Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చిలీ దేశము

వికీసోర్స్ నుండి

చిలీ దేశము :

దక్షిణ అమెరికాలో బహుకాలముగా ఘటిల్లిన విప్ల వములను, కలహములను బట్టి చూడగా, 'చిలీ' తరతమ భావముచే ప్రశాంతమగు చరిత్రగల దేశమనవచ్చును. కాని అది ఇటీవలి కాలమున తరచుగా సంభవించుచు వచ్చిన కార్మిక కలహముల కారణముగా గొప్ప ఇక్కట్టు లకు గురియైనది,

క్రీ. శ. 1536 వ సంవత్సరమున ప్రప్రథమముగా యూరపియనులు చిలీ దేశమున దిగిరి. డైగో డీ ఆల్ మగ్రో (Diego de Almagro) అను నతడు ఆ సమ యమున ' పెరూ' (Peru) నుండి చిలీపై దండయాత్రచేసి విఫలమనోరథుడయ్యెను. అయిదు సంవత్సరముల అనం తరము పెడ్రో డీ వాల్ డివియా (Pedro de Val- divia) అను మరియొక స్పెయిన్ దేశీయుడు సాంటి యాగో (Santiago) ను స్థాపించెను. 1810 వ సంవత్స రము సెప్టెంబరు 18 వ తేదీన చిలీ దేశీయులు స్పెయిన్ ఆధిపత్యముపై తిరుగబడిరి. కాని వారికి 1818 వ సంవత్స రము వరకు సంపూర్ణ స్వాతంత్ర్యము లభింపకుం డెను. ఆ సంవత్సరమున బెర్ నార్డో ఓ హిగ్గిన్స్ (Bernardo o Higgins), జోస్ డీ సాన్ మార్టిన్ (Jose de san Martin) అనువారు తుదకు స్పానిష్ సైన్యములను అణగద్రొక్కిరి.

చిలీ ఎన్నడును యుద్ధమున పరాజయ మొందిన దేశము కాదు. దానికిని బొలివియా (Bolivia). పెరు (Peru) లకును నడుమ 1879-83 సంవత్సరముల మధ్య కాలమున యుద్ధము సంభవించెను. ఆ యుద్ధములో 'ఆన్టో ఫాగస్టా' (Anto Fagasta) అను పేరుతో బొలివియాకు గల ఏకైక సముద్రమార్గమున్న రాష్ట్ర మును, దానితోపాటు, పెరుకు చెందిన విశాల భూభా గములును చిలీ కైవసమయ్యెను. మొదటి ప్రపంచ మహాసం గ్రామమందు చిలీ తటస్థముగానుండెను. 1927 వ సంవత్సరమున కర్నల్ కార్లోస్ ఇ ఫియజ్ (Colonel Carlos Ibafiez) అనునతడు అధికారమును తన హ స్త గత మొనర్చుకొనెను. అతనికి 1931 వ సంవత్సరమున పతనము సంభవించెను. అతని పతనమునకు అనంతరము కొలది కాలమువరకు అరాజకపరిస్థితులేర్పడెను. ఆ స్వల్ప కాలమునందే ఏద్గురు వ్యక్తులు దేశాధ్యములగుటయు, తిరిగి పదభ్రష్టులగుటయు గూడ తటస్థించెను. కాని డా. ఆర్టురో అలెస్సాండ్రీ (Dr. Arturo Alessandri) 1982-88 సంవత్సరము మధ్యకాలములో చిలీ యొక్క రాజకీయ, ఆర్థిక స్థైర్యమును నెలకొల్పుటకు గొప్ప ప్రయత్న మొన ర్చెను.

1938 వ సంవత్సరమున జరిగిన ఎన్నికలలో విజయు డైన పెడ్రో ఆగ్విరే సెర్ డా (Pedro Auguirre Cerda) అను నతడు 1941 నవంబరు 25 వ తేదీన మరణించెను. ఇతడు తన మరణమునకు పూర్వమే విపులమైన ఒక సామ్యవాద ప్రణాళికను దేశములో ప్రవేశ పెట్టెను. 1942 సం. లో 'ప్రజాపక్షము'న (popular Front) తీవ్రవాదియైన జువాన్ ఆన్ టోనియా రియోస్ (Juan Antonio Rios) అభ్యర్థిగా ఎన్నుకొనబడెను. ఆతని కాలమున రాజకీయ కలహములు, కార్మిక సంఘర్షణ ములు చెలరేగెను. వెలుపలినుండియు, లోపలినుండియు (విశేషముగా శక్తిమంతమైన కమ్యూనిస్టుపార్టీ నుండి) కలిగిన బలమైన ఒత్తిడి కారణముగా తుదకు చిలీ అక్ష రాజ్యములతో (జర్మనీ, జపాను) తనకు గల సంబంధమును 1948 సంవత్సరము జనవరి 20 వ తేదీన విచ్ఛేదమొనర్చు కొనెను. కాని ఆ దేశము 1945 సంవత్సరము ఫిబ్రవరి 14 వ తేదీవరకు జపానుపై యుద్ధము ప్రకటింపలేదు.

రియోస్ అనునతడు 1946 సంవత్సరము జూన్ 27 వ తేదీన మరణించెను. వెంటనేఒక అసాధారణమైన ఎన్నిక జరిగెను. అందులో 1946 సం. నవంబరు 3వ తేదీన 'వామ - సెంటర్ మిశ్రమపదముల' (Leftist-center Coalition) అభ్యర్థియగు గేబ్రియల్ గంజాలెజ్ వి డెలా (Gabriel Gonzalez Videla) అనునతడు అధ్యక్షు డయ్యెను. అతని పరిపాలనమునకూడ తరచుగ సంభవిం చిన కార్మిక కల్లోలముల మూలమున దేశమునకు తీవ్ర ముగ నష్టము కలిగెను. ఈ కల్లోలములో కొంతవరకు కమ్యూనిస్టు ప్రభావమున్నట్లు తెలియుచున్నది. గేబ్రి యల్ కమ్యూనిస్టు ప్రతికూలవిధానము ననుసరించెను. అతనిపిమ్మట కార్లస్ ఇబాఫియెజ్ (Carlos Ibafez) అను నతడు 1952 సంవత్సరము సెప్టెంబరు 4 వ తేదీన అధ్యక్షుడుగా ఎన్నుకొనబడెను.

ప్రభుత్వము - రక్షణ : చిలీ ప్రజలు ఆరు సంవత్సర

ముల కొ5 ° అధ్యక్షుని, ఎనిమిది సంవత్సరముల కొక సారి 45 మంది సభ్యులు గల నినటును (రులో నగము మంది నాలుగు సంవత్సరముల కొకసారి మారు చుందురు.), నాలుగు సంవత్సరములకొక సారి 147 మంది సభ్యులుగల 'ఛేంబర్ ఆఫ్ డెప్యూటిస్' అను మరియొక ప్రజాప్రతినిధి సభను ఎన్నుకొందురు. అధ్యక్షుడు తనకు తోడ్పడుటకై తను బాధ్యత వహించు ఒక మం మంత్రివర్గ మును నియమించుసే. కాని ఈ మంత్రివర్గము కాంగ్రెసు చేయు దేశ ద్రోహనే విచారణకు (impeachment) లో బడియుండును. అధకుడు చెలాయించు 'వీటో' (Veto) అను ప్రతికూలాభిప్రాయమును సహితము శ్రీవంతులు ఓటుచే రద్దుచేయు ఆకారమును కాంగ్రెసు కలిగియుం డును. ఎన్నికలలో 2సంవత్సరముల వయస్సు పై బడిన అక్షరాస్యులగు పౌరులందరకు వోటుచేయు అధికారము కలదు.

చిలీ దేశములో సైనిక శిక్షణ నిర్బంధము చేయబడెను. ఈ శిక్షణ ఇరువది సంవత్సరముల వయః కాలమున ఆరంభ మగును. మొదటి 9 నెలల పర్యంతము ప్రారంభ శిక్షణ ఒసగబడును. ఈ శిక్షణ అయిన పిదప 45 వ సంవత్సరపు వయస్సు వరకును ప్రతి పౌరుడును మూలబలము (Reserve) లో చేరి యున్నట్లు భావింపబడును. 1948 వ సంవత్సరమున జరిగిన అనధికార అంచనానుబట్టి, చిలీలో 25,000 సైనిక బల మున్నట్లు తెలియుచున్నది. నౌకా దళమునందు మామూలుగా 12,000 మంది యోధు లుందురు. ఈ దళములో 1953వ సం. న 28,000 టన్నుల పాత యుద్ధనౌక యొకటియు, 1951 వ సంవత్సరమున అమెరికానుండి సంపాదించుకున్న రెండు తేలిక పాటి క్రూయిజర్లును, ఆరు డిస్ట్రాయర్లును, ఆరు ఫ్రై గేట్లును, ఏడు జలాంతర్గాములును, రెండు సముద్రతీర రక్షక నౌకలును, ఇతరములైన చిన్న ఓడలును కలవు. ద్వితీయ మహాసంగ్రామ సందర్భమున చిలీలో విమానబలము అభి వృద్దికి తేబడెను.

సాంఘిక, ఆర్థిక పరిస్థితులు: 7-15 సంవత్సరముల వయస్సు గల బిడ్డలకు చిలీ కేంద్ర ప్రభుత్వము నిర్బంధో చిత విద్యావిధానమును అమలునం దుంచెను. 1948 వా సం. న చేయబడిన అంచనా ప్రకారము చిలీ దేశ మున నిరక్షరాస్యత 24 శాత మున్నదని తెలియుచున్నది. దక్షిణ అమెరికా యందలి దేరములలో. ఈ విషయమున చిలీ మూడవస్థా న మాక్రమించును. 1948 సం. లో పాఠ శాలను పోవు బాలబాలికల సంఖ్య దాదాపు 7,89,000. చిలీ దేశములో ప్రభుత్వ విశ్వవిద్యాలయముతో కలుపు కొని 5 విశ్వవిద్యాలయము లున్నవి. విద్యనిమి త్తమై బడ్జె టులో 20 శాతము వినియోగింప బడుచున్నది.

చిలీ దేశములో కొందరు జర్మనులు, ఆంగ్లేయులు, పోలండు దేశీయులు, సాటులు ఉండియున్నను తెల్ల వారిలో అధిక సంఖ్యాకులు స్పెయిన్ దేశీయులే. రోమన్ కాథొలిక్ మతమే అచటి ప్రధాన మతము. కాని 1925 వ సం.లో రాజ్యాంగము నుండి మతము వేరుచేయబడెను.

చిలీ యందు వ్యవసాయము కాలిఫోర్నియాలో వలె, సమ శీతోష్ణస్థితి గలిగిన కేంద్ర ప్రాంతము నందలి లోయ లలో జరుపబడుచున్నది. దేశములో ఫలవంతమగు భూమి అతి స్వల్పముగ నున్నది. దానిలో అధిక భాగము నీటి పారుదలను అ పేక్షించును. 1951 లో గోధుమ 9,88,000 మెట్రిక్ టన్నులు పండెను. ఇదియే అచ్చటి ప్రధాన మైన పంట. తరువాత పేర్కొన దగినవి ఉర్లగడ్డలు, ఓట్సు, బార్లీ, ధాన్యము, తీగెచిక్కుడు, పండ్లు, గోధుమ తర్వాత అధిక విస్తీర్ణములో ద్రాక్ష పండింపబడుచున్నది. ద్రావ ఫలముల నుండి 1952 సం. లో 56,500,000 గ్యాలనుల ద్రాక్ష సారాయి తయారయ్యెను. సగటున 2500 ఎకర ముల విస్తీర్ణము గల ఫ్యూడల్ (జమీందారీ) భూకమత ములు (estates) ఆ దేశములో ఎక్కువగా నున్నవి. 1951 సం.న పశుసంపద యొక్క మొత్తము సంఖ్య 2,160,000; 1949 సం.న గొట్టెల సంఖ్య 6,345,000; 1951 సం.న ఉన్ని ఉత్పత్తి 12,000 మెట్రిక్ టన్నులు. పశు పరిశ్రమ స్థానికావసరములకు చాలినంతగా లేదు. చిలీలో తయారగు ఉన్నిలో కొంతభాగము అచ్చటి బట్టల మిల్లులకు ఉపయోగపడుచున్నది. కాగా మిగిలిన ఉన్ని, చర్మములతో పాటుగా విదేశములకు ఎగుమతిచేయ బడుచున్నది.

విదేశీ వ్యాపారము : (అమెరికన్ డాలర్లలో-మిలియను లలో). మిలియన్ అనగా 10 లక్షలు : ఎగుమతులు దిగుమతులు 1950 1951 1952 282 371 456 829 871

1952 సం.లో అమెరికా 57 శాతమును, అర్జెంటినా 8 శాతమును, బ్రిటన్ 5 శాతమును, జర్మనీ 5 శాఖమును చిలీ నుండి సరకులను దిగుమతిచేసికొనెను. చిలీ దేశము అమెరికా నుండి 52 శాతమును, బ్రిటను నుండి 9 శాత మును, అర్జెంటినా నుండి 8 శాతమును సరకులను దిగు మతి చేసికొ నెను. 1952 సం.న చిలీ ఈ క్రింది ముఖ్యమైన ఎగుమతులు చేసెను : రాగి (49 శాతము) ; సత్రితము (నైట్రేట్ : 18 శాతము). ప్రధానమైన దిగుమ. ులు యంత్రములు, వాహనములు, నేతవస్తువులు, పంచదార, ఇనుము, ఉక్కు, చేతిపని సామానులు.

గొప్ప పారిశ్రామికాభివృద్ధిని గూర్చి చిలీ కలలు కను చున్నను, ఉత్తమ తరగతికి చెందిన బొగ్గు, తగరము తప్ప, శేషించిన అవసరమగు ముడిసరకులన్నియు చిలీ యందు లభ్యమయినను, అందు ప్రగతి మందముగ సాగుచున్నది. ఖనిజ పరిశ్రమయందు తప్ప, దైనందిన జీవితములో ప్రజలు వాడుకొను వస్తువులు - ముఖ్యముగా వస్త్ర ములు- ఇతర పరిశ్రమలలో చౌకగా తయారగుచున్నవి. 1948 సంవత్సరము లో ఉక్కు పరిశ్రమ స్థాపింపబడినది. ఉక్కు ఉత్పత్తి 1952 వ సంవత్సరములో మొత్తము 243,000 మెట్రిక్ టన్నులు జరిగెను.

1947 వ సంవత్సరము నాటికి మొత్తము సుమారు 31,250 మైళ్ళ పొడవున రోడ్డు రహదారి నిర్మింపబడి యుండెను. ఇందులో మూడవ వంతు చక్కపరుపబడినది. రైల్వే మార్గము పొడవు 5,434 మైళ్ళు. ఇందులో కొంత విద్యుదీకరణము చేయబడినది. చిలీ అంతర్భాగములో ప్రజోపయోగమునకై విమానయాన సౌకర్యము గొప్పగా అభివృద్ధి నొందియున్నది. అనేకములైన అంత ర్జాతీయ విమానయాన మార్గములు దేశమందు ఏర్పరుప బడినవి. 'లాయ. రిజిస్టర్' ను బట్టి, 1952 వ సంవ త్సరము జూన్ 30 వ తేదీనాటికి చిల్లీలో మొత్తము 1,87,618 టన్నుల శ క్తి గల 62 వాణిజ్య నౌక లున్నట్లు తెలియుచున్నది.

ఇటీవల తయారు కాబడిన ఆదాయ వ్యయములు (బిలియనులలో) ఈ క్రింది విధముగా నున్నవి : (బిలియను పీసో నాణెకు 1 బిలియను అనగా లక్ష 1951 ఆదాయము 26.0 27.6 1952 1953 47.5 47.5 42.0 వ్యయము అడ్జెట్ అంచనా : 1951 సంవత్సరము డిసెంబరు 31 వ తేదీనాటికి చిలీ ప్రభుత్వము 7,524,100,000 పీసోలు జాతీయ ఋణము చెల్లించవలసి యుండెను. ఇందులో 5,481,100,000 పీనాలు చిలి ప్రభుశము స్వదేశీయుల కే ఋణపడి యుండెను. చిలీ దేశముయొక్క ఆర్థిక సంపత్తికి పునాది అందలి ఖనిజసంపదమైయన్నది. ఈ ఖనిజములు 'అట కామా' (Atacama). 'అంటఫా గస్టా' (Antof... gasta), 'టారాపకా' (Tarapa) అను రాష్ట్ర ము పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/775 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/776 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/777 బంధువో రెండు గుప్పెళ్ళ మన్ను తీసికొని ఆ సమా ధిపై చల్లుచు, “నీకు నాకు దూరం అయింది” అను అను మాటలను ఉచ్చరింతురు. మూడవనాడు బంధువులు వెళ్ళి ఆ సమాధిపై కొంత ఆహారము పెట్టి వచ్చెదరు. అప్పుడువారు "సామీ ! నారాయణా ! భగవంతా ! నీకూ నాకూ దూరం పోయింది. సామిని ఇచ్చినవారు మీరు, తీసికోపోయినవారు మీరు, సామిదగ్గర పోయి చేరాలనేగా. దండం" అని అందురు.

హైదరాబాదు ప్రభుత్వమువారు తమ అభివృద్ధి ప్రణాశిక ద్వారా చెంచులను బాగుపరచి, వారిని రాతియుగపు నాటి అనాగరిక స్థితినుండి, ఎక్కువ నాగరక మైన జాతుల స్థితికి తీసికొని వచ్చినారు. ఈ ప్రణాళిక 1942 లో ప్రారంభింపబడినది. ఇది 'అమరాబాదు గ్రామీణ సంక్షేమ సంఘము' అను పేరుతో పిలువబడుచున్నది.

రా. ప్ర.

చెకోస్లోవేకియాదేశము (చ) :

ప్రథమ ప్రపంచ సంగ్రామానంతరము 1918 సంవ త్సరము అక్టోబరు 28 తేదీన చెకోస్లొవేకియా ప్రజా ప్రభుత్వము ఏర్పడినది. చెకోస్లొవేకియా యూరప్ ఖండ ములో, కీలకమయినస్థానములో, పర్వతశ్రేణులచే చుట్ట బడి యున్నది. వైశాల్యములో ఇది పెద్దదేశము కాక పోయినను, నై సర్గిక స్వరూపమువలనను, అమరిక వలనను, ఐరోపా ఖండములో చెకోస్లోవేకియాకు ప్రాముఖ్యము లభించుచున్నది. దీనికి ఉత్తరమున జర్మనీ, పోలండ్ దేశాలు; తూర్పున రష్యా; దక్షిణమున హంగేరి, ఆస్ట్రి యాలు ; పశ్చిమమున జర్మనీ దేశమును ఉన్నవి. ఈ దేశము బొహీమియా, మొరేవియా - నై లేషియా, స్లొవేకియా, రుధేనియా, అను నాలుగు భూభాగములచే ఏర్పడియున్నది. పశ్చిమ భాగములోని బొహీమియా, మధ్య భాగములోని మొరేవియా ప్రాంతములు చాల వరకు పర్వతములచే చుట్టబడి, సమతల పీఠభూమిగాను, తూర్పుననున్న రు ధేనియా, స్లొవేకియాలు తూర్పునకు ఏటవాలుగా నున్న కార్దేసియన్ పర్వత శ్రేణులలోని పచ్చిక బయళ్ళుగాను ఏర్పడి యున్నది. మొత్తమునకు ఈ దేశములో అరణ్య భాగమే ఎక్కువగా కనబడును.

చెకొస్లొవేకియా యొక్క వైశాల్యము 49,381 చ. మైళ్ళు. ఈ దేశములోని ప్రధానమైన నదులు లాబె, వటావా, జోడర్, మొరావా, వాః, డాన్యూబ్ అను నవి. దీనికి రాజధాని ప్రేగ్ నగరము. ఈ దేశ వాసులలో సుమారు 70% వరకు రోమన్ కాథలిక్కు మతస్థు లున్నారు. దేశములోని క్రైస్తవ దేవాలయము లన్నియు ప్రభుత్వాధీనమున నున్నవి. 1958 డిసెంబరు నాటికి ఈ దేశపు జనాభా 18,518,021. పర్వత ప్రాంతములలోని పల్లెలలో. వస్త్రములు నేయుట, వస్త్రములపై రంగు రంగు ఎంబ్రాయిడరీ చిత్రముల నల్లుట, ఆట బొమ్మలను చేయుట మున్నగునవి ముఖ్య వృత్తులు. పశువులను వీరు పచ్చిక బయళ్ళలో మేయుటకై విచ్చలవిడిగ వదలరు.

చెకోస్లావేకియా అను పేరు క్రీ. శ. 1880 సం. నుండి ప్రచారమున నున్నది. స్థూలముగా 'స్లావ్ ' జాతికి చెందిన చెక్కులు, స్లావెక్కులు అను రెండు తెగలతో నిండిన ఈ దేశములో, చెక్కులు బొహీమియా, మొరే వియా ప్రాంతములలోను, స్లొవెక్టులు స్లొవేకియాలో ను ప్రధానముగ నివసింతురు. రష్యనులుకూడా ఈ 'స్లావ్’ జాతికి చెందినవారే. ప్రారంభములో చెక్కులు, స్లొవె క్కులు అను నీ రెండు తెగల మధ్య చెప్పుకోదగినన్ని విభేదములు లేవు. చారిత్రక రీత్యా ఏర్పడిన ఈ వి భేదముల వలన పశ్చిమ భాగములోని బొహీమియన్ చెక్కులు పదునాల్గవ శతాబ్దమునకే, యూరప్ ఖండమునందు, విశిష్టమైన సంస్కృతిని, నాగరకతను, ఖ్యాతిని గడించిరి. | వేర్ నగరమున, ఆరువందల సంవత్సరములకు పూర్వమే ఒక విశ్వ విద్యాలయము వెలసినది. ఈ బొహీమియన్ చెక్కులు, పదునారవ శతాబ్దమునుండి, జర్మన్ దేశస్థుల అధీనమున నుండుటచే, పారిశ్రామిక జాతిగా వీరు దిద్దితీర్చ బడిరి. తూర్పు తీరములోని స్లావెక్కులు సుమారు వేయి సంవత్సరములుగ హంగేరియన్ల అధీనమున నుండి, కర్షక జాతిగా తయారయిరి. అందులకే 1918 వ సం॥న చెకో స్లొవేకియన్ ప్రజాప్రభుత్వ మేర్పడిన తర్వాత, స్లొవేకి యాలోకూడ పరిశ్రమలు స్థాపించుటకుగాను ప్రయత్న ములు జరుగుచున్నవి. యాదృచ్ఛికముగ ఏర్పడిన ఈ రెండు తెగల మధ్య పెంపొందిన విభిన్న ప్రవృత్తులకు పొందిక కల్పించుట చెకోస్లొవేకియన్ ప్రజాప్రభుత్వమును ఎదుర్కొను గడ్డు ప్రశ్నలలో నొకటి. ఈ దేశపు నైసర్గిక పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/779