Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/ఛత్రపతి శివాజీ మహారాజు

వికీసోర్స్ నుండి

ఛత్రపతి శివాజీ మహారాజు :

పండ్రెండవ శతాబ్ది తుది భాగమున భరత ఖండము నందు మహమ్మదీయ ప్రభువుల యధికారము నెల కొనిన నాటినుండియు, హైందవ ధర్మానుయాయులకు చెడ్డరోజులు ప్రారంభించెను. మహమ్మదీయులు పాలకు లుగా నుండి హిందూ ధర్మమును, సంస్కృతిని రూపు మాపుటకై సర్వవిధముల యత్నించి కొంతవరకు కృతా ర్థత చెందిరి. ఈ ఘోర విపత్తునుండి హైందవులను కాపా డుటకై యత్నించినవారిలో ముఖ్యులు రాజపుత్రులు, మహారాష్ట్రులు అని చెప్పవలసి యున్నది. కాని వీరన్యోన్య సహకారముతో మెలగని కారణమున వీరి ఆశయములు సంపూర్ణముగ ఈడేరలేదు. హైందవ ధర్మ పునరుజ్జీవన మునకై మహారాష్ట్రమున గొప్ప కృషిసల్పిన మహా పురుషుడు సమర్థ రామదాసస్వామి. ఈయన యందు ఆధ్యాత్మిక త త్త్వమును, ధర్మోద్ధరణాభిలాషయు మూర్తీ భవించెను.

ఈ స్వామి కేవలము ముముక్షువు కాడు. సాంఘిక ముగ, రాజకీయముగ నానాటికి పతన మగుచున్న హిందూ సమాజమును అభ్యున్నతికి తేవలయునను పవిత్రాశయము కలిగినవాడు. ధీరోధాత్తుడైన శివాజీకి ఆయన కర్తవ్యోప దేశము చేసి కర్మయోగిగ శివాజీని తీర్చిదిద్ద గలిగెను. శివాజీ మహారాజు జీవితము ధర్మ ప్రపూర్ణము, వీరరస విలసితము. మహారాష్ట్ర జాతిలో జాతీయభావములను పెంపొందించి, వారిలో నిక్షిప్తములై యున్న మహాశక్తు లను విజృంభింపజేసి, రాజ్య నిర్మాణశక్తిని ప్రసాదించి, దేశోద్ధరణము గావించినవాడు ఛత్రపతి శివాజీ మహారాజు.

మహా రాష్ట్రుల యుదంతము శివాజీకి పూర్వమంతగా తెలియదు. మహారాష్ట్ర ప్రాంతమును, రాష్ట్రకూటులు, చాళుక్యులు, యాదవులు పరిపాలించిరి. పదునాల్గవ శతాబ్దమున దేవగిరి యాదవరాజులు అలావుద్దీన్ చక్ర వర్తిచే పరాజితులైరి. పిదప బహమనీ సుల్తానులకు లోబడి వారి రాజ్యము చీలికలైన తర్వాత కొంత భాగము అహమద్ నగర సుల్తానులకును, కొంత ప్రాంతము బీజా పూర సుల్తానులకును దక్కెను. పదునేడవ శతాబ్దారంభ మున సమర్థ రామదాసు, తుకారాము మున్నగు మహా భక్తులు ధర్మ ప్రబోధకులుగా నుండిరి. వీరు మహా రాష్ట్రులలో స్వమతాభిమానమును, సామాజిక దృక్పథమును పొటమరింపజేసిరి. బీజాపూర్, అహమ్మద్ నగర రాజ్య ప్రాంతములలో మహారాష్ట్ర ప్రముఖులు కొందరు సైనికులుగను, ఉద్యోగులుగను ప్రవేశించి, రాజాశ్రయమును సంపాదించికొని జాగీర్దారులుగ ప్రజలు లగుచుండిరి. మొగలాయి చక్రవర్తుల రాజ్య విస్తరణ కాంక్షకు గురియై తమలో తాము కలహించుకొనుచు, దక్షను నందలి మహమ్మదీయ రాజ్యములు బలహీనము లగు చుండినవి. ఇట్టి రాజకీయ, సాంఘిక పరిస్థితులు మహారాష్ట్రుల విజృంభణము నకు కారణము లైనవి.

చిత్రము - 222

పటము - 1

మహారాష్ట్రులలో భోఁన్లే కుటుంబము ఈ సందర్భమున ప్రాముఖ్యమును గడించినది. ఈ వంశము వాడైన శహాజీ అను నాతడు అహమద్ నగర నవాబుల కొలువున నుండి ఆ రాజ్యము పై దండెత్తి వచ్చిన మొగలు చక్రవర్తి షాజహాన్ తో యుద్ధ మునకు తలపడి, అహమద్ నగర స్వాతంత్ర్యమును రక్షించు టకు ప్రయత్నించి విఫలు డయ్యెను. పిమ్మట బీజాపూర్న వాబుల నాశ్రయించి, పూనాను జాగీరుగా సంపాదించెను. మహారాష్ట్రులను సంఘటిత పరచినచో వారు శౌర్యము నందును, క్రమశిక్షణ యందును మొగలులతో పోటీపడగల సామర్థ్యము కలవా రగుదురని తొలిసారిగా శహాజీకి తోచినది. మొగలు లను ఎదిరించిన మహా రాష్ట్రులలో శహాజీ యే మొదటివాడు. ఈ శహాజీ కుమారుడే ఛ త్ర ప తి శివాజీ మహారాజూ.

బాల్యము నుండియు ధర్మయోధు లయిన రామాయణ, భారతవీరుల వీరోచిత కార్యకలాపములు, ధర్మోద్ధరణాభి యెంట బట్టించు కొని పరమతోల్బణమును తన అరికట్ట సమకట్టిన శివాజీ కిని, బీజాపూరు సుల్తానుల ప్రాభవమునకును మనుగడ ముడి బెట్టుకొన్న శహాజీకిని మార్గములు వేరయ్యెను.

పూనాకు సమీపమున శివ నేరుగిరి దుర్గమున 10, ఏప్రియల్ 1627 లో శివాజీ జన్మించెను. శివ నేరున నున్న శివాయి దేవి వరప్రసాదమున జన్మించిన వాడగుటచే తల్లి జిజియాబాయి తన కుమారునకు శివాజీ యని పేరు పెట్టెను. దాదోజీ కొండదేవ్ అను నొక బ్రాహ్మణుని సంరక్షకత్వమున తన భార్యయైన జిజియాబాయిని, కుమారుడైన శివాజీని నిల్పి శహాజీ బీజాపూరునందు నివసింప సాగెను. కొండదేవ్ శివాజీకి మల్ల యుద్ధము నందును, గుర్రపు స్వారియందును, ఖడ్గచాలనము నందును, నైపు ణ్యము అలవడునట్లు చేసెను.

చిత్రము - 223

పటము - 2

శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు - సమర్థరామదాసు

అక్బరు, హైదరలీ, రణజిత్ సింగ్ మున్నగు మధ్య యుగ వీరుల వలెనే శివాజీ నిరక్షరాస్యుడని చారి త్రకు లూహించుచున్నారు. శివాజీ స్వహస్తలిఖిత మైన పత్ర మొక్కటియును లబ్ధము కాలేదు. కాని అతడు రామాయణ, మహాభారత గాథలను విని, ధ ర్మాభిరతి, త్యాగము రాజ్యనిర్వహణ విధా నము, ఆహవ పాటవము, రాజనీతి మొదలగు విశేష ములను క్షుణ్ణముగా నెరిగినవాడై యుండెను. అత

డెచ్చటికి బోయినను హిందూ, ముస్లిం భక్తులు పాడిన పాటలు వినియును, పురాణ, కీర్తన, భజన కాల క్షేపములందు పాల్గొనియును, అనేక ధర్మరహ స్యములను, సూక్ష్మములను తెలిసికొనుచుండెను. ఈ కారణముచేత నే, గ్రంథావలోకనము లేకపోయి నను, కర్మవీరుడుగ, రాజ్యపాలనాదక్షుడుగ అతడు కృతకృత్యుడు కాగలిగెను. మధ్యయుగమునందు నేతృత్వమునకు కావలసినది కర్తవ్యానురక్తి యే కాని, భావశబలత, పాండిత్యములు కావు.

పూనాకు పశ్చిమదిశయందు పడమటి కనుమ లలో 90 మైళ్ళ పొడవును, 12 నుండి 24 మైళ్ళ వెడల్పునుగల ఒక లోయప్రాంత మున్నది. ఈ ప్రాంతము నే మావళ్ (సూర్యు డస్తమించు భూమి) అందురు. ఈ ప్రాంతమున ఎన్నియో లోయలు, చిట్టడవులు ఉన్నవి. ఉత్తరదిశ నుండు లోయలలోని జనము కోలీలు. దక్షిణదిశయం దుండువారు మరా ఠాలు. ఈ రెండు జాతులవారు మిక్కిలి ఉత్సాహ వంతులు, దృఢకాయులు, వ్యవసాయకులు, నిరాడంబరులు, వ్యసన రహితులు. ఈ గ్రామము లలో రాజప్రతినిధులు 'దేశ్ ముఖ్' లనబడువారు 'పాటిల్' అను గ్రామాధికారులనుండి రాజస్వము, పన్నులను సేకరించు చుండిరి. ఈ దేశముఖ్ లు మరాఠాలు, శివాజీ జాతివారు. వీరు బ్రాహ్మణు

చిత్రము - 224

పటము - 3 శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు

లకు పరిపాలనా వ్యవహారముల నప్పగించి. చిన్న చిన్న

సైనికదళముల నేర్పరచి, తమ అదుపులో నుంచుకొను చుండిరి. ఈ దళములు శత్రువుల దాడి నుండి కాపాడు టకును, బందిపోటు దొంగల పీచ మడంచుటకును ఉప యోగపడుచుండును. ఈ మావళేలు శివాజీ విజృంభణ ముతో పైకి వచ్చిరి. ఈ మావ ణేలతో శివాజీ స్నేహ మును సంపాదించి, వారికి నాయకుడయ్యెను. శివాజీ సైన్యమునకు మావ ళేల సంఘమే వెన్నెముకగా నుం డెను. మావళేలు శివాజీని తమ నాయకునిగను సంరక్షకునిగను, పరిగణించిరి. పునహాప్రాంతము నందలి చిన్న చిన్న నాయ కులు, పాలెగాండ్రు గ్రామములను కొల్లగొట్టుచుండిరి. న్యాయ, ధర్మములు నశించెను. అంతః కలహములు మెండయ్యెను. ఆ ప్రాంతము శ క్తి గల వానికే సర్వస్వ మయ్యెను. ఇట్టి విపత్కర పరిస్థితులలో తన దూరదృష్టి చేతను, శక్తి సామర్థ్యముల చేతను, నిష్పక్షపాత వైఖరి చేతను శివాజీ ఆ పల్లీయుల హృదయములను వశపరచు కొనెను. అతని రాజ్యమునకు పునాదులు వేసినది ఈ పీడిత ప్రజాహృదయములే. హిందూమత విధ్వంసకులకు విరుద్ధ ముగ మావళేలను పురికొల్పి, చైతన్యవంతులుగ చేసి, వారిలో జాతీయ భావమును ప్రజ్వలింప జేసెను.

ఈ ఆశయములకు ఫలమే శివాజీ మహారాజు. కొండ దేవు కడ నాతడు చిన్నతనము నుండియే పరిపాలనాను భవమును కొంత గడించుకొని యుండెను. సమవయస్కు లైన మావళేలతో స్వేచ్ఛా విహారము చేయుచు అడవు లలో, కొండలలో ప్రభుత్వాధికారులు తారసిల్లినప్పుడు వారిని తికమకలు పెట్టి వారియొద్ద నుండు రాజధనమును శివాజీ కాజేయుచుండెడివాడు. అతని దృష్టిలో నిది యొక వీరోచిత చర్య. అహమద్ నగర మంతరించి పోవుట చేతను, ఆ ప్రాంతమున అరాజకము ప్రబలి యుండుట చేతను శివాజీ కిట్టిచర్యలను అవలంబించుటకు ఉత్సాహము కలిగెను.

శివాజీ సహ్యపర్వత ప్రాంతమున అడవులలో, లోయ లలో, మావ ళే యువకులతో పరిభ్రమించుచు, అందు నివ సించు జనులతో సంబంధము లేర్పరచుకొనుచు ఉండెను. విశ్వాసపాత్రులైన అధికారులు కొందరు శ్యామ్ రాజ్ నీలకంఠ్, రంజేకర్ బాలకృష్ణ హనుమంతే, సోనాజి పంత్, రఘునాథ్ కోర్డే - ఈ నల్గురు 1642 లో శహాజీచే పునహాకు పంపబడిరి. వారు అతని జాగీరు నిర్వహణ భారము వహించుటకు నియమితులై యుండిరి. 1646 లో బిజాపుర సుల్తాను అగు అదిల్ షా అస్వస్థుడగుటచే కర్ణాట నాయకులు స్వాతంత్ర్యమును ప్రకటించు కొనుచుండిరి. రాజ్యపరిపాలనము పట్టమహిషి బారిసాహెబా హస్త గత మయ్యెను. శివాజీకి ఇదే అదను. 1847 లో కొండ దేవుడు దేహయాత్ర చాలించెను. ఇక శివాజీకి సలహా లిచ్చు వారు కాని, ఈతని స్వేచ్ఛావిహారముపట్ల మన స్తాపము చెందువారు కాని, మందలించువారు కాని లేకుండిరి.

కొండదేవుని మరణమునకు పూర్వమే బిజాపురపు సర్దారును మోసముచేసి యుద్ధము చేయకుండగనే శివాజీ తోరణ దుర్గమును స్వాధీన పరచుకొని యుండెను. ఈ దుర్గ ములో నున్న ధనరాశి అతని వశమయ్యెను. ప్రచండగడ మని ఈ కోట కాతడు కొత్త పేరు పెట్టెను. ఈ కోటకు 5 మైళ్ళ దూరముననే అదే కొండల నడుమ రాజగడము అను కొత్త కోటను నిర్మించెను. ఈ యుదంతము బీజా పూరులో తెలిసెను. అయిన నేమి, కొందరు మంత్రుల నతడు వివిధో పాయములచేత తనకు అనుకూలురుగ మార్చు కొని యుండిన వా డగుటచేత వారు దాని కెట్టి ప్రాధాన్య మియ్యక మిన్నకుండిరి. పూనాకు పోవు మార్గము సంరక్షించుచున్న చాకన్ దుర్గము పై కొండదేవుడు ఫిరాంగ్ జీని దుర్గరక్షకునిగా నియమించియుండెను. ఇతడు విశ్వాస పాత్రుడగుటచే శివాజీ కూడ అతనినే నియ మించెను. బారామతి, ఇందాపూరు దుర్గాధి కారులు కిమ్మనకుండ శివాజీకి లొంగిపోయిరి. ఆదిల్ షా రాజ ప్రతినిధికి శివాజి లంచ మిచ్చి కోడాంగ్ దుర్గమును వళ పరచుకొనెను.

1648 లో ఈ రాజ్య విస్తరణ కార్యక్రమము ఆగి పోవలసివచ్చినది. దక్షిణ ఆర్కాటు జిల్లాలో రాజప్రతినిధి గాను బీజాపూర్ సుల్తానుల సర్దార్ గా ఉన్న ముస్తఫా ఖాన్ శివాజీ తండ్రియైన శహాజీని నిర్బంధించి అతని ఆ స్తిని, పరివారమును స్వాధీనపరచుకొనెనని క ర్ణాటక ము నుండి వార్తలు వచ్చెను. శివాజీ రాజనీతిని ప్రదర్శింప నెంచి, అప్పుడు దక్షిణమున బిజాపూరు సుల్తానులకు ప్రబల విరోధులైన మొగలులతో మంతనములు జరిపెను. మొగలు రాజప్రతినిధి మురాద్ బడీతో సంబంధ మేర్పరచు కొ నెను. అంతకు పూర్వము అహమ్మద్ నగరములో మొగ లుల నెదిరించిన శహాజీని క్షమించి, బిజాపూర్ రాజుల చెరనుండి ఆతనిని విడిపించినచో నతడు మొగలులతో చేరు ననియు, తాను కూడ మొగలాయి ప్రభువులకు విధేయుడనై యుండెద ననియు రాయబార మం పెను. కాని ఆ ప్రయత్నము సఫలము కాలేదు. బిజాపూరు సుల్తాను శహాజీని రాజధానికి తెప్పించి మొగలులతో చేరకుండ మర్యాదలు చేసి తన వానినిగ జేసికొని విడుదల చేసెను. 1648 లో బిజాపూర్ సుల్తాను రోగగ్రస్తుడగుట చే పురందర దుర్గాధిపతి స్వాతంత్ర్యమును ప్రకటించెను. శివాజీ సమయస్ఫూర్తికలవాడు. పురందర దుర్గాధిపతి తన సోదరులకు భాగమియ్యకుండుటను గమనించి, ఆ సోద రుల నడుచు చీలికలు కలిగించి ఆ దుర్గమును స్వాధీన మొనర్చుకొనెను. 1656 లో జావళీ, రాయగడములను తనవిగా జేసికొనెను. జావళీకోటకు సమీపమున ప్రతాప గడమను కోటను నిర్మించెను. అదే కోటయందు మహాశక్తి భవాని దేవాలయమును స్థాపించెను. ఆ దేవియందు శివాజీకి అత్యంత భ క్తి ప్రపత్తు లుండెను. భ వానీదేవి యా దే శము ననుసరించియే శివాజీ తన కార్యకలాపములను జరిపినట్లు అతని అనుచరుల విశ్వాసము. శివాజీ కరవాల మునకు 'భ వానీ'యని పేరుండెను. సూపా అను కోట గూడ ఈ సందర్భముననే వశమయ్యెను. 1656 లో సూపా, బారామతి, ఇందాపూర్, పురందర్, రాజగడ్, కోదాణ, తోరణా, రోహిడా, టి కోణా, లోహగడ్, రాజమాచ్ దుర్గములు శివాజీ అధీనము లయ్యెను. సింహగడ్ అను కోటను పట్టుకొను సందర్భమున శివాజీ తన ప్రాణమిత్రు డై న తానాజీ మాల్ సు రేఅను మహావీరుని కోల్పోయెను. తానాజీ మరణము శివాజీ జీవితమున అత్యంత విషాద ఘట్టము. నవంబరు 4, 1656 బిజాపూర్ సుల్తాను మహ మ్మద్ ఆదిల్ షా మరణించెను. ఈ సంఘటనము శివాజీ కార్యక్షేత్రమును మరింత శ క్తిమంతము గావించినది.

శివాజీ స్వాతంత్ర్యమును వహించి జాగరూకతతో రాజ్యసంరక్షక కార్యమును నిర్వహించుచు మొగలులు జోలికి పోలేదు. బిజాపూర్ సుల్తాను అతనికి మొదటి నుండియే శత్రువులు. ఇక మొగలులను కూడ ఎదిరించి నచో తన ప్రయత్నము వమ్ముకావచ్చునని అత దూహించి యుండును. 1653 నుండి మొగలుల అధీనమున నున్న దక్షిణ భారతమునకు రాజప్రతినిధిగా ఔరంగ జేబు పరిపా లించుచుండెను. ఆదిల్షా మరణము తర్వాత ఔరంగ జేబు బీజాపూరును లోగొనుటకు ప్రయత్నము లారం భించెను.

బిజాపూరు సుల్తాను శివాజీని లొంగదీయుటకు అఫ్ఘల్ ఖానును పంపించెను. శివాజీని కౌగలించుకొని, నలిపి వేసి చంపుటకు బలాఢ్యుడైన అఫ్టల్ ఖాను ఎత్తు వేసెను. శివాజీ ఆ మోసమును తెలిసికొని, తానును మోసమునకు పూనెను. ఇద్దరు మోసగాండ్రు పెనగులాడినపుడు తెలివి గలవాడు జయించును. స్నేహితుని వలె ఖాను శివాజీని కౌగలించుకొని, క్రమముగా బిగించుచు, తన దురుద్యో గము నకు కడంగ నుండగా, శివాజీ తాను గుప్తముగా ధరించి యున్న “బిఛువా" (పులిగోళ్ళు) తో చీరి, వానిని చంపివేసెను. ఆ తర్వాత మహారాష్ట్ర వీరులు అప్లైల్ ఖాను వెంట వచ్చిన సైన్యమును సర్వనష్టములకు గురిచేసిరి. 1659 నుండి 1662 వరకును శివాజీకిని, బిజాపూరు సుల్తా నులకును జరుగుచుండిన యుద్ధము పతము త్రొక్కినట్లుగ నుండెను. 1662 లో బిజాపూరు సుల్తానులు శివాజీ ధాటికి ఆగలేక తమ రాజ్యములోని కొంత భాగమును శివాజీ కిచ్చి సంధిచేసికొనిరి. పూనా మొదలుకొని కృష్ణానది వర కున్న విశాల భూభాగము శివాజీ కీ విధముగ దత్త మయ్యెను.

బిజాపూరు సుల్తానుల ని విధముగ లొంగదీసికొని, శివాజీ శక్తిమంతమైన మొగలాయి సామ్రాజ్యము పైకి కత్తిదూ సెను. మొగలుల పై అతడు యుద్ధము ప్రకటించు నాటికి మొగలు చక్రవర్తి ఔరంగజేబు దక్షిణమున తన ప్రతినిధియైన షాయిస్తాఖాను అనువానికి శివాజీని అదుపులో నుంచుట కాజ్ఞ చేసెను. షాయిస్తాఖాను శివాజీ అధీనమునం దున్న పూనా, చాకన్, కల్యాణదుర్గములను జయించి, పూనాను తన కార్యకలాపములకు కేంద్రముగ చేసికొనియుం డెను. మోసముచే నైనను శత్రువులను లొంగదీయవలయునను నీతిని అనుసరించి మొగలు సైని కుల వేషములతో అనుచర యుక్తముగ శివాజీ పూనా మున శివాజీ షోడశ మహాదానములు చేసెను. పిదప మంత్రులకు అధికార లాంఛనములను, నియామక పత్రము లను ప్రసాదించెను. తరువాత ఉత్తమాశ్వము నెక్కి ఊరేగెను. పుణ్యాంగన లారతులిచ్చి, లాజలు చల్లిరి. ఈ శుభసందర్భమును పురస్కరించుకొని పురవాసులు తమ గృహాంగణములను దివ్యముగ నలంకరించిరి. ముస్లి ముల ధాటికి నిలువలేక కొనయూపిరితోనున్న హిందూ ధర్మ సంప్రదాయము లన్నియు సమగ్రరూపమున పట్టాభి షేక మహోత్సవ మప్పుడు పరిఢవిల్లెను. ఇప్పుడు శివాజీ హిందూధర్మ రక్షకుడు. హిందూ సమాజమున కాదర్శ పురుషుడు, భారతీయ సంస్కృతికి ఆశాజ్యోతి.

1677 లో శివాజీ కర్ణాటక ప్రాంతముపై దాడి వెడ ఇది అతని జీవితములో ప్రధానమైనది. పశ్చిమ కర్ణాటక ప్రాంతమును, బళ్ళారిని లోగొని, తంజావూరిని పాలించుచున్న సవతి తమ్ముడు వెంకోజీ నుండి కొంత రాజ్యమును స్వాయత్తము చేసికొని, రాయగడమునకు తిరిగివచ్చుచు, అతడు జింజీ, వెల్లూరులను వశపరచు కొనెను. ఇంచుమించు పశ్చిమ తీర ప్రాంత మంతయు శివాజీ రాజ్యమునకు పడమటి పొలిమేర అయ్యెను. శివా జీకి తండ్రినుండి లభించినవి కొన్ని జిల్లాలు మాత్రమే. కాని శివాజీ వానిని విస్తృత పరచెను.

1658 నుండియే అతడు నౌకానిర్మాణమున కుద్య మించి పశ్చిమ తీరమును దుర్గముగా చేసికొనెను. ఇది అతని రాజనీతి దక్షతకు నిదర్శనము. రాజ్యాదాయము పెంచుటకై అతడు సముద్రమార్గమున విదేశములనుండి వాణిజ్యమును కూడ ప్రోత్సహించెను. నౌకాబలము వలనను, విదేశీయ వ్యాపారము వలనను శివాజీ, బుడుత కీచుల యొక్కయు, ఆంగ్లేయుల యొక్క యు ఆగడముల నుండి భారతీయులు తట్టుకొనగలుగునట్లు ఏర్పాట్లు చేసి యుండెను. శివాజీ కొండ యెలుక యనియు, గెరిల్లా పోరాటమున ఆరి తేరినవాడనియు, క్షత్రియోచిత మైన పోరాటమున కతడు అలవాటుపడినవాడు కాడనియు ద్వేషపూరిత మనస్కులైన చారిత్రకు అతనిని వర్ణించిరి. కాని ఈ విదేశ వాణిజ్యమును, నౌకాబల నిర్మాణమును పరిపాలనా వ్యవస్థను పరిశీలించినచో శివాజీ ఔన్నత్యము మనకు గోచరించును. పశ్చిమతీర సమీపమున నున్న

యొక ద్వీపమును అబిసీనియా దేశస్థులైన సిద్దీలు ఆక్రమించు కొని తీరప్రాంత నగరములను దోచుకొనుచుండిరి. శివాజీ వారిని కూడ అదుపులో పెట్టుటకు ప్రయత్నించెను.

శివాజీ చరమదశలో అతని కొడుకైన శంభూజీ (సంభాజీ) దక్కనులో మొగలు ప్రతినిధియైన ది లేరు భానుతో కలసి మహారాష్ట్ర రాజ్య విచ్ఛేదమునకు దారి తీసెను. కాని 1679 లో శంభూజీ తన తప్పిదమును తెలిసి కొని తండ్రితో కలి సెను.

1680 లో శివాజీ మహారాజు రోగగ్రస్తు డయ్యెను. రోగము నివారణ కాజాల దను సంగతి తెలిసిన తరువాత శివాజీ మంత్రులకు, అధికారులకు తగిన ఉపదేశము లిచ్చి సమాధి నిష్ఠుడై 4 ఏప్రియల్ 1680 ఆదివారము మధ్యా హ్నము దివంగతు డయ్యెను. మరణమునాటి కాతని వయస్సు 53 సంవత్సరములు. మరణము సంప్రాప్తమైనం దుకు అనేకములైన కారణములను కొంద రూహించిరి. విషప్రయోగముననో, సయ్యదు ఖాను మహమ్మదు అను ఆతడు ఫకీరు శాపము వలననో మరణించె నని వేర్వేరు కథనములు గలవు. కాని చారిత్రకముగ నివి నిరూపించు టకు వీలులేదు.

శివాజీ మరణము నాటికి అతడు నిర్మించిన మహా రాష్ట్ర రాజ్యము సూరత్ నుండి కార్వార వరకును, పశ్చిమసముద్రతీరమునుండి కొల్హాపురమువరకును ఏక ఖండముగా వ్యాపించిన రాష్ట్రము. ఇదిగాక బళ్ళారి, వెల్లూరు, తంజావూరు, జింజీ కూడ శివాజీ పలుకుబడిలో నుండెను. మొగలు రాజ్యము నందలి మొగలాయి అను పేరుగల ప్రాంతముకూడ శివాజీరాజుదే. 'చౌథ్' అను పన్నును ఈ మొగలాయి ప్రాంతమున వసూలు చేసికొను అధి కారము మహారాష్ట్రుల కుండెను. శివాజీ రాజ్యమున 111 అతడు స్వయముగ 230 కోట లుండెను. కట్టించినవి. 79 కోటలు మద్రాసు ప్రాంతమున నుండినవి. 40 కోటలు పరరాజుల నుండి వశపరచుకొన బడినవి.

శివాజీ గురువైన సమర్థ రామదాసస్వామి గట్టి ప్రభుత్వ మొక్కటి ఏర్పరచి దుష్టశిక్షణము, శిష్టరక్షణము గావించి తనకు ప్రతినిధిగా ధర్మపాలనము చేయుమని శివాజీని ఆదేశించి యుండుటచే, శివాజీ ముస్లిములను ముప్పుతిప్పలు పెట్టుటయే తన ధ్యేయముగ నుంచుకొనక క్రమబద్ధమైన రాజ్యతంత్రమును నడుపుట కుద్యమిం చెను. మొగలు ప్రభువుల పరిపాలనా పద్ధతిని చాలవరకు స్వీక రించి తన యనుభవమును రామదాసస్వామి ఆదేశమును దృష్టియం దుంచుకొని రాజ్య వ్యవహారములను నిర్వ హించెను. అంతరంగిక, వైదేశిక వ్యవహారములను, రాజ్యము యొక్క ఆదాయ వ్యయములను నిర్వహించు ఉన్నతోద్యోగులను నియమించుటలో శివాజీ ప్రభువు చాల మెలకువ చూపెను. రాజ్య తంత్రమున రాజున కే సర్వాధికారము లుండెను.

అతని కెనమండుగురు మంత్రులు. వీరే 'అష్టప్రధా నులు' (1) పీష్వా-ప్రధానామాత్యుడు (2) అమాత్యుడు- ఆర్థికమంత్రి (3) వాకనీస్ - ప్రధాన లేఖకుడు (4) సచి వుడు - రాజున కాంతరంగిక కార్యదర్శి (5) సుమం తుడు = వి దేశ వ్యవహార మంత్రి (6) సేనాపతి (7) పండిత రావు – మత శాఖాధి కారి (8) న్యాయాధీశుడు. సేనాధి పతి తప్ప అందరు బ్రాహ్మణులే. ఈ యష్ట ప్రధానులు రాజునకు ఆయా వ్యవహారములలో సలహా లిచ్చువారే కాని నిర్ణయము రాజుదే. ఈ ప్రధాన పదవులు ఆనువంశి కములు కావు. ప్రతిభను బట్టియే వీరి నియామకము.

ఉన్నతోద్యోగులకు మొగల్ రాజులవలె జాగీరు లిచ్చి నచో అదుపులో నుండరనియు, స్వాతంత్ర్యము ప్రకటించు ప్రమాద ముండుననియు తలచి శివాజీ తన అనుచరులకు జాగీరుల నిచ్చుట మానివేసి జీతముల నేర్పాటు చేసెను. మొగలు చక్రవర్తుల వలె రాష్ట్రము నంతయు “సూబాలు"గా విభజించెను. సూబాకు అధికారి సుబే దారు. ప్రభుత్వమునకు ముఖ్యాదాయము పన్నులే. షేర్షా, అక్బరుల వలె శివాజీ వ్యవసాయభూములను స ర్వే చేయించి, వివరములు తెలిసికొని, పన్నులు విధించు పద్ధ తిని ప్రవేశ పెట్టెను. పంటలో భాగము ప్రభుత్వము ది. పన్ను కోతల కాలమున నే తీసికొనవలయును. రైతులకు నేరుగా కేంద్రప్రభుత్వము తోడనే సంబంధము. జమీం దారులు, దేశాయిల వంటి మధ్యస్థులకు శివాజీ రాజ్య తంత్రమున స్థానము లేదు.

అహమ్మదునగర్, బీజాపూర్ మరియు మొగల్ రాజ్యములలో పాటిల్, కులకర్ణి, దేశముఖ్ ల వంటి మిరాసీదారు (వంశ పరంపరాధికారము కలవారు) లుండిరి. వీరు అధికారమును హస్తగతము చేసికొని తా మే ప్రభువులై నట్లు వర్తించుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారు చిన్న చిన్న సైనిక దళముల నేర్పరుచుకొని పరస్పర కలహములు పెంచుకొని ప్రజాపీడనము చేయుచుండిరి. పటిష్ఠమైన ప్రభుత్వ మేర్పరచుటకు అవరోధము కల్గునను కారణమున ఈ పద్ధతికి స్వస్తిచెప్పి శివాజీ రైతువారీ పద్ధతిని ప్రవేశ పెట్టెను. సైనికాధికారులకు కూడ రైతు లపై ఎట్టి అధికారమును లేకుండెను.

అనూచానముగ వచ్చుచున్న చతురంగ బలములలో రధ, గజ బలములు సమకాలీన యుద్ధ పద్దతులకు సరిరాక పోవుటచే అవి శివాజీ నాటికే పాతపడి కొన్ని శతాబ్ద ములై యుండెను. శివాజీకి 40 వేల ఆశ్విక బలము, 1200 గజములు, ఒక లక్ష కాల్బల ముం డెను. తుపాకులు, శతఘ్నులు (ఫిరంగులు) విశేషముగ నుండెను. 25 గురు సైనికులపై ఒక హవల్దారు అధికారి. 5 గురు హవల్దా ర్ల పై ఒక జుమ్లేదార్, 10 గురు జుమ్లేదార్ల పై ఒక హజారి, 5 గురు హజార్ల పై ఒక పంచ హజారి అధికారులుగ నుండిరి.

వీరందరిపై సర్ నోబత్ సర్వాధికారిగా, సర్వసేనా నిగా నుండెను. ఈతడే అష్ట ప్రధానులలో 6వ వాడు. ఈ సై నికులకు శివాజీ ఏర్పరచిన కట్టుబాట్లు మహాభారత యుద్ధనీతిని తలపించుచున్నది. దేశములను దోచుకొన్నను, స్త్రీల పట్ల గౌరవ మర్యాదలను ప్రదర్శించవలయును. గోవులను కాని, బ్రాహ్మణులను కాని, వృద్ధులను కాని, బాలురను కాని హింస పెట్ట కూడదు. వారిని రక్షించ వలయును. సైనికులకందరకును ధర్మానురక్తి, రాజ్య స్వాతం త్ర్యాభిలాష యుండవలయును.

మత సంబంధములైన వ్యవహారములను శివాజీ న్యాయబుద్ధితో, సహనశీలతతో నిర్వహించెను. ముస్లిముల దర్గాలకును, మసీదులకును, హిందూ దేవాలయములకును అతడు దానములు చేసెను. వేద విదులైన బ్రాహ్మణు లకు జ్యోతిష్కులకు, సాధువులకు, ముస్లిం వలీలకు అతడు దానములు చేసి ఆశ్రమములను నిర్మించి యిచ్చెను. దక్షిణ ప్రాంతము పై దాడి వెడలి నప్పుడు ఆంధ్ర దేశము నందు పురాణప్రసిద్ధమైన శ్రీశైల క్షేత్రమును సందర్శించి 24 మార్చి నుండి 1 ఏప్రిల్ 1677 చైత్రనవరాత్రోత్సవ ముల న క డ జరిపించి, నీలగంగ, పాతాళగంగ యనబరగు చున్న కృష్ణానదియొద్ద శ్రీగంగేశ అను ఒక స్నానఘట్ట మును, యాత్రికుల సౌకర్యార్థ మొక ధర్మశాలయును నిర్మింప జేసెను. లక్ష బ్రాహ్మణులకు సమారాధన చేసి, భూరి దక్షిణల నిచ్చెనట! తన రాజ్యము నంతయు తన గురు వైన సమర్థ రామదాసస్వామికి అర్పింపగా స్వామి తన ప్రతినిధిగా రాజ్యమేలుమని శివాజీని ఆదేశించెను. స్వామి వారి కాషాయాంబరమునే శివాజీ భక్తి ప్రపత్తు లతో రాజ్యమునకు పతాకగా నిర్ణయించెను. ఇక ఇట్టి రాజ్యమున ధర్మపాలనము జరుగకుండుటెట్లు?

ముస్లి మేతరు లైన ప్రజలపై 'జిజియా' అను నొక వింత పన్నును ఔరంగ జేబు విధించి యుండెను. శివాజీ ఎన్నోమారులు ఔరంగ జేబున కి యన్యాయమును గూర్చి తెల్పి యుండెను. ధర్మబద్ధముగ పరిపాలన జరిపినచో తాను ఔరంగజేబు సార్వభౌమత్వమును అంగీకరించ గలనని తెలిపి యుండెను. శివాజీకి ప్రజా క్షేమమేకాని అధికార వ్యామోహము లేదనియే చెప్పవచ్చును.

శివాజీ వ్యక్తి గత మైన జీవితము మహోదాత్త మైనది. విధేయు డైన కుమారుడుగ, వాత్సల్యము గల తండ్రిగ, బాధ్యత లెరిగిన భ ర్తగా అతడు ప్రవర్తించెను.

ఆతడు పరస్త్రీలను పవిత్రహృదయముతో గౌరవించు వాడు. కల్యాణ దుర్గమును జయించి నప్పుడు ఒక మరాఠా సర్దారు. సోన్ దేవ్ అంతఃపుర స్త్రీలను చెరపట్టి తీసికొనివచ్చి శివాజీ ముందుంచగా శివాజీ ఆతని చర్యను తీవ్రముగ నిరసించి, దానికి దిద్దుబాటుగా వారలను సగౌరవముగా వారి యిండ్లలో దించి రావలసిన దాని సోమదేవుని ఆజ్ఞాపించెను. కళ్యాణ దుర్గాధిపతి యైన మౌలానా మహమ్మద్ కోడలు పట్టుబడగా ఆమెను కూతురు వలె గౌరవించి, ఆమె తన తల్లి యైనచో తాను సుందరుడుగా జన్మించ కుందునే యన్నట్లు ఐతిహ్యము లున్నవి. గురుభక్తి, దైవభక్తి, సంప్రదాయ బద్ధము లైన ధర్మములపై ఆసక్తి రూపుగొన్న వ్యక్తి అతడు. మహా రాష్ట్ర సామ్రాజ్యము స్థాపింపవలెనను ఆకాంక్ష కతడు రూపకల్పన చేసి మొగలు సామ్రాజ్యమునకు ప్రక్కలో బల్లెమై చరిత్రహీను లైన మహారాష్ట్రుల నొకజాతిగా నిర్మించి చరితార్థు డయ్యెను.

శివాజీ తన జీవితము నొక మహోద్యమముగా మార్చు కొని, జాతికొక విభూతి యయ్యెను. మొగలు సామ్రాజ్య పతనమునకు అతని ఉద్యమము కారణ మైనట్లు దక్షిణా పథము నందు ఏదియు కాలేదనుట నిర్వివాదాంశము, నేటికిని మహారాష్ట్రుల కే కాదు, స్వాతంత్ర్యప్రియు లైన భారతీయుల కాతడాదర్శ ప్రాయుడు, ప్రాతస్మరణీయుడు.

ఇ. కృ.

ఛాయాగ్రహణ శాస్త్రము (Photography) :

కాంతిచేత గాని, మరి యేవిధమైన వికీర్ణ (Radiant) శక్తి చేత గాని, రసాయనిక మార్పులు కలిగి బింబము (image) ఏర్పడుట ఛాయాచిత్రణ మనబడును. ఛాయా చిత్రగ్రహణ విధానము : కాంతి చొరుటకు వీలు లేని పెట్టెకు అమర్చిన కటకము (Lens) ద్వారా ఒక వస్తువునుండి వచ్చు కాంతి ఆ పెట్టెలో గల కాంతి ప్రేరిత (Light sensitive) పదార్థము పూయబడిన కాగితము మీద గాని, గాజు పలకమీద గాని పడును. కాంతి ప్రేరిత పదార్థములు సాధారణముగా రజత హేలైడ్లు (Silver halides) అయి యుండును. కటక మునకు ఒక మూత (Shutter) అమర్పబడి యుండును. దీనిని పూర్తిగా మూసియుంచుటకు గాని, పూర్తిగా తెరచి యుంచుటకు గాని, ఒక నిర్ణీత కాలము తెరచియుంచు గాని, అవకాశ ముండును. దీని వెనుక కనుపాప వంటి పటలము (Diapharagm) ఉండును. దీనిలో మధ్య గల రంధ్రముయొక్క వైశాల్యము మార్చుట వలన కాంతి ప్రసరణము హెచ్చించుటకు, తగ్గించుటకు వీలుండును.

రజత హేలైడ్ (Silver halides) మీద కాంతి పడినప్పుడు కాంతి ప్రేరిత పదార్థమును వికాసకము (Developer) నం దుంచవలెను. అందు రజత హే లై డ్లు లోహ రజతమై (Metallic silver) చిన్న కణములుగా మారుటవలన కాంతి ప్రసరించిన ప్రదేశములు నల్లగా మారును. పిదప నా పదార్థమును స్థిర కారకము (Fixer) లో నుంచవలెను. దానివలన కాంతి ప్రసరించని ప్రదేశ ములలోగల కాంతి ప్రేరిత పదార్థములను అది జీర్ణించు కొనును (Dissolves) పిదప ఆ కాంతి ప్రేరిత పదార్థ