వృక్షశాస్త్రము/అరటి కుటుంబము

వికీసోర్స్ నుండి

399

లు చేయుచున్నారు. రబ్బరు మనదేఅములో కూడ కొంచెమో గొప్పయో దొరుకు చిండినను దానితో మనకేమిచేయుటకు చేతకాకున్నది.

జువ్విచెట్టు కూడ చాల పెద్ద చెట్టు. దీని ఆకుల తొడిమలు పొడుగుగానుండును. దీని లోను పాలుగలవు.

ఎర్రజువ్వి ఆకులతొడిమలు పొట్టివి. లేతకొమ్మలు మిక్కిలి నున్నగా నుండును.

పిట్టమర్రి చెట్టును కొండలమీద పెరుగు పెద్దచెట్టు దీనికిని ఊడలు గలవు. కాని అవిపెద్దవికావు.

పుత్రజీవియు కొండలమీద పెరుగును. దీనిఆకులకొన వంకరగను సన్నముగను నున్నది.

తెల్లభరిణిక చెట్టుకూడ కొండప్రదేశములందే పెరుగును. మాను పొట్టి ఆకులు శీతా ఫలపుఆకులవలె కొమ్మకు రెండువైపులనే యుండును.

గజనిమ్మచెట్టు. మిక్కిలి పెద్దదిగాదు. దీనిపండ్లను తిందురు. మొగకంకులను కూరవండుకొందురు. ఈ చెట్టులోను పాలుగలవు. 400

అరటి కుటుంబము.


అరటిచెట్టు ప్రకాండము భూమిలోపలనే కాని పైన లేదు. మనకు మాను అని అనుకొనునది మిక్కిలి దీర్గముగాను దట్టంగాను నున్న ఆకుల తొడిమ లోక దానినొకటి చుట్టు కొనుటచే ఏర్పడు చున్నది. భూమిలోపల నున్న ప్రకాండము మూలవహము గుల్మము.

ఆకులు
- మిగులపెద్దవి. కణుపు పుచ్చములుండవు. నిడివి చౌకపాకారము. లఘు పత్రము. సమాంచలము సమ రేఖ పత్రము. మర్రి ఆకు మొదలగు వాని యందున్నట్లు వీని యందు అంచు చుట్టు ఈ నేలు లేవు. అందు చేతనే గాలికి చిరిగి పోవును. ఆకులు రెండు వైపుల నున్నగా నుండును.
పుష్పమంజరి. ఒక చెట్టు ఒక మారే పుష్పించును.

పుష్పించుటకే వృంతము పైకి వచ్చును. అదియేజంట. రెమ్మకంకి.

పువులు మిగుల పెద్దవగు చేటికల సందుల రెండు రెండు వరుసలుగా నున్నవి. పుష్పములకు నుప వృంతములు లేవు. క్రింది చేటికల సందు నున్నవి. స్త్రీపుష్పములు. మధ్య చేటికల సందుల నున్నవి. మిధున పుష్పములు పైనున్నవి. పురుష పుష్పములు.

పుష్పనిచోళము. 5 దంతములు గల నొక గొట్టమున్నది. దీని కొక వైపున నిలువున జీలిక గలదు. రక్షకపత్రములు 3 ఆకర్షణ ప్త్రములు 2 గలసి ఈ గొట్టమైనదని యూహింప వచ్చును. ఈగొట్టమునకు లోపలి వైపున విడిగా నొక ఆకర్షణపత్రముగలదు. వానికి రంగంతగాలేదు ఉచ్చము.

కింజల్కములు
- 5 విడిగానున్న ఆకర్షణ పత్రముచే నావరింపబడి యున్నవి. దీని కెదిరుగ నొకకింజల్కమునులేదు. పుప్పొడితిత్తులు వెడల్పుగా నున్నవి.

401

అరటి చెట్టు 1. కంకి, రెండు ఊరుచేటికలు పైకిలాగియున్నవి. 2. పువ్వు, 3. కింజల్కములు, అండకోశము. 402
అండకోశము
అండాశయము నీచము. 3 గదులు కండ కాయ. అడవి కాయలందు దప్ప గింజలు లేవు. కీలము సన్నము. అడుగున రోమములతో గూడి లావుగ నున్నది. కీలాగ్రము చీలి 6 తమ్మెలుగ నున్నది.
మెట్ట్ తామర

మెట్ట తామర హిందూ దేశమునందంతటను పెరుగు చున్నది.

ప్రకాండము
మూలవహము.
ఆకులు
లఘుపత్రము ఒంటరిచేరిక అండాకారము కణుపు పుచ్చములు లేవు సమ రేధ పత్ర్ము రెండు వైపుల నున్నగా నుండును కొన సస్న్నము.
పుష్ప మంజరి
కంకి. కంకిమీద అంగుళము అంగుళ దూరమున రెండేసి పువ్వులు గలవు వీని దగ్గర మూడేసి చేటికలు గలవు.
పుష్ప కోశము
3 రక్షక పత్రములు ఉచ్చము. ఎండి పోయినను కాన నంటి పెట్టుకొని యుండును.
దళ వలయము. ఆకర్షణ పత్రములు 3. రక్షక పత్రముల కంటె పెద్దవి గాను ఎక్కువ రంగుగాను నున్నవి. ఎర్రని రేకులన్నియు ఆకర్షణ పత్రములు గావు.
కింజల్కములు
దళవలయములోపల ఆకర్షణ పత్రములవంటివి నాలుగైదు కలవు. ఇవియే పుష్పమున కందముదెచ్చుచున్నవి. వీనిలో నన్నిటి కంటెను లోపలగా నున్న దానిమీద మధ్యగానొక పుప్పొడిచిత్తి గలదు. దీనిలో ఒక గది మాత్రమే కలదు. మిగిలిన కింజల్కములు గొడ్డులై ఆకర్షణ పత్రముల వలె మారినవి. 403
అండకోశము
- అండాశయము 3 గదులు నీచము కాయ బహు విదారుణ ఫలము. కీలము ప్ల్చగాను కీలాగ్రము వెడల్పుగాను నున్నది.
కచ్చూరము.

కచ్చూరము మొక్క హిందూ దేశములో కెల్ల బంగాళ దేశమ్ందెక్కువగా గలదు.

ప్రకాండము
- సశునము. భూమి మీద నిజమైన ప్రకాండము లేదు.
ఆకులు
- లఘుపత్రము కణుపు పుచ్ఛములు లేవు. తొడిమ గలదు బల్లెపాకారము సమాంచలము సమ రేఖ పత్రము క్రింది వైపున బిరుసుగా నున్న రోమములు గలవు. కొన సస్న్నము వేసవి కాలమందు ఆకులెండి రాలి పోవును.
పుష్పమంజరి. కంకి. వేసవికాలమందాకు లెండి పోయినప్పుడు బయలు వెడలును. గులాబి రంగు.
పుష్ప కోశము
సంయుక్తము. 8 దంతములు గలలవు. ఉచ్చము.
దళవలయము. అడుగున గొట్టము వలె నున్నది. కంఠము లావుగా నుండును. ఆకర్షణ పత్రములును, ఆకర్షణ పత్రములుగా మారిని కింజల్కములును గలసి వెడల్పుగు రెండంచుల గరాటి వలే నైనవి. దీని పై అంచులో నిడివి చౌకముగ నున్న నెర్రని తమ్మెలు 3ను ఆకర్షణ పత్రములు.
కింజల్కములు
అగరాటి యొక్క పసుపుపచ్చగా నున్న 8 తమ్మెలు కింజల్కములు వీనిలో లోపలగా నున్న అతమ్మె యెక్కువపొడగుగాను నున్నది. పైనవున్న రెండు తమ్మెలకు మధ్య కింజల్కపు కాడ కలదు. పుప్పొడి తిత్తికి రెండు గదులున్నవి. గదులక్రింద నుండి చిన్నవాలములు గలవు. 404
అండకోశము
- అండశయము నీచము సంయుక్తాండాశము 3 గదులు ఒక్కొక గదిలో చాల యండములు గలవు.
కీలము
- సన్నముగా దారమువలెనున్నది. కీలాగ్రము మూడు తమ్మెలుగ చీలి యున్నవి. ప్రతి రెమ్మె మధ్య ఒక సన్నని రంద్రము గలదు.

ఈ కుటుంబపు చెట్లలో నన్నియు గుల్మములే. వీనిలో మిక్కిలి ఎత్తుగా బెరుగునది అరటి చెట్టు. సాధారణముగ వీని ప్రకాండములు మూల వహములు. అండ కోశము నీచము. 3 గదులు గలల్వు. కింజల్కములీ కుటుంబములో మూడు విధస్ములుగస్ నున్నవి . అరటి చెట్టు నందు వలె కొన్నిటి యందు 5, 6 కింజల్కములున్నవి. మరికొన్నిటియందు మెట్ట తామరలో నట్లు కింజల్కములన్నియు ఆకర్షణ పత్రముల వలె మారి పుప్పొడి తిత్తి యొక్క ఒక గది మాత్రము మిగులు చున్నది. అల్లము కచ్చూరము మొదలగు కొన్నిటి యందు రెండు గదులు గల యొక పుప్పొడి తిత్తిగలదు. ఈ భేదములను బట్టి అరటి కుటుంబ ఉప కుటుంబములుగా విభజింప బడినది.

అరటిచెట్లు మన దేశమునందెల్ల యెడల 5, 6 వేల యడుగుల ఎత్తు ప్రదేశములందు కూడ బెరుగుచున్నవి. వీని 405

లో బొంతయరటి, కొమ్మరటి, చెక్కరకేళి, అమృతపాణి, ఎర్రఅరటి మొదలగు పెక్కు రకములుగలవు. ఈ రకములన్నియు ఒక అడవిరకమునుండి సేద్యభేదము వలన గలిగినవి. సేద్యము చేయు రకములు దుంపలమూలముననే వ్యాపించ బడు చున్నవి. వాని పండ్ల యందు విత్తులు లేవు. బొంత అరటి దాదాపుగా అన్ని నేలలందును పెరుగును కాని మిగిలిన రకములు పెరుగవు. వీనికి సారవంతమగు నేలలుగా వలెను. కాన క్రొత్తగా దోటలు వేయునపుడు చెరువులో బెడ్డ దీసి తోటలలో వేసెదరు. మరియు నీలి రొట్టను బేడను నెరువుగా వేయుచో దోటలకు బలము కలుగును. అరటి చెట్లను దోటలలోనే గాక చేల గట్ల మీదకూడ పాతుదురు. చిన్నచెట్లను పాతిన యొక సంవత్సరమునకు గాపుకు వచ్చును. కెల నుండి కొన్ని కాయలు దిగిన పిదప మిగిలిన పుషములను గోసేసివేయుట మంచిది. అట్లు చేసించో ఆహార పదార్థములాకాయలకే సంమృద్ధిగా బోవును. కాన అవి నీరసముగా నుండక బాగుగ నుండును. అది గాక చివర పుష్పముల నుంచినను లాభము లేదు. అవి పురుష పుష్పములు గాన కాయలు కాయవు. అరటి చెట్టు పుష్పించి యున్నప్పుడు దానినాశ్రయించి చుట్తునున్న చిన్న చిన్న మొక్కలను దీసివేయుట మంచిది. కాయలుపండిన పిదప అరటి చెట్లను నరికి 406

వేసెదరు. నూరుచెట్లను పైరు చేయుటకు సుమారు 13 రూపాయలు ఖర్చగును. కాని ధర బాగుగా నున్న యెడల 100, 150 రూపాయల వరకు రావచ్చును.

అరటి పండ్లు మిక్కిలి రుచియైనవి. ఇవి మామిడి పండ్లు పనస పండ్లు వలె కొన్ని ఋతువులందే కాక ఎల్లప్పుడును దొరకును. బొంత అరటి కాయలు కూరకే బాగుండును. అరటి గెల చివర నుండు పువ్వును కూడ కూర వండుకొను చున్నాము. కొందరు అరటి కాయలు బలుచగాముక్కలు కోసి ఎండ బెట్టి పొడి చేసి నిల్వ వుంచు కొనెదరు. ఈ పొడుమును కూడ బియ్యపు పిండి, జొన్నపిండి వలెనే వాడుదురు. అరటి స్థంభముల నేనుగులు తిన్నచో వానికి బలము గలుగును. దుంపలను ఆవులకు బెట్టితిమా అవెక్కువ పాలిచ్చును. స్థంభములందముగా నుండుట చే వివాహాది శుభ కార్యములందు బందిళ్ళకు వీనిని గట్టు చున్నారు.

అరటిచెట్ల యుపయోగము పండ్లను దినుట, ఆకులలో భుజిచుటయే గాదు, వాని నుండి విలువైన నారయు దొరుకుచున్నది. నారకు గొండ ప్రదేశములందు బెరుగు చెట్లు శ్రేష్టము నారదీయుటకు చెట్లు పుష్పింపబోవు చుండగా నరికి వేసి, స్థంభములను దొప్పలుగా విడదీసి, మూడేసి 407

అంగుళముల వెడల్పున నిలువున జీల్చెదరు. ఆ చీలికలను నొకనున్నని బల్లకును నొక కత్తికిని మధ్య బెట్టి లాగెదరు. అట్లు లాగుట వలన నా చీలికలలోని నీరు మెత్తని పదార్థమును పోయి నార మాత్రము మిగులును. దీనినే ఎండ బెట్టెదరు. ఈ నారతో జాలకాలమునుండి పగ్గములు, కాగితములు చాపలు చేయుచున్నారు గాని ఈమధ్యబట్టలుకూడ నేయు చున్నారు.

లేత ఆకులు కాలి పుండ్లు పడిన చోట వేయుచో బాధ తగ్గును. అరటి వేరు, ప్రకాండమును రక్త సంబంధము లగు కొన్ని జబ్బులకు మంచివి.

కచ్చూరము మొక్క ఒక బంగాళా దేశమునందే కాక చీనా మొదలాగు నేషియా ఖండమందలి ఇతర దేశములలో కూడ బెరుగు చున్నది. అది వేసవి కాలమందు పుష్పించును. దీని వేళ్లను ముక్కలుగా కోసి ఎండ బెట్టుదురు. ఇవియే గచ్చూరములు. వీనికి మంచి పరిమెళము గలదు. వీనిని పొడుము చేసి పచ్చాకుతో గలపి కొబ్బరి నూనెలో వేయుదురు.

పసుపు మొక్కలను తరచుగా వంగ, కంద మొదలగు నితర పైరులతో గాని విడిగా గాని వేయుదురు. పొలము 808

లో నంతయు బసువునేవేసిన యెడల దిరిగి మూడేండ్ల వరకు నచ్చోట పసుపు వేయరు. వరియో రాగులో వండించుదురు. వర్షకాలము మందు దుంపముక్కలను నాటి చైత్ర మాస ప్రాంతముల దుంపలను ద్రవ్వెదరు. ఎకరమునకు పది మణుగులు వేసినచో రెండువందలమణుగుల వరకు రావచ్చును. (త్రవ్విన పచ్చి దుంపలను నిలువ చేయుటలో మూడు నాలుగు విధములు గలవు. కొందరు పసుపు కొమ్మల నొక కుండలో వేసి మూత వేసి దానిపైన పేడ పూస పూసి, ఉడక బెట్టెదరు. అటు మీద వారము దినములు (రాత్రులందు మంచు దగుల నీయక కప్పుచు) ఎండలో బెట్టెదరు. కొందరు పేడ నీళ్ళలొ ఈ దుంపలను వేసి కాచు చున్నారు. మరి కొందరు కాచకనే నీళ్ళలొ నిమ్మకాయల రసము గలిపి పశుపు కొమ్ముల నానవేసి ఎండపెట్టుదురు. ఎండ బెట్టుటకు బదులు కొందరు తడి ఆరు వరకు పొయ్యిమీద బెట్టుదురు. చాయ పసుపునకు బిండి పసుపునకు బంట యొకటియే రెండు మూడు సార్లు నీళ్ళలో ఉడక బెట్టుట వలన అదే చాయ పసుపగు చున్నది. పసుపునకు చిరకాలము నుండి చాల గౌరవము గలదు. అది పుణ్యాంగనా చిహ్నము ప్రతి శుభ కార్యమునందును నిదియుండి తీరును. క్రొత్త బట్టను కట్టుకొనునప్పుడుకూడ 409

వానికించుక పసుపు రాయుట మనలో ఆచారము. పసుపును స్త్రీలు తమ దేహములకు పూసి కొనెదరు. గడపలకు రాతురు.

రంగుల్లో పసుపు యొక్కఉపయోగము తగ్గి పోయినది. అది స్థిరముగ నుండు రంగు కాదు. మరియు నిప్పుడంత కంటే చౌక రంగులను చేయు చున్నారు.

ఔషధము లందు కూడ పసుపు వినియోగ పడుచున్నది. అది దేహమునకు వేడి కలుగ జేయును.

చెన్న పట్టణము, బొంబాయి, కలకత్తా నుండి పసుపు జర్మినీ, ఇంగ్లాండు, అరేబియా, పెరిష్యా మొద్లగు ఇతర దేశములకు ఎగుమతి అవు చున్నది..

ఏలక చెట్లు కొండలమీదను అడవులలోను 5 మొదలు 8 అడుగుల ఎత్తు వరకును పెరుగును. అవి 500 మొదలు 50,000 అడుగులవరకు ఎత్తుగా నున్న ప్రదేశములందు గాని పెరుగ జాలవు. ఈ చెట్లలో రెండు రకములు గలవు. ఒక దాని ఆకులు సన్నముగా నుండును. వీనిక్రింది పైపునపట్టు వంటి రోమములు గలవు. రెండవ దాని ఆకులు వెడల్పుగా నుండును. రోమములు లేవు. దీని కాయలు పెద్దవి. సా 410

రవంత మైన నేలయు, దాపుననొకకాలువయు జల్లని గాలియు ఈ మొక్కల కావశ్వకములు.

అడవులలో ఏలక చెట్లు పెరుగు చున్న చోట కలుపు దీసి చెత్త మొక్కలను దగుల పెట్టి నేల బాగు చేసెదరు. ఆ మొక్కల మీద నీడ ఎక్కువ గానున్న యెడల కొన్ని చెట్లలు గొట్టి వేయ వలెను. నీడ అంత ఎక్కువగా లేకున్నను వీని దాపుననున్న నొకటి రెండు చెట్లను కొట్టి వేయుట వాడుక అయి యున్నది. అట్లు వృక్షములను బడగొట్టుట వలన వేళ్ళు పైకి వచ్చి నేల అదురును. అందు చేత మొక్కలకు లాభము గలుగును. పెక్కు చిన్న మొక్కలు పెరుగుట కారంభించును. ఒక వేళ అట్లు మొక్కలు మొలవవని తోచిన యెడల లేత మొక్కలను దెచ్చి అచ్చట పాదుదురు. రెండు సంవత్సరములకు 10 ఆకులు వేసి ఒక అడుగెత్తు పెరుగును. అప్పుడు మొక్కలారడుగుల కంటే దగ్గరగా నున్నచో, వానిని దీసి మరల దూర దూరముగ పాతి పెట్టెదరు. మూడవ సంవత్సరమునకు నాలు గడుగుల ఎత్తు పెరుగును. ఇప్పటి నుండియు కాయలు కాయుట ఆరంభించును. తోటలలో పెంచు నపుడు గడ్డి మొక్కలు లేకుండ నేలను బాగు చేసి, దూర దూరముగా గోతులు దీసి గింజలను గాని, దుంపల ముక్కలుగాని పా 411

తెదరు వీనిని లోతుగా పాత కూడదు. గింజల మీద మన్ను ఎక్కువగా బోయుచో అవి కుళ్ళి పోవును. విత్తనములు నాటిన యొక సంవత్సరమునకు నొక అడుగెత్తు మొక్కలు మొలచును. వాని నప్పుడు తీసి దూరముగ బాతి పెట్టెదరు.

కాయలెండి పోక మూపే కోసి వేయవలయును; లేని యెడల అవి బ్రద్ధలై గింజలు క్రింద రాలి పోవును. కాని, తరుచుగా నవి పచ్చగా గాక మునుపే కోసి యొక అగోతిలో పాతుదురు. మరునాడుదయమున దీసి, చాపల మీద బోసి ఎండలో పెట్టుదరు. వర్షము మంచు మాత్రము తగుల కుండ వానిని జాగ రూకత బెట్టు చుండవలెను. ఎండ లేక వర్షములే కురియు చున్న యెడల వానిని పొయ్యి మీద బెట్టెదరు. కాయల యందలి నీరు ఇగిరి పోయిన పిదప చేతులతో రాసెదరు. ఆ రాపిడికి తొడిమలు, ముచ్చికలు రాలి పోవును.

ఏలకులు సుగంధ ద్ర్వవ్యములలో ముఖ్యములైనవి. వాని సువాసనకై తాంబూలమునందును, కొన్ని పిండి వంటలందును వాడుదుము. వాని గింజల నుండి తైలమును దీసెదరు. ఏలకపొడి అనుపానములలో బనికి వచ్చుచున్నది. 412

అల్లము హిందూ దేశమునంతంటను సాగు చేయు చున్నారు. అది ఎర్ర మట్తి నేలలో ఏపుగా పెరుగును. వర్షాకాలమునందు బొలమును దున్ని చిన్న చిన్న గోతులు దీసి వానిలో పేడ వేసి అల్లము ముక్కలను నాటెదరు. నాటిన పిదప పొలమంతయు ఆకులతో కప్పుదురు. మొక్కలు పెద్దవి కాక పూర్వము వర్షములు విస్తారముగ గురుసి నీరు నిలిచెనా అల్లము మురిగి కుళ్ళి పోవును. కాన పొలములో నీరంతగా నిలువ కుండ చూచు చుండవలెను. 7, 8 నెలల నాటికె దుంపలు త్రవ్వుటకు వీలుగ నుండును.

అల్లము నుండియే సొంఠిని చేతురు. అల్లము ముక్కలను నీళ్ళలో నానబెట్టి మట్తిని రాల్చివైచి ఒక అల్జిప్పతో పై చర్మమును కోసి వేసెదరు. దానిని మరల కడిగి మూడు నాలుగు దినములు ఎండలో పెట్టుదురు. మరిక మాటు దానిని చేతులతోడనే రాపాడించి రెండు గంటలు నీళ్ళలో నాననిచ్చి ఎండలో బెట్టుదురు. ఇంకను నెచ్చటనైనను సొంటిని చర్మమంటి పెట్టుకొని యున్నేడల ఒక గోని గుడ్డమీద పెట్టి రాచెదరు.

అల్లముసోంఠి మందులలోచాలఉపయోగపడుచున్నవి. వీనిలో నొకటైన బెక్కు అనుపానములందు గలియు 413

చున్నది. వీని గుణమూలాయామందులను బట్టియుండును. అల్లమును కూరకాయలందును బచ్చళ్ళయందును కూడ వాడు చున్నారు. దీని నుడి యొక విధమగు సారాయిని చేయు చున్నారు.

మనదేశమునుండి అల్లము, సొంఠియు కూడ ఇతర దేసములకు ఎగుమతి అగు చున్నవి. మన దేశములో పండి ఎగుంతి అగు చుండినను మనకు చీనా, జపాను దేశముల నుండి కూడ అల్లము వచ్చు చున్నది. మరియు మనమెగుమతి చేయు అల్లము పంచ దారతో గలసియు, తేనెతోడ గలసియు, మనకు తిరిగి వచ్చు చున్నది.

పెద్దదుంప రాష్ట్రము. సన్న దుంప రాష్ట్రము కూడ ఔషధములలో పనికి వచ్చును. పెద్దదుంప రాష్ట్రము మనము కొంత చీనా దేశము నుండి కూడ వచ్చు చున్నది. వీని మొక్కల ఆకులనుండి వచ్చు నారతో కొన్నిచోట్ల కాగితములు చేయుచున్నారు.

గంధ మూలిక 3, 3-1/2 అడుగు లెత్తు పెరుగును గాని ప్రకాండము భూమిలోపలనే యున్నది. దీనిపువ్వులు పచ్చగా నుండును. ఎండిన వేళ్ళు ఔషధములోనికి పనికివచ్చును. 414

చంద్ర మూలికను కూడ ఔషధములలో వాడు చున్నారు. దీని వేరునకు సువాసస్న గలదు. దీని కీలాగ్రము గరాటి వలె నున్నది.

కొండ పసుపు ఉల్లి గడ్డల వలె గడ్డలుగా నుండును.

కస్తూరి పసుపు పసుపు వలెనే యుండును గాని మంచి వాసన గలదు

అడవి యేలక కాయలు. ఏలక కాయలకు బదులుగా వీని నుపయోగించుట కలదు కాని ఇవి అంత రుచిగా నుండవు.


కుంకుమపువ్వు కుటుంబము.


ఈ కుటుంబము మొక్కలు శీతల దేసములో గాని పెరుగ లేవు. ఇవి మనదేశములో అంతగా లేవు. వీనిలోనన్నియు గుల్మములే గాని పెద్ద చెటేలు లేవు. పుష్ప నిచోళములో ఆరురేకులుండును. కింజల్కములు మూడును పుష్స్ప నిచోళ ములైనను అండాశయము నైనను అంటి యుండును. అండాశయము ఉచ్చము. మూడు గదులు గలవు. కీలము ఒకటి కీలాగ్రములు మూడు. 415

కుంకుమ పువ్వు మొక్క.