శ్రీనివాసవిలాససేవధి/పీఠిక
పీఠిక
"శ్రీనివాసవిలాససేవధి " యనునది ఆంధ్రదేశమునందలి ప్రసిద్ధపుణ్యక్షేత్రమగు తిరుపతి కొండపై నెలకొని శ్రీనివాసులని పేరుగన్న వేంకటాచలపతి విలాసములను విహారలీలలను వర్ణించు నొక చక్కని ద్విపదకావ్యము. ఆ దేవుని విలాసకథలకిది యొకనిధి. ఇది శ్రీ వేంకటాచలపతియే స్వయముగాగోరి శ్రేష్ఠలూరి వేంకటార్యుఁడను కవిచే రచింపించుకొని తాను కృతిగొన్న కావ్యములలో నొకటి. వెంకటవీరరాఘవ అనునది యీతని పూర్తిపేరయినట్లు బ్రౌనుదొరగారువ్రాసికొన్నదానినిబట్టి తెలియవచ్చుచున్నదిగాని, యా పేరీతని గురువగు అన్నావి అప్పలాచార్యులపేరుగాఁ గనఁబడుచున్నది. బ్రౌనుదొరగారది యీతనిపేరే అని పొరబడియుండవచ్చును.
వేంకటార్యుఁడను నీ కవి భారద్వాజగోత్రుఁడు. ఆపస్తంబసూత్రుఁడు.
“అష్టభాషా కవిత్వార్జిత ప్రోద్య
దష్టావధాన విఖ్యాత బైరదుడు
శ్రీ కృష్ణయార్య లక్ష్మీగర్భవార్థి
రాకాసుధానిధి రాజపూజితుఁడు
వివిధ విద్యాశాలి వేకటార్యుండు"
అగునీతఁడు కావ్యరచనాభిలాషియై యుండగా శ్రీ వేంకటేశ్వరు లాతనికి స్వప్నమునఁ గానుపించి,
"గరిమ నీక్షించి, యో కవివర్య మున్ను
ధర సంస్కృతప్రాకృతముఖ భాషలను
ద్రవిడాంధ్రములఁ గ్రంధము లెన్నియైన
సవరించితివి మాకు సంతసంబెసఁగ
నొక కృతి శేషాచలోరువైభవము
ప్రకటితాలంక్రియాస్పదవర్ణనలను
విసువక శృంగార వీరాద్భుతాది
రసములు భావముల్ రంజిల్లునట్లు
ద్విపద లోకులకెల్లఁ దెలివిడిగాన
ద్విపదగాఁ దెనుగునఁ దేటగావించు
వారాహ వామన బ్రహ్మాండ పాద్మ
గారుడ స్కంద మార్కండేయ ముఖ్య
బహుపురాణోక్తి సంబాధంబువలన
గహనమై పెనుగొన్న కథ చిక్కుదీర్చి
శరధిలోపల రత్నజాతంబు లేర్చి
మెరుగుసానను దీర్చి మెలకువఁ దేర్చి
భూషణంబొనరించు పొలుపున కర్ణ
భూషణంబుగను సల్పుము చెల్వు గుల్క."
అని యానతీయ, నాతఁడు వెంటనె మేల్కాంచి, పెక్కు పురాణములలోఁ జిక్కుపడియున్న శ్రీనివాసుల కథలలో, పునరుక్త కథను ద్రోచి, మొదలుతుద యేర్పరించి, పూర్వోత్తర విరోధములను దోచనీక, సర్వ సమాధాన సరణిని, భావుకభావ సంభావ్యతనలరఁ గావించి, పటుమహాకావ్యలక్షణములు వెలయ నందే వేంకటాద్రిమాహాత్మ్య మింపొందునట్లుగాఁ దెనుఁగున నీ ద్విపదకావ్యమును భూనుతవిఖ్యాతి పొసగ
విరచింపఁ బూనినటులఁ జెప్పియున్నాఁడు. పిదప నా కృతిపతియగు ధవేంకటేశుని షడ్వి ప్రాకృత భాషలలో - ననఁగా - ప్రాకృతము, శౌరసేని, మాగధి, పైశాచి, చూళికోక్తి, భాండీరం అనువానిలో స్తోత్రము చేసినాడు. ఈ కవి సంస్కృత ప్రాకృతములందును, ద్రవిడాంధ్రములందును పెక్కు కావ్యములను రచించి, యింతకు బూర్వమే తన కర్పించినట్లుగా నా వేంకటాచలపతి యితని కలలోఁ జెప్పుటను బట్టి తెలియవచ్చుచున్నదే గాని యీతని యితర గ్రంథములేవియు నింతవరకు గానరాలేదు. ఆరు ప్రాకృతములలోని యల్పరచనలు మాత్ర మీ గ్రంథముననే గానవచ్చుచున్నవి. ఈతనిది ద్విపదరచనయే యైనను దాని నీతడు
"చటులార్ధకల్పనల్ శబ్దసందర్భ
మొరపొంద మాధుర్య ముల్లసిల్లగను
వరున పద్దెనిమిది వర్ణనల్ గులుక
నతుల శృంగార వీరాద్భుతరసము
లతిశయింపగ విభావాది భావములు
భావుక భావ్య సంభావ్యత నలరఁ
గావించి పటు మహాకావ్యలక్షణము
వెలయఁ దెనుంగున ద్విపదకావ్యముగ "
రచింపఁబూనినట్లు చెప్పికొన్నాఁడు. అట్లీ రచన ద్విపదయే యైనను మహాకావ్యలక్షణములతోఁ గూడినదై యే యున్నదనుటకు సందేహములేదు. వేంకటాద్రిమాహాత్మ్యమును, శ్రీనివాసుని విలాసములను వర్ణించు గద్యపద్యాత్మకములగు గ్రంథము లనేకములున్నను, ఈ ద్విపదరచనయే చక్కని తెనుఁగుదనముగలిగి, కావ్యలక్షణములతోఁ గూడి వానికన్న మిన్నయేమై యున్నదని చెప్పఁదగియున్నది.
ఈ వేంకటార్యుని తండి పేరు కృష్ణయార్యుఁడు, తల్లి లక్ష్మి. ఈతఁ డశేషదేశికులకెఱగి "వాధూల వంశావతంసుడగుఁ నస్మదాచార్యు నన్నావి యప్పలాచార్యు" ని భజియింతునన్నాఁడు. దీనిని బట్టి యితఁడు వాధూలవంశావతంసుఁ డగు అన్నావి అప్పలాచార్యుల 6 శ్రీనివాసవిలాస నేనధి శిష్యుడై నట్లు తెలియుచున్నది. వాధూల గోత్రజుఁడగు గీతని అసలు పేరు వీరరాఘవాచార్యు లనియు, ఈయనకే కందాడై కోవిల అణ్ణన్- అని ప్రసిద్ధికలదనియుఁ జెప్పుదురు. ఈయన వైష్ణవ సంప్రదాయ గ్రంథ ములగు అష్టాదశరహస్యములలో నొకటగు 'శ్రీ వచన భూషణమునకు ' లఘువాఖ్యను రచించినవారు, వీరి వాసస్థానము తిరుచళ్ళికై అను ఈ కందాడ అప్పలా పూనమల్లి సమీపమునఁగల యొక గ్రామము. చార్యులే తెనాలి రామకృష్ణ విరచిత మగు పాండురంగమాహాత్మ్య మునకుఁ గృతిపతియగు విరూరి వేదాద్రికిఁగూడ గురువై నల్లా గ్రంథమున రామకృష్ణకవి యీయనను గూర్చి చేసిన తెలియ వచ్చుచున్నది:— యీ క్రింది వర్ణి సమునుబట్టి సీ॥ వేదమార్గ ప్రతిష్ఠా డై నతజ్యేష్ఠు: డభ్య స్త షడ్దర్శనార్థ రాశి యతీరాజ రచిత భాష్యగ్రంథని ర్ణేత యఖిల పురాణేతిహాసక ర బంధుర దివ్యప్రబంధానుసంధాత పంచసంస్కార ప్రపంచ చణుఁడు వాధూలమునిచంద్ర వంశవర్ధనమూర్తి సకల దేశాచార్య నికరగురువు ణ పట్టమేనుంగు శ్రీ రంగపతికి నణ్ణ గారి గర్భాంబురాశి నీహారరశ్మి సాగసాహిత్య సర్వస్వశయ్య పేటి యాళవందారు కందాళ యప్పగారు. ) వై జయంతీవిలాసక ర్తయగు సారంగు తమ్మయ్య కూడ నీ కందాళ అప్పలాచార్యులుగారినే తనకు గురువుగా, 7 కందారు దాసజనతా మందారు న్వేదశాస్త్ర మహిత ప్రజ్ఞా బృందారకగురు మద్గురు గందాళప్పల గురున్ జగద్ధితుఁ గొలుతు. అని చెప్పికొనియుండుటచే, నా యప్పలాచార్యుల శిష్యుఁడే యగు మని వేంకటార్యుడును తెనాలి రామకృష్ణ, సారంగు తమ్మయ్య సమకాలికుఁడై – క్రీ. శ. 17వ శతాబ్ది ప్రారంభముననుండి ల యుండునని నిశ్చయింపఁదగియున్నది. > " ఆనాచార ఈ కందాళ అప్పలాచార్యుల వ్యాకరణశాస్త్ర పాండిత్యమునుగూర్చి ప్రశంసించుచు నాయన శిష్యుఁ డొకఁడు " అపశబ్దభయం నా స్తి అప్పలా కార్య సన్నిధౌ " అని చెప్పిన సందర్భముననే, సమకాలికుఁడగు తెనాలి రామకృష్ణుడు భయు నా స్త్రీ తిష్ఠన్ మూత్రస్య సన్నిధౌ ' అని పరిహసించెనని చెప్పు దురు. రామకృష్ణకవిని గూర్చిన యిట్టి కథలనేకములు విశ్వసనీయములై నను కాకున్నను మస శ్రేష్ఠలూరి వెంకటార్యుఁ శాతనికి సమకాలికుఁడని మాత్రము వ్య క్తమి చున్నది. ఈతని వాసస్థానమగు శ్రేష్ఠలూరు అనంతపురం జిల్లాలోఁజేరిన చెట్లూరు కానవచ్చునని తోచుచున్నది. కావున నీ కవి యిప్పటికి సుమారు 350 సంవత్సరములకుఁ బూర్వపు వాడుగాఁ గనఁబడుచున్నాఁడు. వర Ea నొప్పుచున్నది. ఈతని ద్విపదరచన ప్రబంధక విత్వమునుబోలి ప్రౌఢమైన నలతో రసభావబంధురమై నారార్థమైన శైలితో ఇంకను దనకావ్యకన్యక శయ్యకుఁ దగిన మృదుపదము, ఒయ్యారి నడలు, శుభోరుకాంతి, సద్వృత్తులు, సరసభావంబులు, సౌకుమార్యంబు గలిగి సువర్ణమయ మూర్తియగుచు, లలిత శృంగారలీలల సొంపు నింపు గై కొనియుండి శ్రీకాంత కెనగాఁగఁ జెలగుటచేత నద్ధానికి కలశాబ్ధి 8 శ్రీనివాసవిలాససేవధి కన్యకావిభుఁడగు శౌరియే తగిన పతియంచు భావించి యాతనికి కవి సమర్పించినట్లు చెప్పికొన్నాఁడు. 2 C నివాసు: విహారలీలలతో పాటు అతని కావాసమైన వేంకటాద్రి యొక్క మాహాత్మ్యమునుగూడ వర్ణించి వివరించుటచేత నీ రచనా " ప్రాశస్త్య మినుమడించిన దనవచ్చును. ఇంతేకాదు ఆ శ్రీనివాసులే యాతనికలలోఁ గానిపించినప్పు డానతిచ్చినట్లుగా, నా దేవునికథ, బహు పురాణోక్తి సుబోధంబువలసి గహనమై మొదలుతుద లేక, పూ ర్వోత్తు విరోధములతోఁ గూడి చిక్కు గొనియుండుటచే నట్టి కథలోని చిక్కు లన్నీ తీర్చి మొదలు తుద యేర్పరించి శరధిలో గలరత్నముల నేర్చి సాన దీర్చి మెఱుగు వెట్టి భూషణంబొనరించు రీతినే యీతఁడీ కావ్యమును దిద్ది యా వెంకటాద్రివిభు నలంకరించినాడు. శ్రీవేంక టేశ్వరుల గూర్చిన కథలు, సంస్కృత భాషారచితములగు 12 పురాణములలో గానవచ్చుచున్నట్లు ఇటీవల ప్రకటితమగు " శ్రీ వేంకటాద్రిమాహాత్మ్య " మను నొక సంక లస గ్రంథమునుబట్టి తెలియుచున్నది. కాని ఆ యా పురాణభాగ ములుగా నందుఁ జేర్పఁబడియున్న రచనలు కొన్ని మూల పురాణ ఈ కారణముచే నీ భాగము గ్రంథములలో గానవచ్చుట యేలేదు. లా యా పురాణములం చేయేకాలములఁ జేర్పబడియుండునో తెలియదు. మన వేంకటార్యకవి కాలమునకు మాత్రము - అనఁగా క్రీ. శ. 17.వ శతాబ్ది ప్రాంతమునకు వారాహ, వామన, బ్రహ్మాండ, పాద్మ, గారుడ, స్కంద మార్కండేయములను నీ యారు పురాణములలోను, నీ వేంక టాద్రి మాహాత్మ్యమును గూర్చిన కథాభాగములు గానవచ్చుచున్న వని యీతడు చెప్పుట నుబట్టి నిశ్చయింపవచ్చును. అప్పటి కే వీనిలో నొకదాని కొకటి పొందక యుండినవని కవియే కాదు-వేంకటాద్రి దేవుఁడగు శ్రీని వాసులే - చెప్పికొనియున్నాఁడు. భిన్న కాలములందు భిన్న గ్రంథ కర్తలచే రచింపఁబడిన కథాభాగము లా యా పురాణములఁ జేర్పఁబడి บ పీఠిక 9 యుండుటచే నట్టి చిక్కు ఏర్పడియుండే నేమో! ఈ చిరు ను విడదీసి కథకు మొదలు తుద లేర్పరించి చెప్పుటలో నీతఁడు కాలగతిని అనఁగా యుగముల వరుసను అనుసరించి, త దనుకూలముగనే వారాహ వామన బ్రహ్మాండ పాద్మ గారుడ స్కంద మార్కండేయ పురాణములందలి కథను యథాక్రమముగా సవరించి రచించిన ట్లగపడుచున్నది. అందు ఈతని ద్విపదరచన మారాశ్వాసముల గ్రంథము. మొదటి మూడాశ్వాసములలోను ప్రధానమైన " వెంకట ధరణీధర మహిమను వినుపించినాడు ”. ఈ ముఖ్యక థాభాగమంతయు వారాహ పురాణాంతర్గతమైన దే. అసలీ కథకంతకు మూలమే యాదివరాహావ తారము. మున్నీట మునిగియున్న వసుధను బై కెత్తుటకై శ్వేత వరాహరూపమును దాల్చిన శ్రీ కాంతుఁడు ఆధరణిని " ఒక కోర మొన నొత్తి యుబుకబై కెత్తి యెగసి వెల్వడి వచ్చియిల ధాత కిచ్చి "న పిదప నా భూమియందే భూరిలీలల విహరింపఁ దమి పుట్టఁగా, నా దేవుఁడు వై కుంఠమందలి మన నగరిలోని రత్న నగరాజము నిచ్చటికిఁ దెమ్మని, చెంతనున్న గరుఁడుని కాజ్ఞయిచ్చి, తానా భూమిపయిని గౌతమి కరువ దామడను స్వర్ణ ముఖర్యాఖ్య వాహిని చెంత స్వర్ణ నగాధిత్య సదృశమైన యొకచో నౌక వనముంగను గొని దాని వైఖరి కలరి యచ్చట విహరించు చుండెనట. ఇదియే వేంకటాచల ప్రదేశము. ఇంతలో గరుడుఁడు పై కుంఠమునకుఁబోయి యచ్చటి నారాయణాద్రిని పెకలించి నిమిష మాత్రనెతెచ్చి యెదుట నిలువగా, నా వాసు దేవుం డా చెంతనున్న స్వామి పుష్కరిణియన్ సరమునుజూపి యీ మహాసరసీపై నెసగంగధరణి నిడుమని యానతీయఁగా నాతఁడట్లు చేసెను. దీనిని బట్టి భూమిపై స్వామి పుష్కరిణి యను నొక సరస్సు, వెంకటాద్రియను నొక కొండ వెలసియుండగా దీనినే అందు వరాహావతారమున నారాయణాద్రిగఁ జేసినట్లగ పడుచున్నది. L వెన్నుఁడు విహరించుచుండ, దేవతలాతని స్తుతించి “తనుధారులిట్టులీ B 10 శ్రీనివాసవిలాససేవధి దారుణ రూపమునుజూచి భయమున మూఢులయ్యెదరు, చాలించి యీ మూర్తి సౌమ్య రూపమున మీ లొనంగ వె అని ప్రార్ధింప నా దేవుఁడు సురల కానందమైసగ " సేవింప నింపైన శ్రీనివాసుడయి " నిలిచినాడట. ఇది స్వర్ణ ముఖరీ తీరమునఁగల స్వామి పుష్కరిణియను సరస్సు చెంతనున్న వెంకటాద్రియుదు వరాహావతారమూర్తి శ్రీనివాసుడై వెలసినకథ. ఇది యంతయు వరాహ పురాణాంతర్భాగముగానున్నది. వరాహావతార మునకుఁ బూర్వమే పృథినిపై స్వామిపుష్కరిణి యెట్లువచ్చినది, ఆ వరాహ మూర్తి దీనిచెంత కే యెందులకు రానయ్యె నను ప్రశ్నకు సమాధానముగా కల్పాదియందు ప్రళయవై కుంఠ విలసితో జ్యూనమున ప్రవిష్టమైనట్టి దాని యందు నిజపదోద్భవయగు గంగనునిచి " యే మేను గానని యుర్వికి బిలుచుకొని వచ్చినాడట ! ఆ గంగతో స్వామిపుష్కరిణియు వచ్చినదట. ఈ తీర్థ తీరంబునందు వరాహుఁగొలిచి పూజించినఁ గోటిజన్మంబుల కలుషసంఘంబు తక్షణమే తొలంగునట. ఈ రీతిగా వరాహుని, శ్రీనివాసునిగూడ వెన్నుని రూపములుగా నీ స్వామిసరోవరతటమున నిల్పిన ట్లైన నది. కాని వరాహుఁడే శ్రీనివాసుఁడై నాడు గదా. షష్ఠాశ్వాస ములోఁగూడ తొండమాళ్ రాజు మూలముగాఁ దనకు విమాన ప్రాకా రాదుల నిర్మాణమును సాధించుపట్ల, నాతనికి నచ్చటి నిషాదునికి నా శ్వేత వరాహరూపముననే మొదట కనుపించి, పిదప భూమిలోనికిఁ జొరబడి పోయి, యాప్రదేశమును రాజు త్రవ్వించినపుడు జానువులవరకు భూమిలో పాతుకొనిపోయిన శ్రీనివాసుని యర్చారూపమే గానుపించుటను బట్టికూడ వరాహుఁడే శ్రీనివాస రూపముదాల్చినట్లు మనము నిశ్చయింపవచ్చును. కావుననే వరాహపురాణమున నీ కథాభాగము తొలుతఁ గానఁబడుటకుఁ గారణముకూడ వ్యక్తమగుచున్నట్లున్నది. ఇప్పుడిదిఁ 'మహావిష్ణోరాజ్ఞ యా ' ప్రవర్తమానమగుచున్న శ్వేతవరాహ కల్పముగావున నీ కల్పమున కాదీయగు నా వరాహమూర్తితో నీ శ్రీనివాసమూర్తి కభేదము కల్పింప పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/12 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/13 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/14 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/15 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/16 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/17 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/18 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/19 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/20 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/21 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/22 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/23 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/24 పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/25