయులు తా మొక్కటియనుకొ నుటకంటె ఇరువురు భారత పుత్రులు తామొక్కటియనుకొను టలో గాఢతరసంవేదనకలదు. మీరు, నేను నాగరికులమను కొనుమనము. ఏదో ఆకసమునుండి ఉట్టిపడిన గౌరవపదస్థు లమనుకొనుమనము వేరు వేరు జాతులకు చేరిన వారమనుకొను చున్నాము. రైళ్లు వచ్చిన తరువాత నే మనము విభేదములమాట మాట్లాడుకొన నారంభించినది. రైళమూలకముగానే ఈవిభే దములను పోగొట్టుచున్నా మందు రేని మీరట్లే యనుకొన వచ్చును. నల్ల మందు తినువాడు నల్ల మందు తినుటకు నేర్చిన పిదప తనకు చెరుపు తెలిసినది కాబట్టి తానునల్లమందు అభ్యాసము చేయుట మంచి దేయనుకొని నట్లుండును. నేను రైళ్లను గురించి చెప్పిన దంతయు మీరు జాగరూకులై ఆలోచింతురు గాక.


చదువరి: సంతసముతో నాలోచింతును. కాని నాకొక ప్ర

శ్న పొడకట్టుచున్నది. మీరు చెప్పినదంతయు మహమ్మదీయు.

51

భారతభూమిస్థితి: రైళ్లు


లకు పూర్వమునాటి భారత భూమికి అన్వయించుచున్నది. ఇప్ప టి మన భారతభూమిలో మహమ్మదీయులు, పారసీలు, క్రైస్త వులు అందరున్నారు. వీరంద రొకజాతి యెట్లగుదురు? హిందు వులు మహమ్మదీయులు ప్రాత వైరులు. మన లోకోక్తు లే అందుకు నిదర్శనములు. హిందువులు తూర్పుకు తిరిగిన మహమ్మదీయులు పడమటికి తిరుగుదురు. వారిని వీరు విగ్రహారాధకులని నిరసిం తురు, హిందువులు గోవును పూజింతురు. మహమ్మదీయులు సంహరింతురు. హిందువులు అహింసతత్వము నంగీకరింతురు. మహమ్మదీయులంగీకరింపరు. ఈరీతిగా ప్రతివిషయములో భేద ములు కలవు. భారత భూమి ఒక జాతి యెట్లు కాగలదు?