సౌగంధికప్రసవాపహరణము/ఉపోద్ఘాతము
ఉపోద్ఘాతము
ఈ ద్విపదకావ్యము క్రీ. శ. 1868 సంవత్సరమున చెన్నపట్టణములో నేలటూరి సుబ్రహ్మణ్యముగారి విద్యావిలాస ముద్రాక్షరశాలయందు పిళ్లారిసెట్టి రంగయ్యనాయనివారిచే ముద్రింపఁ బడి ప్రకటింపఁ బడియెను. ఆప్రతి నామిత్రులగు శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు నా కిచ్చి యందలి చరిత్రంశములఁగూర్చి వ్యాసమును వ్రాయఁగోరిరి. తర్వాత గ్రంథపీఠికభాగమును జదివి, ఆంధ్ర పరిషత్పుస్తక భాండాగారములోని తాళపత్రగ్రంథములను పరిశోధించి, లేఖకప్రసూదములను గొన్నిఁటి సంస్కరించి పరిషత్పత్రికసంచికలో (ఫిబ్రవరి-మార్చి-1937) నొక వ్యాసమును వ్రాసితిని.
రత్నాకరాన్వయుఁడైన ఈకవి భట్టుకులజుఁడు తండ్రిపేరు కృష్ణమరాజు, తనకులగోత్రములను గ్రంథమునందు చెప్పకపోయినను, ఈ రత్నాకరవంశజులు భట్టుకులమువా రని రత్నా కరము సుబ్బరాజు రచించిన తిమ్మభూపాలకాభ్యుదయములోని యీక్రింది సీసపద్యమువల్ల గ్రహింపనగును.
సీ. పృథుయజ్ఞవాటి నావిర్భవించిన వంది
నరవృత్తి యెవ్యరి వర్తనంబు,
బహువిధాభయదాన భాసమానపువిష్ణు
భంజశాఖ యెవ్వారి పుట్టినిల్లు,
శ్రీకాళహస్తిధాత్రీవల్లభ కటాక్ష
పంక్తి యెవ్వారికిఁ బ్రాణరక్ష
ననరపరసికుడా కవిపుంగవులను
గ్రహపాత్ర మెవ్వారి కవనశైలి
గీ. యట్టి రత్నాకరము వారి యన్వయమునఁ
బ్రభవమునుబొంది దామరప్రభులవలన,
నగ్రహారాదిబహుమతు లందియున్న
యార్యదరితుల మావారి నభినుతింతు.
ఈకవి ద్విపదభాగవతమును, సకలలక్షణసార సంగ్రహ మను వ్యాకరణగ్రంథమును రచించెను. సకలక్షణసారసంగ్రహముయొక్క వ్రాతప్రతి పరిషత్పుస్తకభాండాగారములో నున్నది కానిప్రతి శిథిలము. మొదలును తుదయు గ్రంథమునందు లేవు. ఈ గ్రంథములోని గద్య యిట్లు గలదు,
"శ్రీమద్వేంకటాచలాధ్యక్ష కరుణాసంలబ్దా సాధారణ ప్రజ్ఞావిచక్షణాక్షణ ప్రబంథాంకాంధ్ర శబ్దజాలలక్షణ బహుచిత్రకవిత్వరచనా చమత్కార రత్నాకర కృష్ణమరాజ గర్భరత్నాకరసుథాకర గోపాలసత్కవిరాజ ప్రణీతంబున సకలలక్షణ సారసంగ్రహం బను ఛందంబునందు" (పరిషత్పుస్తక భాండాగారగ్రంథసంఖ్య 3471 ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక ఆరవసంపుటము పుట 353)
భాగవతము దశమస్కంధము
పూర్వభాగముప్రతి ప్రాచ్యలిఖితపుస్తక భాండారమున నున్నది (సంఖ్య 784) ఈగ్రంథములోని అవతారిక భాగము నిం దుదాహరించుచున్నాను.
శ్రీకరమూర్తి దేశికచక్రవర్తి
భట్టమ శ్రీచెన్నభట్టామి బొగడి
గట్టిగా నాదిమకవులు గీర్తించి
దిట్టఁడై మాకవులు దీమసం బెంచి
రత్నాకరాన్వయరాజిత
రత్నాకర సుధాకరత్వభాసితుఁడు
రాజిల్లు కృష్ణమరాజనందనుఁడు
రాజిత సకలకళాతిచక్షణుఁడు
గోపాలసత్కవికుంజరుఁ డనఁగ
నేప్రొద్దు మహిలోన నింపొందువాఁడ"
ఇందలి శైలినిమిత్తము కొన్నిపఙ్తుల నిచ్చుచున్నాను.
“కలధౌత నవహేమ కవితవిశాల
నలినారిమండలోన్నతసౌధచయము
తారాపథోన్నత తపనీయతార
సార భాసురరత్నసౌధజాలములు
కమలానివాస సత్కళ్యాణవిభవ
రమణీయమందిరారామభూములును
అరుదైన వేదశాస్త్రాదివిద్యలను
పరమేష్ఠి మెచ్చని బ్రాహ్మణోత్తములు
మంత్రతంత్రోపాయమహిమలదేవ
మంత్రిని మెచ్చని మంత్రిపుంగవులు"
గ్రంథ ప్రాశస్త్యము
లింగభూపాలుఁడును, ఇతని తండ్రి తాతలును,
విజయనగరసామ్రాజ్య మేలిన సాళువ, తుళువ,
ఆర్వీటి వంశనరపతుల సామంతులుగ నుండి, గజ
పతులతోడను, అశ్వపతులతోడను, వారొనర్చిన
సంగ్రామములయందు సహాయులై, విజయములఁ
జేకూర్చుచుండిరి బాహుబలదర్ప శౌర్యసంపన్ను
లగు ఈకమ్మసామంతనాయకుల యుదంతము
తత్కులమువారే గాక అఖిలాంధ్రలోకమును
బ్రశంసింపదగినది.
కళింగ దిగ్విజయయాత్ర వెడలినప్పుడు తోడ్పడిన
వీరనికాయములో రావెలవంశీయులు గలరు. వీరు.. రాయలపక్షముననుండి సమరరంగమున గజపతి దళములతోఁ బోరాడినవిధము ఈక్రిందివిధమునఁ
గవి వర్ణించెను.
ఉ. రీనిగ నౌ కువారును గడిందిరహిన్ వెలుగోటివారలో
రావెలవారుఁ గూడుకొని రాత్రి పగల్ చతురంగసేనతో
నేనగఁ జూచినన్ తెలియనెంతయు శక్యముగాని దుర్గమా
భూవరమౌళి గాంచి యొకపూలునె గీసెద నంచు నుగ్రుఁడై (3-59)
విశ్వనాథనాయనిస్థానాధిపతి వ్రాసిన రాయవాచకములో గమ్మనాయకుల ప్రస్తావన గలదు (పుటలు 65,84).
సౌగంధికప్రసవాపహరణమునందు కవి వర్ణించిన విషయములు గొన్ని విజయనగరసామ్రాజ్య మేలిన సాళువ తుళువ ఆర్వీటువంశనృపాలురు కృతులందిన ఆంధ్రకావ్యములందును వర్ణితము లయ్యెను. లింగభూపాలుని మూలపురుషుఁ డగు మల్లభూపతి గుడిపాటి సమీపమున కుతుబుషాహి బలముల నెదుర్కొని యోడించి రాయలచే బిరుదు లందె నని కవి వ్రాసియున్నాడు, ఈ గుడిపాడు పూర్వము కొచ్చెర్ల కొటసీమలోని యొక గ్రామము. (ఈగ్రామ మప్పుడు నెల్లూరిజిల్లాలో ఆత్మకూరు తాలుకాలో నున్నది) పూర్వ మీకోటసీమ విజయనగరాధీశులచే రావెళ్ళవారు మన్నెరికముగా గ్రహించి, గుడిపాడులో నగళ్ల కోటను గట్టించుకొని యచ్చటనుండియే యాసీమను పాలించుచుండి రని దువ్వపాడు కైఫీయతులో నున్నది.[1] సాళువ నరసింహరాయు లోకవంక గజపతులతోడను, మఱియొక ప్రక్క ఆశ్వపతుల తోడను యుద్ధము లొనర్చినసంగతి చరిత్ర ప్రసి ద్దము. ఆతనిశాలములోఁ దెలింగానా బహమనీ సుల్తాను సామంతుఁడుగ కూలీకుతుబుల్ ముల్కు అనునాతఁడు పాలించు చుండెను. ఇతఁడు క్రీ. శ. 1495 సంవత్సరము మొదలు క్రీ. శ. 1512 సంవత్సరమువఱకు సామంతుఁడు గనుండి, తర్వాత సుల్తానుని ద్రోసిరాజని ఆకడపటి సంవత్సరముననె కుతుబుశాహ యన నామమును దాల్చి స్వతంత్రుండై గోలకొండ నుండి పరిపాలన మారంభించెను, ఆ కాలమున బీజపూరు, బీదరు, తెలింగానాలను బాలించెడు నవాబులఁదఱును విజయనగర రాజులతోఁ దఱచుగాఁ బోరాడు చుండిరి. మల్లభూపాలుకు పోరాడినది యీకుతుబుశాహతోనై యుండును కుమారుఁడగు తిప్పభూపతియు సాళ్వనరసింహరాయల పక్షమున గజపతులతోఁ బోరాడి యుండును.
ఈ మల్లభూపాలుని పరాక్రమము వర్ణించు చాటువులు గొన్ని కలవు.
ఉ. అల్లవె కన్ముమూఁకలఁట నావల రావలవంశచంద్రుఁడౌ
మల్లయభూపదుర్బర సమగ్ర బలంబులు మండలాగ్రమున్
ఝల్లపుటీ మొఖసుని కంతకుటెక్కెము భుజదీర భూ
వల్లభ మల్లిఖార్జునుఁడుపంతము గెల్చెను ధాత్రి లోపలన్.
చ. గెలుపుల రాజ ! రాజహితఖేలన దాతల సార్వభౌను ! ని
శృలగుజరొ ల యాదవనికాత్ర వదుర్గ ఫాల మన్నె మూఁ
కలకలగుంచి గండానే హార కల్తసకాండ' ప్రరెవ్వ కుర్వి నీ
కలఘుపరా క్రమ క్రమణి తార్జు రావెల మల్లిఖార్జునా!
సీ. దురమందు సరిచరకరినుటలను గన్న
బూని డొక్కలు చిన్దపొడిచి మిశరి
సమరశాత్రన వీరసైంధవములఁ గన్న
కొమ్ములహు మ్మంచు గ్రుచ్చి యెత్తి
మార్కొన్న నగర రామన్నె గిబ్బులకు సర్
భురపు గూహకరజస్ఫురణ సడఁచి
మాకు గులాములై నూఱోడ్డు నరిరాజ
వృషభంబులను నెక్కుటెడ్లఁ జేసి
గీ. సందులకు మన్నె గిబ్బల వాసీ యుడిషి
రంకె లిడుచుండు సవృషశంకరుండు
సమరరఘురామ ! రావెళ్ల సార్వబౌమ
వైగిహృద్భల్ల ! యుద్ధండ వీరమల్ల !
సీ. గగ్గోలురాయనిగహ్వరం బే చాలు
సహితభూపతిగర్వ మపహరింప
ప్రతిపక్షసార్వభూపతిమాత్రమే చాలు
గడిదుర్దముల కెల్ల దుడుకుఁ జూకు
జగతి గొపాల నీసాహస బే చాలు
వైరుల పురములఁ జూఱలాడు
గండరగండడణ్గిండి కాఁడే చాలు
విగమించు మన్నిల వెన్నుఁదన్న
గీ. అనుచు నృపతులు మూండుసింహసనముల
బ్రస్తుతింతురు దేవ నీపౌరుషంబు
సమర రఘురామ ! రావెళ్ల సౌర్వభామ
వైరి హర్భల్ట ! యుద్గండవిగమల్ల
య్యవభూపాలునికుమారుఁ డగు తిస్పనృపతి కందనవోలు ఆడివనీకోటలను ముట్టడించి గెలుపొందె నని కవి వర్ణించి యున్నాఁడు, ఆళీయరామ రాయలతాతయైన రామరాజు సాళ్వనరసింహరాల సామంతుఁడుగ నుండి యతని దండనాయ కుఁడై యాతని యాజ్ఞానుసారముగ కర్నూలు కోటను ముట్టడి వేసినట్లు చరిత్ర వల్లఁ దెలియు చున్నది.[2] పై విషయమె రామరాజీయనసుచరిత్ర కావ్యములందును, ద్విపద, పద్య బాల భాగవతము లందును వర్ణితము. రావురాజీయములో,
సీ, మదకరి కొకటి కిర్వదిగుఱఱ ములు గుఱ
మునకును విలూండ్రు, ముగురు చిచ్చు.
కత్తులణా రీటికారిడ్రక్కు వర్తిల్లి
నిట్టి యేనుఁగులను బట్టి మూఁడు
వేలయేమాఁలు మద్వృత్తితో నడపంగ
గందనోల్పాధింపఁగాఁ దలంచి
మొన ద్రుంచి గట్టిగా ముట్టడి దిగిన నా
బిబ్బిని మిక్కిలి యుబ్బణం చి
గీ. ప్రకటనప్తాంగములఁ గోని రామవిభుఁదు
కందనొ బ్రాజిధానియుఁ గాఁగ వసుమ
తియును నేలి మహాహవదీక్షఁ బూనె
బలిమి కలిమి నాశౌవనిపకులని జెనుకు,
వసుచరిత్రములో,
గీ. ఆతఁడు మతిమంతుఁ డతిశాంతు డరికృతాంతుఁ
దను పమస్వాంతుఁ డాశ్రితవనసంత
ఢన ఘతరకందనోలి మహాపురీని
శాంతుడగు రామ మేదినీ కాంతుఁ డలరు,
ద్విపద బాల భాగవతములో,
రామనృపాలుండు రాజేంద్రుఁ డొదవె
నెందు నెన్నఁగఁ వాల నిద్ధశౌర్యమునం
గందనవోలి దుర్గంబులో నుండి
బుక్కయ రామభూభుజుఁ డెల్ల నృపులు
నెక్కువ యిది యని యొన్నంగఁజారి
వీరులం డెబ్బది వేవురాశ్వికులు
చేరి కొల్వంగవచ్చిన సవా నెదిరి
కలనంది పంచబంగాళంబు నెసి
గెలిచెఁ దచ్చరితంబుఁ గీర్తింపఁదరమె. !
పద్యబాలభాగవతములో,
వేడ్కన్ గొల్వఁగాఁ గిన్క పె
న్మబ్బుల్ గప్పఁగఁ గండవోలు కొను
వేడ్కన్ జుట్టుముట్టన్ సహ
చిబ్బీ సుబ్బణగించితోలె సరి
రాడ్బీముండు............
........బుక్క
భూవిభుని రామాధీశుఁ డాహా యనన్రా[3]
లింగభూపాలుని కుమారు లగు కొండనృపతియు, అయ్యపవనాయకుఁడును, తిమ్మరాజు అతని కుమారుఁడు అళియ రామరాయల కాలములో సామంతదండనాయకులై మహమ్మదీయ వైరినికాయములఁ జెండాడుచుండి రని తెలియుచున్నది. కొండనృపతి మానవపురి చెంత నేదులఖానుని జయించినట్లును, అయ్యపనాయకేంద్రుడు రామరాజదత్తకిరీట రమ్య భూషణుఁడై నట్లును కవి వర్ణిం చినాఁడు. ఇట్లె అళియ రామరాయలతండ్రియైన తిమ్మరాజు మానవపురికడ వేదులఖానుని జయించినట్లును, ఆదవేని దుర్గమును సాధించినట్లును ద్విపద, పద్య, బాలభాగవతములందును వర్జింపఁబడెను.
ద్విపద బాలభాగవతములో,
"రాజచంద్రుడు రామరాజు తిమ్మయ్య
...............
కడిమిన్నె మానువకడరదొణి,
గడుపరి నేదులఖాను జయించే
విక్ర మంబున నాదవేని దుర్లంబు
విక్రాంతు లెన్నంగ చేసేగ సాధించి"
పద్య బాల భాగవతములో
సీ. మానువకడ నవాబూనిపొ రణబరా
జయము నొందించెనే శౌర్యశాలి[4]
పై విషయమే ముక్క తిమ్మ నార్యకృతపారిజాతాపహరణమునందును జెప్పఁబడినది. కృష్ణదేవరాయట తండ్రియైన ఈశ్వరనరసింహరాయలు మానవేంద్రు నోడించిన విషయము ఈ క్రిందిసీస పద్యము పాదమున మనోహరముగా, కవి వర్ణించి యున్నాడు.
" పారశీకునకు దుర్బరమానవత్వంబుఁ
దొలగించె మానసదుర్గసీమ.."
కృతిభర్త - లింగభూపాలుఁడు
ఈలింగభూపతిని భాస్వద్భుజా వీర్య నిర్దళితా రాతునిగాఁ గవివర్ణించెను, ఇతఁడు సుల్తానీ అబ్దుల్ పాదుకాహాము జయించి యతనిని వెనుగొండ వఱకును దఱిమి వేసె ననియు, డాబాలు పైబడి డాగులు చేసె ననియు, దళవాయి వెంకటధరణీశుచే మెప్పులువడసె సనియుఁ దెలియుచున్నది. ఇతఁడు నరపతిసింహాసనస్థాపకుఁ డనియు, నరపతి దత్త నానారత్న భూషకరితురంగశతాంగఘస భాగ్యుఁ డనియు వర్ణింపఁబడెను. పైని జెప్పఁబడిన సుల్తాని, గోలకొండనవాబగు అబ్దుల్లా ఇతఁడు గోలకొండను క్రీ.శ. 1612-1670 వఱకును బాలించెను. పైని నుడువఁబడిన నరపతి వెనుగొండ నేలిన పెదవేంకటపతిరాయలు క్రీ.శ.(1630-42), సుల్తానీ అబ్దుల్ పాదుషాహ, దక్షిణ దేశముపై దండెత్తివచ్చి క్రీ. శ. 1638 -42 ప్రాంతముల ఇప్పటి నెల్లూరుజిల్లాను బూర్తిగ జయించి తన మాండలికుల నియమించెను. ఈతఁడె వెనుగొండ నేలుచుండిన పెద వేంకటపతిరాయలపై దండెత్తి రాఁగా రాయల సహాయార్థము లింగభూ పాలుఁడు దండు వెడలి, సుల్తానుని బలాయను గావించి, రాయలను వెనుగొండలో సుస్థిరముగ నిలిపి యుండవచ్చునని యూహించుచున్నాను. ఈయుద్ధములో లింగభూపాలుఁడు దళవాయి వేంకటధరణీశుచే మెచ్చులందె నని కవి వ్రాసినాఁడు. ఈవేంకటధరణీశుఁడు వెలుగోటి వెంకటపతినాయనింగారు గానోపు. నెల్లూరు ఉదయగిరి సీమల నీతడు రెండవ వెంకటపతిరాయలచే నమరముగ బడసెను.[5] క్రీ. శ. 1640 తర్వాత నీప్రాంతమంతయు గోలకొండ నవాబు వశమయ్యెను. (నెల్లూరు జిల్లా) ఇప్పటి అనంతపురము, చెంగల్పట్టు, కడప, తిన్నవిళ్లి, మైసూరుప్రాంతములు వేంకటపతిరాయలపరిపాలనక్రిందనే యుండెను.
లింగభూపతి “డాబాలుపై బడి డాగులుచేసె నని” కవి వర్ణించెను. ఈడబాలు అనునది పశ్చిమతీరముననున్న డాబుల్ (Debul)పట్టణ మేమో యని సందేహము గలుగుచున్నది. ఆకాలమున ఆపట్టణము పోర్చుగీసువారివశమున నుండెను. ఆ పట్టణముపై దండువెడలుటకును, పోర్చుగీసువారికిని, విజయనగరసామ్రాజ్యాధీశులకును బోరాట మేల సంభవించెనో తెలియదు. ఈవిషయము పరిశీలింపదగినది. శాసనములందలి రావెళ్లవారిచరిత్ర
నెల్లూరిజిల్లా శాసనసంపుటములనుండి రావెల వంశీయులగు మఱికొందఱు కమ్మనాయకులచరిత్ర తెలియవచ్చుచున్నది. రాజరాజదేవుని పండ్రెండవ పరిపాలనసంవత్సరమునం దొక రావిళ్ల నాయకుని ప్రస్తావన గలదు. ఇదియె రావిళ్లవారినిగూర్చి చెప్పెడి యత్యంతమైన ప్రాచీనశాసనమును, బ్రథమశాసనమునై యున్నది. [6]వీరిలోఁ గొందఱు నెల్లూరు జిల్లాలో నుదయగిరి, పొదిలి, కొచ్చెర్లకోట సీమలఁ బాలించుచుండిన సామంతనాయకులు గలరు. వీరును వెల్లుట్లగోత్రులే. పొదిలి సీమను బరిపాలించిన రావెల తిప్పానాయకుఁడును, ఉదయగిరిసీమను బాలించిన రావెల కోనేటి చినతిమ్మానాయకుఁడును ముఖ్యులు. సౌగంధికప్రసవాపహరణములోని రావెలవంశీయులకును, శాసనములందలి రావెలవారికిని బరస్పరసంబంధము వీరివంశావళినిబట్టి నిర్ణయించుట దుర్ఘట ముగా నున్నది, భావిపరిశోధనమునఁగాని బయలుపడదు.[7]
కర్నూలు జిల్లాలో శ్రీగిరిమండలమేలిన మఱియొక రావెళవంశీయులు గలరు, వీనివంశ మీ దిగువ నీయఁబడినది.
ఈకడపటి మల్లభూపతి కర్నూలుజిల్లా వెంకటాద్రి పాలెమునందు క్రీ. శ॥ 1612 లో వ్రాయించిన శాసనమునుబట్టి, యితఁడు శ్రీశైల ప్రాంతమును బరిపాలించుచుండె నని తెలియుచున్నది. ఈశాసనములో నితఁడు తపపూర్వులు మన్నెరికముగా సంపాదించిన కొచ్చెర్లకోట రీమలోని సిం గారికొండ, బట్టెపాడు అను రెండు ప్రాంతములును, వెంకటాద్రిపాలెములోని (ఇప్పటి మార్కాపురముతాలూకా) చెన్న రాయస్వామివారి యుత్సవముల నిమిత్తము దానము చేసె నని తెలుపఁబడిసది.[8] సౌగంధీక ప్రసవాపహరణములోని మల్లభూపాలుని వంశమునకును, ఈమల్లనాయకుని వంశమునకును సంబంధ మున్నట్లు గనఁబడదు.
చెన్న భట్టరు - దేశికశిఖామణి
ఈకవి రంగనాయకపాద రాజీవయుగ్య సేవకుఁడగు శ్రీ చెన్న భట్టరాచార్య గురువ రేణ్యం బొకనిని స్తుతించెను. ఈ చెన్న భట్టరాచార్యుఁడు లింగమగుంట తిమ్మకవియు, నతని సమకాలికుఁడగు తెనాలి రామకృష్ణుఁడును వారి వారి గురువుగా వర్ణిం చిన చిక్కభట్టరాచార్యుడేమోయని తలఁ చెదను.
క. గురురాయ పట్టభద్రుని
నరహరు శ్రీరంగనాయకాంశభవున్ భ
ట్టరుచిక్కాచార్యులు మ
ద్గురుఁ దలంచుచు నడుగులకు సతుల్గా నింతున్,
తిమ్మకవి --చతుర్వటికా మాహత్యము
క. వాక్కాంతాశ్రయభట్టరు
చిక్కాచార్యులు మహాత్త్ము శ్రీ గురుమూర్తిన్
నిక్క పుభక్తి భజించెద
నిక్కాన్యకళాకలోక మీడేఱుటకున్,
రామకృష్ణకవి -- పాండురంగమహత్త్యము.
పాండురంగమాహాత్మ్యము. క్రీ.శ 1565 ప్రాంతమున రచింపఁబడెనని శ్రీ రామకృష్ణకవిగారు నిర్ణయించినారు. క్రీ. శ॥ 1584 సంవత్సరమున రచింపఁబడిన కామందకకృతీలో దత్కృతికర్తలను వేంకటరామకృష్ణకవులు పై చిక్కా చార్యుని గృతిపతి సంబోధనమునఁ జేర్కొ నిరి,
క. శ్రీ చంచద్భట్టకు చి
క్కాచార్య- వర్య శిష్యయతులిత శౌర్య
ప్రాచుర్యవీర్య, గుణర
త్నాచలజయలలితదైర్య నయతత్వ్యనిధీ.
గోపాలకవియు దేశచక్రవర్తి యగు గురువు నీ క్రింది విధముగ స్తుతించెను
"చిరతరకీర్తి దేశికచ క్ర వర్తి
రంగ నాయశ పొదరాజీవయుగ్మ
సంగత వటుహృదంచితచంచరీక
భట్టరు శ్రీ చన్న భట్టరాచార్యు"
కథ - శైలి.
సౌగంధిక ప్రసపవాహరణమును గూర్చిన విషయము మహాభారతములోని అరణ్యపర్వమునందు గలదు. (ఆంధ్ర మహాభారతమున, అరణ్యపర్వము, తృతీయచతుర్థాశ్వాసములు) మూలములోని కథను బెంచి, కవి మూఁడాళ్వాసములలో నీయితి వృత్తమును రచించెను. హనుమద్దర్శనమును, యక్షరాసులతోడి యుద్ధమును మణీమ ద్వదయు మొదలైన వృత్తాంతములు నందును నిందును గలవు, భారతములోని కథచొప్పున ధనంజయుఁ డీసమయమున నమరావతి యందుండెను. ఈకథలో నర్జునుఁడు దేవలోకమునుండి వచ్చుటయు, యక్షనాథునితో యుద్ధ మొనర్చుటయుఁ, గౌరవులు పాండవులకుఁ దోడ్పడుటయు, నారదాగమనము, హరిహరాదుల పోరాటము, చతురాస్యుఁడు సత్యలోకము నుండివచ్చి శివకేశవుల శాంతంబు నొందించి, హతులైనవారిని బ్రదికించి, యుద్ధము విరమింపఁ జేయుటయు, మొదలగు నూతన విష యములను గవి కల్పించి, మనోహరముగ వర్ణించినాఁడు. కవి రసజ్ఞుఁడు. కవిత నిర్దుష్టము, ఈకావ్యము కవితాకల్పనమున గోప ప్రధాని ప్రణీత ద్విపద కృష్ణార్జున సంవాదమునకన్న మిన్నయైనది. కావ్యశైలిని దోనేరు కోనేరు కవికృత బాలభాగ వతమున కించుకేనియుఁ దీసిపోవదు. లింగభూపాలుని కీర్తికాంతావర్ణనము (పుట 43) సూర్యాస్తమయవర్ణనము (పుట 141) రసవత్తరములు.
ద్విపద సౌగంధిక ప్రసవాపహరణకావ్యమును గోపాల కవి వంశము వాఁడైన రత్నాకరము అప్పప్పకవి పద్యకావ్యముగ రచించెను, కానీ కవిత్వము పేలవముగా నున్నది ఈగ్రంధము చెన్నపట్టణములోని వెస్టువార్డు కంపెనీ వారిచే క్రీ. శ 1937 సంవత్సరములో ప్రచురింపబడినది. పీఠికలోని సీసపద్యభాగము నిందిచ్చుచున్నాను.
సీ, రత్నాక రాన్వయ రాజ శేఖరుఁడైన
దుధ్వంశకర్త సన్మానధరుఁడు
గోపాలరాజు రూపింపఁబడినట్టి
దివ్యసౌగంధికద్విపదకావ్య
మప్పప్ప పద్య కావ్యంబుగా రచియింపఁ
దలఁచి భూసురులకు దండ మొసఁగి
కృతజ్ఞత.
రత్నాకరగోపాలకవిని గూర్చి మొట్టమొదట శ్రీనిడుదవోలు వేంకటరావు గారు విజయనగర కళాశాల వారిమాసపత్రిక (1929) సంపుటము 7, 2.వ సంచికలో నొక వ్యాసము వ్రాసిరి. తర్వాత తద్గ్రంథములోని చారిత్ర కవిషయముల 1937 సంవ త్సరములో నాంధ్ర పరిషత్పత్రికయందు బ్రకటించితిని. వావిళ్ల భాషోద్ధారకులగు శ్రీ వేంకటేశ్వర శాస్త్రిగారు నాకొర్కె పై గ్రంథమును బ్రకటింతుమని 1939 సంవత్సరము జనవరి నెలలో నాకొక లేఖ వ్రాసియుండిరి. ఇంతలో యుద్ధమారంభ మగుటయు, కాకితములకు గఱ వేర్పడుటయు, సంభవించెను, శ్రీ వేంకట రావు గారు ఉద్యోగ దేశ
మునఁ జెన్న పట్టణము వచ్పుటయు, గ్రంథ ప్రకటనమున కుద్యుక్తులైన శ్రీశాస్త్రి గారికి గ్రంథ ముద్రణము గూర్చి ప్రోద్బలము గలిగించుటయు సంభవించినది. వెంటనే గ్రంథము ముద్రణము ప్రారంభించి, వారు నా కెరుగపఱచిరి. భాషోద్ధారక నామమును వారి కన్వర్ణ నామ మగుట కట్టికార్యములే గదా కారణములు! ఈ పీఠిక వ్రాయుటకు నాకు సాయ మొనర్చినవారు శ్రీ వేంకటరావుగారును, శ్రీసోమశేఖరశర్మ గారును; శ్రీ నేలటూరి వేంకటరమణయ్యగారి వ్యాసములును నా కుపయోగపడినవి. కమ్మచరిత్ర కారులగు శ్రీ క్రొత్త భావయ్య చౌదరి గారు వారు రచించిన చరిత్రలో నా మొదటి వ్యాసములోని విషయములు గ్రహించి, యావిషయము గ్రంథములలో నుల్లేఖించిరి. ఈ పీఠికరచన యెడల వారి గ్రంథమును బరిశీలించితిని, పై వారి యందఱకు నానమోవాకములు, పరిషత్పుస్తక భాండాగారములోని తాళపత్ర ప్రతుల నాకోసంగి, అడిగినతత్ క్షణము నాకు కావలసినవిషయ సామగ్రి కార్యాంతరవ్యగ్రుఁడయ్యును బంపించుచుండిన, పరిషత్కార్యదర్శియు, నామిత్రుఁడు నగు రాఘవాచారి (ఎం. ఏ, బి, యల్.) గారికి నమస్కారములు.
లేఖకదోషములు, ముద్రణస్ఖాలిత్యములు సవరించుటకు అవకాశము నాకు లభింపలేదు. ఈప్రమాదము మానవప్రకృతి. పాఠకులు మన్నింతురుగాక! దోషములు రెండవముద్రణకాలమున సంస్కరించెదము.
5-2-1949
కుందూరి ఈశ్వరదత్తు
- ↑ ఈతాలూకాలు విజయనగరంవారు రావిళ్ల వారు ఆనే కమ్మవారికి మన్నెరికానకు యిచ్చి, యింకా కొన్ని తాలూకాలు వారి స్వాధీనం చేసిరి గనుక వారు యీ దువ్వపాటి పూర్వాన్న నాలుగు క్రోసులమీద కోటపీసులో గుడిపాడు అనే గ్రామంలో కోట పెట్టించుకొని, నగళ్లు కట్టించుకొని యీదువ్వపాడు తాలూకా ప్రభుత్వం చేసినారు (మేకంజీ వ్రాత ప్రతులు 15-6-19)
- ↑ Kurnool District Manual. P. 24
- ↑ రామరాజీయము పుట. 38, 39; పద్యము 209. వసుచరిత్ర ఆశ్వాసము. 1, పద్యములు 29, 30. ద్విపదబాలభాగ వతము, ప్రథమస్కంధము. ష.191-195.శ్రీ నేలటూరి వేంకటరమణయ్యగారు పద్య భాలభాగవతము నుండి వ్రాసిన పద్యములు భారతి పత్రిక. సంపుటము. 6. సంచిక 6.
- ↑ ద్విపద బాల భాగవతము చెన్న పట్టణములో వేదము ఆండు కంపెనీవారు వారి విజ్ఞాన గ్రంథమాలికలో ముద్రింపఁబడినది కాని అసమగ్రము, ఇది పూర్తిగ ముద్రింపవలసిన భారము భాషోద్ధారకులకు శ్రీ వేంకటేశ్వర శాస్త్రీ గారి పై నున్నది పద్యబాల భాగవతమునుండి కొన్ని పద్యములు శ్రీ వేంకటరమణయ్యగారు రచించిన బాలభాగ వతపిఠిక నుండి గ్రహింపఁబడినవి. (భారతీసంపుటము, 6, సంచిక, 6.)
- ↑ Nellore District Gazette Vol. I. Page 63. లేదా వెంకటధరణీశుఁడే పెదవెంటపతిరాయలు గావచ్చును. ఈ పెదవెంకటపతిరాయలు, రెండవరాయలకు (1614-1690) సామంతుడుగ తిరుచునాపల్లిఖండము నేలుచుండెను. మొదటి వెంకటరాయల మరణానంతరము సంభవించిన కుటుంబకలహ, రాజకీయవిప్లవములందు, రామరాయలకు వెంకటపతిరాయలు సహాయుఁడై, యాతనిరాజ్యమును స్థిరముగఁ బ్రతిష్టించియుండవచ్చును. ఆకాలముననే సుల్తానితో యుద్ధముపొసఁగియుండును. కాని యీయుద్ధము మూఁడవ శ్రీరంగరాయలకాలమున సంభవించియుండుననియు, సుల్తాని, రాయల పెనుగొండను స్వాధీకపఱచుకొనుటయందు సహాయుఁడై వచ్చియుండునని శ్రీ వెంకటరమణయ్యగారు తలంచుచున్నారు. (Sources of Vijayanagar. Vol I. P. 369)
- ↑ B. V. Nellore Inscriptions. S (6)
- ↑ నెల్లూరిజిల్లా శాసన సంపుటములలో నీ క్రింది శాసన ములఁ బరిశీలింప నగును. D. 35. G. 52, G 84, N. 33: N. 124, G. 112, P. 19.
- ↑ Para 55 of to Epigraphical report 1923. 1924. Vide No. 423 of 1923.