సూచిక చర్చ:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

సంస్కృతంలోని కథాకావ్యం శుకసప్తతి గద్యంరూపంలో వ్రాయడం జరిగింది. ఇప్పుటికి ఈ కావ్యం కూర్చినదెవరో తెలియడంలేదు. దీనిలో 70 కథలున్నాయి. ఒక ధనికుడు దూరప్రయాణం వెళ్ళగా ఆయన పెంచుకునే శుకము(చిలుక) తప్పుదారిలో వెళ్ళే యజమాని భార్యకు ప్రతిరోజూ మొదటిఝాములో మొదలు పెట్టి తెల్లవారు వరకు కథలు చెప్పేది. ఆ కథలు 70. వీటిలో ఎక్కువభాగం శృంగారం వుండటం చేత మనోరంజకంగా ఆసక్తిదాయకంగా ఉండటంవల్ల ఇవి ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. సంస్కృతంలో శుకసప్తతికి రెండు ప్రతులు దొరకుతున్నాయి. వాటిలో ఒకటి చింతామణి భట్టు, రెండవది ఒక శ్వేతంబర జైనసాధువు రచించారు. భారతీయభాషల్లోనేకాక మలయన్, మంగోలియన్, టర్కిష్, ఇంగ్లీష్, జర్మన్, ఇటాలియన్ మొదలైన విదేశీభాషల్లోకి అనువదించబడ్డాయి. 14వ శతాబ్దంలో ఈ కథలను తుతినామా అనే పేరుతో పర్షియన్ భాషలోకి అనువదించారు.


తెలుగులో పాలవేకరి కదిరీపతి నాయుడు కూర్చినట్లు చెప్పబడుతున్నది. ఈయన కదిరి ప్రాంతాన్ని పాలించినట్లుగా చెప్పబడుతున్నది. కదిరి వీరేశలింగంగారు నెల్లూరు జిల్లాలో ఉన్నట్లు చెప్పారు కాని అది ఒకప్పుడు కడపజిల్లాలోను ఇప్పుడు అనంతపురం జిల్లాలో కనబడుతున్నది. ఈయన సంస్కృతాంధ్రల్లో సమానమైన ప్రజ్ఞకలవాడు. ఇతను కవిత్వం సమయోచితములైన వర్ణనలతో కొత్తరుచుల్ని పుట్టిస్తూ ప్రౌఢమై హృదయంగమంగా రచించారు.

ఆసక్తికరంగా ఉంది. సమయం ఉన్నపుడు పాఠ్యీకరణలో పాల్గొంటాను.- రవిచంద్ర (చర్చ) 17:09, 30 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]