భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/బేగం హజరత్ మహాల్

వికీసోర్స్ నుండి

బ్రిటిష్ సైనిక బలగాలను సవాల్‌ చేసిన యోధురాలు

బేగం హజరత్ మహాల్

(-1874)

మాతృభూమి కోసం ప్రాణాలను పణంగా పెట్టి, బ్రిీటిష్‌ సైనిక బలగాలతో తలపడిన రాణులు స్వాతంత్య్రోద్యమ చరిత్రలో అరుదుగా కన్పిస్తారు. ఆ అరుదైన ఆడపడుచులలో అగ్రగణ్యురాలు బేగం హజరత్‌ మహాల్‌. ప్రదమ స్వాతంత్ర సంగ్రామం

తొలిదాశలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులతో రాజీబేరాలు కుదుర్చుకునే ప్రయత్నాలు

చేసి, అవి విఫలమై చివరకు మార్గాంతరం లేక పోరు మార్గం ఎంచుకున్నరాణుల్లా కాకుండ, ఆది నుండి కంపెనీ పాలకులను శత్రువులుగా పరిగణించి, మాతృదేశ పరిరక్షణారం, ప్రజల ఆత్మగౌరవం కోసం ఆయుధ పట్టక తప్పదని ప్రకటించి, అత్యంత ధైర్య సాహసాలతో రణభూమికి నడిచిన వీరనారీమణి బేగం హజరత్‌ మహాల్‌. ఆమె ఉత్తర భారతదశంలోని అత్యంత సంపన్నవంతమై న అవధ్‌ రాజ్యం అధినత నవాబ్‌ వాజిద్‌ అలీషా సతీమణి.ఆమె స్వస్థలం మాత్రం ఉత్తర పదశ్‌ రాష్రంలోని పైజాబాద్‌. ఆమె చిన్నప్పటి పేరు ముహమ్మద్‌ ఖానం. ఆమె అందాచందాలకు గురించి విన్న నవాబు వాజిద్‌ అలీ షా ఆమెను కోరి మరీ వివాహమాడాడు. వివాహం తరువాత ఆమె బేగం హజరత్‌ మహాల్‌ అయ్యారు. వివాహం తరు వాత ఆమెకు ఇఫకారున్నీసా (నారీమణి) అని పేరుపెట్టాడు భర్త. ఆమెకు సుగంధ కన్య అని బిరుదు కూడ ఇచ్చాడయన. 37

ఆమెను ఇఫ్తికారున్నీసా ఖానం సాహెబా అని కూడ పిలుచుకున్నాడు. ఆ దంపతులకు మీర్జా బిర్జిస్‌ ఖదిర్‌ బహుధూర్‌ అను కుమారుడు కలిగాడు. ఆ తరువాత ఆమె బేగం హజరత్‌ మహాల్‌ అయ్యారు. అవధ్‌ రాజ్యం రాజధాని లక్నో. అది మొగల్‌ రాజ్యంలో ఒక భాగం కాగా, ఆ ప్రభువుల బలాధిక్య త కీణిస్తున్న సమయంలో స్వతంత్య్రరాజ్యంగా ప్రకటితమైంది. 1801లో అవధ్‌ రాజు నవాబు సాదత్‌ అలీ బ్రిీటిష్‌ పాలకులతో సంధి చేసుకుని, అవధ్‌ రాజ్యాన్నిఈస్ట్‌ ఇండియా కంపెనీకి అప్పగించాడు. అవధ్‌ మీద అధికారం కంపెనీ పాలకులది కాగా, నవాబు నామమాత్రమయ్యాడు. ఆ అవధ్‌ రాజ్యానికి చివరి నవాబు అయినటువంటి వాజిద్‌ అలీషా 1847లో సింహాసనం అధిష్టించాడు.

ఆ సంవత్సరం గవర్నర్‌ జనరల్‌గా డల్హౌసీ భారతదశం విచ్చేశాడు. రాజ్యవిస్తరణ కాంక్షతో ఇండియాలోని ఒక్కొక్క రాజ్యాన్ని అక్రమంగా ఆక్రమించుకుంటున్న అతని చూపు సంపన్నవంతమైన అవధ్‌ రాజ్యం మీదా పడింది. ఫలితంగా ఈస్ట్‌ ఇండియా కంపెనీకి చెందిన గవర్నర్‌ జనరల్‌ లక్నోలోని ఒక బ్రిటిష్‌ అధికారి ద్వారా లొంగుబాటు పత్రాన్ని తయారు చేయించి నవాబ్‌ వాజిద్‌ అలీషాకు పంపి, ఆ పత్రం మీద సంతకం చేయమని ఆదేశించాడు. ఆ విధంగా సంతకం చేయనట్లయితే కంపెనీ సేనలు అవధ్‌ రాజ్యంతోపాటుగా అంతఃపురాన్ని కూడ స్వాధీనం చేసుకోగలవన్నాడు. ఆ బెదిరింపులకు భయపడిన నవాబు అవధ్‌ను కంపెనీపరం చేయడనికి సిద్ధపడ్డాడు.

భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో అవధ్‌ పతాకాన్ని వినువీధుా ల్లో ఎగరవసన బేగం హజరత్‌ మహాల్‌ ఆ సమయంలో రంగప్రవేశం చేశారు. ఆ లొంగుబాటు పత్రం మీద సంతకాలు చేయడమంటే అవధ్‌ రాజ్యాన్ని పూర్తిగా ఈస్ట్‌ ఇండియా కంపెనీకి దాసోహం చేయటమేనని భావించిన ఆమె గవర్నర్‌ జనరల్‌ ఆదేశాలను నిరసించారు.ఈ పరిణామాలతో ఆగ్రహంచిన కంపెనీ పాలకులు నవాబ్‌ వాజిద్‌ అలీషాను 1856 ఫిబ్రవరి 13న నిర్బంధంలోకి తీసుకుని, మార్చి 13న కలకత్తా పంపారు. ఆ పరిణామాలకు భయపడిన నవాబు పరివారంలోని అత్యధికులు నవాబుతో పాటుగా కలకత్తా వెళ్ళి పోయారు. బేగం హజరత్‌ మహాల్‌ మరికొందరు మాత్రం, స్వంత గడ్డను పరులపరం చేసి కలకత్తా వెళ్ళటం ఇష్టంలేక లక్నోలోని కౌసర్‌ బాగ్లో ఉండిపోయారు. ఆంగ్లేయుల ఈ చర్య వలన ప్రజలలో అసంతృప్తి రగులుకుంది. అవధ్‌ చుట్టు ప్రక్కల గల స్వదేశీ పాలకులు, స్వదేశీ యోధులు కంపెనీ పాలకుల దుశ్ఛర్యల పట్ల తీవ్రంగా ప్రభావితులయ్యారు. కుతకుతలాడుతున్నహృదాయాలతో ఆంగ్లేయుల చర్యల పట్ల మండి పడసాగారు. ఆ సమయంలో ప్రదమ స్వాతంత్య్రసంగ్రామం ఆరంభవుంది. కంపెనీ చర్య ల పట్ల తీవ్రంగా ఆగ్రహావేశాలను వ్యకంచేస్తున్న అవద్లోని ప్రజలు, సైనికులు స్వదేశీయుల పాలన కోసం కంపెనీ పాలకుల ఆధిపత్యాన్ని నిరాకరిస్తూ తిరుగుబాటు ప్రకటించారు. 1857 మే 31న లక్నోలోని ఛావనీలో తిరుగుబాటు ఫిరంగులు పేలాయి. ఆంగ్లేయాధికారులను, ఈస్ట్‌ ఇండియా కంపెనీ సమర్థకులను లక్నో నుండి, అవధ్‌ రాజ్యంలోని ఇతర ప్రాంతాల నుండి తరిమివేశారు. అవధ్‌ రాజ్యంలోని అత్యధిక ప్రాంతాలు తిరుగుబాటు వీరుల ఆధిపత్యంలోకి వచ్చాయి. కంపెనీ పాలనాధికారం అనవాళ్ళు కూడ కన్పించకుండ తుడుచుకు పోయింది.

ఆ పరిస్థితులతో హడలిపోయిన ఆంగ్లేయులు బేగంతో కాళ్ళబేరానికి వచ్చారు. ఆమె కనుక కంపెనీకి సైనిక సహాయం అందచేస్తే వాజిద్‌ అలీషా పూర్వీకుడు షుజా ఉద్దౌలా కాలంలో అవథ్‌ పాలన క్రింద ఉన్న అన్ని ప్రాంతాలను తిరిగి ఆమెకు అప్పగిస్తామని, తద్వారా అవధ్‌ రాజ్యం విస్తరించగలదని రాయబారానికి దిగారు. ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే కంపెనీ రాజ్యవిస్తరణ కాంక్షకు తాను తొడ్పటు అందించినట్టు కాగలదు కనుక, స్వేచ్ఛా-స్వాతంత్య్రకాంక్ష గల స్వదేశీ పాలకులకు వ్యతిరేకంగా ఆంగ్లేయుల పక్షాన నలివటం ఏమాత్రం సహించని బేగం హజరత్‌ మహాల్‌ ఆ ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించారు.

1857 జూన్‌ 30న చింహట్ వద్ద కంపెనీ బలగాలతో జరిగిన పోరాటంలో తిరుగుబాటు వీరులకు లభించిన విజయం ఇటు ప్రజలలో అటు తిరుగుబాటుకు సన్నధమౌతున్న స్వదేశీపాలకులలో, సైనికులలో ఉత్సాహాన్నిరేకెత్తించింది. ఆ ఉత్సాహంతో తిరుగుబాటు యోధులు మరింతగా రెచ్చిపోయారు. స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించారు. ఆ సమయంలో అవధ్‌ పతాకం క్రింద నాయకత్వం స్వీకరించి ఆంగ్లేయుల మీద పోరాటం సాగించేందుకు బలమైన నాయకుడి అవసరం వచ్చింది. నవాబు వాజిద్‌ అలీషా వంశస్థుల కోసం అంవేషణ ప్రారంభమైంది. బ్రిటిష్‌ పాలకులంటే ఏర్పడిన భయం వలన లక్నోలో ఉంటున్ననవాబు భార్యలు కొందరు తమ బిడ్డలకు, కలకత్తాలో ఉన్నభర్త బంధువులకు ఎటువంటి ప్రమాదం సంభవించగ 39 లదోనని భయపడి కంపెనీ పాలకుల ఆగ్రహానికి తమను బలి చేయవద్దాంటూ ప్రాధేయ పడుతూ నాయకత్వం స్వీకరణకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ క్లిష్ట సమయంలో హజరత్‌ మహాల్‌ కంటకప్రాయమైన మార్గంలో కూడ చారిత్రక పాత్ర నిర్వహించేందుకు ఎంతో సాహసంతో ముందుకొచ్చారు. ప్రజల అభీయిష్టం మేరకు బిడ్డడు బిర్జిన్‌ ఖదీర్‌ను నవాబుగా ప్రకించేందుకు అంగీకరించారు. ఆ సందర్భంలో బేగం నిర్వహించిన పాత్ర, ఆమె త్యాగనిరతి, ఆత్మబలిదానం చిట్టచివరి వరకు శత్రువుకు లొంగని దీరత్వం చరిత్రలో ఆమెకు ప్రత్యేకస్థానం సంతరించి పెట్టాయి.

ఆ సమయంలో అవధ్‌ రాజ్యంలోని ఫైజాబాద్‌లో కంపెనీ పాలకుల బందీగా నున్న తిరుగుబాటు యోధుల నేత మౌల్వీఅహమ్మదుల్లా షాను, తిరుగుబాటు యోధులు విడుదల చేయించి ఆయనను తమ నాయకునిగా స్వీకరించారు. మౌల్వీ తన బలగాలతో లక్నోచేరుకుని కంపెనీ పాలకులను ఎదుర్కొన్నారు. ఆ సందర్భంగా బేగం హజరత్‌ మహాల్‌ బ్రిటిషు పాలకులకు వ్యతిరేకంగా మరింత చొరవ తీసుకున్నారు. ఆ కారణంగా తిరుగుబాటు మరింత ప్రజ్వరిల్లింది. పది రోజుల్లో లక్నో అంతా పూర్తిగా తిరుగుబాటు సేనల పరమైంది.

బేగం హజరత్‌ మహాల్‌ తన బిడ్డ బిర్జిస్‌ ఖదీర్‌ను 1857 జూలై 5న అవధ్‌ నవాబుగా ప్రకటించారు. ఆ నిరయాన్ని పలువురు ప్రముఖులు బలపర్చారు. తిరుగుబాటు యోధులలో ఆనందం విల్లివిరిసింది. బిర్జిస్‌ ఖదీర్‌ పేరిట బేగం హజరత్‌ మహాల్‌ పాలన ప్రారంభమైంది. ఆమె అధికారపగ్గాలను చేపట్టగానే పాలనా పరమైన చర్య లను చేపట్టారు . అన్ని సాంఘిక జనసముదాయాలకు పాలనాధికారంలో భాగం కలిగించే విధగా సమష్టి నిర్ణయాలకు అనుకూలంగా పాలనా వ్యవస్థ్దను రూపొందించారు. బహిర్గత శత్రువును ఎదాుర్కొనడానికి ప్రాణాలు పణంగా పెట్టే సైనికులకు అధిక ప్రాధాన్యత కల్పించారు. స్వదేశీ పాలకులు, నమ్మకమైన సైనికాధికారులకు, తిరుగుబాటు వీరులకు, స్వదేశీ భక్తులకు ప్రతిభా సామర్థ్యాల ఆధారంగా పలు విభాగాల బాధ్యతలను అప్పగించారు.

మతం, కులం, ప్రాంతాల ప్రసక్తి లేకుండ, పౌర-సైనికాధికార ప్రముఖులైన ముమ్మూఖాన్‌, మహారాజ బాలకృష్ణ, బాబూ పూర్ణచంద్‌, మున్షీ గులాం హజరత్ మహమ్మద్‌ ఇబ్రహీం ఖాన్‌, రాజా లాలా సింహ్‌, రాణా జిజియా లాల్‌, రాజా మాన్‌సింగ్, రాజా దేశిబక్ష్‌ సింగ్, రాజా బేణి ప్రసాద్‌ లాంటి వారితో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.

40



ఈ కమిటీ ప్రతి రోజు సమావేశమయ్యేది. ప్రతి అంశాన్నికమిటీ సభ్యుల ఎదుట పెట్టి చర్చించి ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకుని వాటి అమలును బేగం పర్య వేక్షించారు. ఆనాి రాజరికపు రోజుల్లో ఆ విధంగా ప్రజాస్వామికంగా వ్యవహరించటం బేగం హజరత్‌ మహాల్‌ బుద్ధికుశలతకు నిదర్శనం. అన్ని రంగాలు పూర్తిగా ఆమె ఆధీనంలోకి వచ్చాక అవధ్‌ నవాబు బిర్జిస్‌ ఖధిర్‌ పేరిట వెలువడిన ప్రకటనలు అవధ్‌ రాజ్యంలో ఆంగ్లేయుల పాలన అంతటితో అంతమైందని ఆ ప్రకటనలు స్పష్టం చేశాయి. అంతటితో ఆమె మిన్నకుండి పోలేదు. సfiయంగా గుర్రం మీదా, ఏనుగు మీదా సవారి చేస్తూ ప్రజలను, ప్రముఖులను కలుస్తు ఆమె రాజ్యమంతా తిరిగి అందర్ని ఏకతాటి మీదకు తెచ్చేందుకు విజయవంతంగా ప్రయత్నించారు.

బేగం హజరత్‌ మహాల్‌ ఎటువంటి ప్రగతిశీల, సామరస్యపూర్వక విధానాలు చేపట్టినా, ఆమె శక్తిసామర్థ్యాల పట్ల విశ్వాసం కలుగని కొందరు స్వదేశీ పాలకులు, జమీందారులు ఆమె నాయకత్వాన్ని తొలుత ఆమోదించలేదు. అవధ్‌ అంతా అస్తవ్యస్థ పరిస్థితి, క్రమశిక్షణారాహిత్యం, వ్యక్తిగత స్వార్థంతో కంపెనీ పాలకులవైపు మొగ్గు చూపుతున్నవిద్రోహుల బెడదా, బేగం శక్తి సామర్థ్ధ్యాలను శంకించే జమీందారుల రగడ, స్వదేశీ పాలకుల, అధికారుల సమస్యలు ఒకవైపు, అవమాన భారంతో రగిలిపోతున్న కంపెనీ పాలకుల కుయుక్తులు మరోకవైపు బేగం హజరత్‌ మహాల్‌ను చుట్టుముట్టాయి. 41 ఆ పరిస్థితు లలో కూడ ఆమె ఏమాత్రం అధర్య పడలేదు . ప్రజలను ఆకట్టుకుంటూ, స్వదేశీ పాలకులకు, తాలూకాదారులకు పలు రాయితీలు ప్రకించారు. ఆ సమయంలో ఆంగ్లేయాధికారి జనరల్‌ హ్యావ్‌లాక్‌ తనకు లభించిన రెండు విజయాల తరువాత కూడ అవధ్‌ నుండి నిష్క్రమించటంతో బేగం శక్తిసామర్థ్యాల మీద నమ్మకం కుదిరిన స్వదేశీ పాలకులు, జమీందారులు తిన్నగా బేగం నాయకత్వం స్వీకరించి, నజరానాలు సమర్పించుకోవటం ఆరంభించారు. ఢిల్లీలోని మొగల్‌ చక్రవర్తి బహద్ధూర్‌ షా జఫర్‌ ప్రతినిధిగా బిర్జిస్‌ ఖదీర్‌ తనను తాను ప్రకించుకున్నారు. ఆయన ప్రతినిధిగా బిర్జిస్‌ ఖదీర్‌ అవధ్‌ పాలకునిగా పాలనను చేపట్టారు. కంపెనీ అధికారుల చర్య లతో నష్టపోయి, కంపెనీ పాలకుల పట్ల ఆగ్రహంగా ఉన్నస్వదేశీయులు ఆయనను అవధ్‌ పాలకునిగా అంగీకరించారు. ఈ మేరకు అవసరమగు లాంఛనాలన్నీ పూర్తయ్యాయి.

ఆ అనుకూల వాతావరణంలో ప్రజల అవసరాలను తీర్చుతూ, శత్రువు దాడుల నుండి ప్రజలను కాపాడేందుకు లక్నో కోటనుపటిష్ట పర్చే కార్యక్రమాలను బేగం చేపట్టారు . ఆమె స్వయంగా తన లక్షలాది రూపాయలను వ్యయంచేసి కోటగోడలను పునర్మించారు. ప్రతి విషయాన్ని హజరత్‌ మహాల్‌ స్వయంగా పర్యవేక్షించసాగారు. ఆమె ఏనుగునెక్కి పనులు సాగుతున్న ప్రదేశాలకు చేరు కుని స్వయంగా పర్య వేక్షించటంతో ప్రజలు-సైనికులు ఉత్సాహభరితులయ్యేవారు.

ఆ సందర్బంగా అవధ్లోని ప్రజలనుద్దేశించి బిర్జిస్‌ ఖదిర్‌ పేరిట బేగం హజరత్‌ మహాల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో, ' హిందూ- ముస్లింలకు ధర్మం, ఆత్మగౌరవం, ప్రాణం, ధానం అను నాలుగు అంశాలు ప్రధానం. ఈ అంశాలను కేవలం స్వదేశీ పాలనలో, స్వదేశీ పాలకులు మాత్రమే ప్రసాదించగలరు. కంపెనీ సైనికులు ప్రజలను దోచుకుంటున్నారు. ఆత్మగౌరవాన్ని మంట కలుపుతున్నారు. స్త్రీల మీదఅఘాయిత్యాలు, అత్యాచారాలు జరుపుతున్నారు...హిందూ-ముస్లిం పౌరులను హెచ్చరిసున్నాం. ఆత్మగౌరవంతో, ధర్మ బదాంగా ప్రశాంత జీవితం సాగించాలంటే స్వదేశీ పాలన కోసం శతృ వులకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపటండి. స్వదేశీ సైన్యంలో భర్టీకండి. ..మాతృదేశం కోసం సాగుతున్నపోరాటంలో భాగస్వాములు కండి. శతృ వుకు సహకరించ కండి.ఆశ్రయం ఇవ్వకండి..', అంటూ బేగం హజరత్‌ మహాల్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆ పిలుపుతో ఉత్తేజితులైన ప్రజలు, సైనికాధికారులు, అంతవరకు ఆమెకు దూరంగా 42 ఉన్న స్వదేశీ పాలకులు, అధికారులు బేగం పతాకం నీడన చేరుకున్నారు.(భారత్‌కి స్వాతంత్ర సంగ్రామం మేం ముస్లిం మహిళావోంకా యోగ్ దాన్‌, (హిందీ) -డాక్టర్‌ ఆబెదా సమీయుద్దీన్‌, ఇస్టిట్యూట్ ఆఫ్‌ ఆబ్జెక్టివ్‌ స్టడీస్‌, న్యూఢిల్లీ, 1997, పేజి.22) ఈ మేరకు పరిస్థితులు మరింత అనుకూలించి ప్రశాంత వాతావరణం ఏర్పడటంతో, అవధ్‌ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు బేగం నడుంకట్టారు. ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం ఫలితంగా పలు ప్రాంతాల నుండి లక్నోకు తరలి వస్తున్న తిరుగుబాటు యోధులకు, వేలాది సైనికులకు ఆమె ఆశ్రయం కల్పించాల్సి వచ్చింది. ప్రముఖ తిరుగుబాటు నాయకులు నానా సాహెబ్‌ పీష్వా, జనరల్‌ బక్త్‌ ఖాన్‌ రొహిల్లా, మొగల్‌ రాజకుమారుడు ఫిరోజ్ షా తమ భారీ సెనిక బలగాలతో లక్నో చేరు కుంటున్నారు.

ఈ నేతలకు, ఆ నేతల పరివారానికి, వారి సైన్యాలకు వసతి స్ధకర్యాలు సమకూర్చటం బేగంకు కడుభారంగా మారింది.ఈ పరిస్థితులు ఖజానా మీద అధిక భారమయ్యాయి. చివరకు ఖజానా ఖాళీ అయ్యింది. ఆమె వ్యక్తిగత సంపద కూడ ఖర్చయిపోయింది. గత్యంతరం లేని పరిస్థితులలో ధనికులు, సంపన్నవర్గాల మీద 'యుద్ధపన్ను' అంటూ ప్రత్యేక పన్ను విధించారు. ఆ నిర్ణయానికి సహజంగా మిశ్రమ స్పందన లభించింది. ఆ విధంగా సమకూర్చిన ధనం కూడ సరిపోక పోవడంతో ఆమె అధికారులు కొందరు తిరుగుబాటు వ్యతిరేక శక్తులుగా వ్యవహరిస్తున్నసంపన్నుల కుటుంబాల నుండి బలవంతంగా ధన సంపదలను వసూలు చేయసాగారు. ఆనాటి క్లిష్ట పరిస్థితులలో కూడ బేగం హజరత్‌ మహాల్‌ ఎంతో బుద్ధి కుశలతతో ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకుంటూ, ఆంగ్లేయులను ఎదుర్కొనేందుకు సైనికంగా సన్నద్ధులు కాసాగారు. ఈ మేరకు 1,80,000 మంది సైనికులను ఆమె సమకూర్చుకున్నారు. బ్రిటిషు బలగాలతో ఢీ అంటే ఢీ అనడానికి సిద్ధ్దమయ్యారు.

ఈ పరిస్థితులను గమనించిన బ్రిటిష్‌ అధికారి విలియం రస్సెల్‌, '..బేగం మాతో అప్రకటిత యుద్ధం ప్రారంభించింది...ఈ రాణులు, బేగంల శ్లాఘనీయ, శక్తివంత చరిత్రలను గమనించాక, అంత:పురంలో పర్దాల చాటున ఉంటూ కూడ ఎంతిటి శక్తి యుక్తులు సంతరించుకోగలరో తెలుసుకున్నాం..' అని వ్యాఖ్యానించాడు. (భారత్‌కి స్వాతంత్ర సంగ్రామం మే ముస్లిం మహిళావోంకా యోగ్ దాన్‌, పేజీ.42) 43 మరో ప్రముఖ చరిత్రకారుడు H.beverdge 1857 నాటి,'..తిరుగుబాటుకు బేగం ఆత్మలాంటిదిది '. అని బేగం హజరత్‌ మహాల్‌ను ప్రస్తుతించాడు. ( A Comprehensive History of India, H. Beveridge, 1887 Ed. Vol.III, Page. 842. Quoted by Mr. Srivasthava in his book Freedom Fighters of Indin Mutiny 1857 at page.105) ఆమె పర్దానషీ మహిళ కానట్టయితే మిగతా పురుషుల కంటే గొప్ప పోరాట యోధు రాలుగా ఖ్యాతి గడంచేది..', అని ప్రముఖ చరిత్రకారుడు Mr. Abdul Harim Sharar వ్యాఖ్యానించాడు. (Freedom Fighters of Indian Mutiny 1857, Mr. Srivasthava, page.105) అవధ్‌లో పరిస్థితులు కొంతమేరకు మెరుగు పడ్డాక బేగం హజరత్‌ మహాల్‌ తన రాజకీయ కుశలతను చూపనారంభించారు.బ్రిటిషర్లతో మిలాఖత్‌ అయిన నేపాల్‌ పాలకుడు జంగ్ బహద్ధూర్‌ను తనవైపుకు తిప్పుకునేందుకు పావులను కదిలించారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వదేశీ పాలకులతో చేతులు కలిపినట్టయితే ఆయనకు కంపెనీ పాలకులు ఆశపెట్టిన దానికంటే, ఎక్కువ భూభాగాన్నిఇవ్వగలనని వర్తమానం పంపారు. అవధ్‌ ఇరుగుపొరుగు స్వదేశీ పాలకులకు రానున్న గడ్డు పరిస్థితుల పట్ల హెచ్చరికలు చేస్తూ, అవసరాన్ని బట్టి ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుంటూ, మంత్రాంగం నడుపుతూ బేగం హజరత్‌ మహాల్‌ కంపెనీ పాలకులకు చెమటలు పట్టించారు.

ఈ విధంగా బేగం తన పాలనాదక్షతతో స్వదేశీ పాలకుల మద్దతుతో అవధ్‌లో పరిస్థితు లను అనుకూలంగా మార్చుకుంటున్న దశలో ఢల్లీ లో తిరుగుబాటు విఫలమెంది. బహుద్దాూర్‌ షా జఫర్‌ ను ఆంగ్లేయులు అరెస్టు చేశారు. తిరుగుబాటుకు కేంద్రంగా భావించిన ఢిల్లీ ఆంగ్లేయుల వశమైంది. ఈ వార్తలు తిన్నగా లక్నోచేరాయి. ఆ ప్రతికూల పరిస్థితులలో కూడ ఆమె అధైర్యపడలేదు. ప్రజల, స్వదేశీ యోధుల అండదండలతో కంపెనీ అధికారులకు కిం మీద కునుకు లేకుండ చేశారు.

బేగం హజరత్‌ మహాల్‌ సుమారు 10 మాసాల పాటు ప్రత్యక్షం గా పాలన చేశారు. ఆంగ్లేయులు లక్నోలోని ఆలంబాగ్ లోని రెసిడెన్సీ దాగి ఉండటం, ఆ రెసిడెన్సీ నుండి బయటపడి లక్నోను స్వాధీనం చేసుకొవడానికి కంపెనీ అధికారులు వేస్తున్న ఎత్తులను గమనించిన ఆమె రెసిడెన్సీ మీద దాడికి తన సైనికులను పురికొల్సారు. ఈ చర్య 44 కోసం 1857 డి సంబరు 22న సైనిక యోధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఉత్తేజపూరితంగా ప్రసంగిస్తూ, ' ఎందుకీ నిరీక్షణ..శతృవుతో తలపడేందుకు భయపడుతున్నారా?..బ్రిటిషర్లు తమ సైన్యాలను రప్పించేంత వరకు మీరు కూర్చోనే గడుపుతారా ? ముందుకు సాగండి. మీరు పోరాడుతారా ? లేదా ? చెప్పండి. పోరుబాటన నడువలేమంటే నేను ఆంగ్లేయులతో మంతనాలు జరిపి నా ప్రాణాలను కాపాడుకుంటాను. ఏ విషయం చెప్పండి ?', అంటూ సైనికులను, సెన్యాధిపతు లను నిగ్గదీశారు. ఈ సందర్బంగా సెనికుల మీద తూాటాల్లా ప్రయాగించిన ఆమె మాటలు తిరుగుబాటు యోధులలో ఆత్మ బలిదానానికి సన్నద్ధులను చేసి, పోరుకు ప్రేరేపించాయి. (Encyclopaedia of Women Biography Vol. II, Ed. by Nagendra.K.Singh, APH Publishing Corporation, New Delhi, 2001, Page.64)

ఆ తరువాత బ్రిటిష్‌ రెసిడెన్సీని బేగం సేనలు చుట్టుముట్టాయి. విజయమో వీర స్వర్గమో అంటూ పోరాటం ప్రారంభించాయి. ఈ పోరాట సమయంలో బేగం అపూర్వ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. బిడ్డడు బిర్జిష్‌ ఖధీర్‌ను వెంట పెట్టుకుని ఏనుగు మీద ఆమె స్వయంగా రణభూమికి విచ్చేశారు. (Hazrath Mahal riding on an elephant encouraged her army by her presence on the field of battle, History of Freedom Movement in India, Dr. Tara Chand, Page. 85)

మాతృభూమి కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న సైనికులను, ప్రజలను తన ప్రసంగాలతో ఉత్తేజపర్చారు. పోరాటం భయంకరంగా సాగింది. ఆ పోరాటం గురించి తెలుసుకున్న లక్నో కమీషనర్‌,బ్రిటిష్‌ అధికారి హెన్రీ లారెన్స్‌ వ్యాఖ్యానిస్తూ, ' ఎక్కడ కూడ ఇంతకుమించిన శౌర్య ప్రతాపాలు మేము చూడలేదు ', అంటూ బేగం నాయకత్వంలో సాగిన పోరాటాలను ప్రశంసించాడు. ఈ పోరులో పలువురు కంపెనీ అధికారులు మృత్యువాత పడ్డారు . స్వదేశీ యోధులు ఎంతగా పోరాడినా రెసిడెన్సీ మాత్రం హజరత్‌ మహాల్‌ వశం కాలేదు.

ఆ సమయంలో బ్రిటిష్‌ అధికారుల నుండి సంధి ప్రస్తావన వచ్చింది. తిరుగుబాటుదారులకు క్ష్మమాబిక్షప్రసాదిస్తామని, బేగంకు ప్రతినెల 25వేల రూపాయల పెన్షన్‌ ఇస్తామని, అందుకుగాను బేగం హజరత్‌ మహాల్‌ అవధ్‌ మీద తన అధికారాన్ని పూర్తిగా వదులుకోవాలని కంపెనీ అధికారులు ప్రతిపాదించారు. ఆ ప్రస్తావన పట్ల బేగం మండిపడ్డారు. మా గడ్డ మీద మరొకరి పెత్తనమా? మా ప్రాణాలు పోయినా సరే 45 శత్రువుకు లొంగేది లేదాన్నారు. బిడ్డడు బిర్జిస్‌ ఖదీర్‌ న్యాయమైన హక్కులను, తన వెంట నడిచిన స్వదేశీపాలకులను, సైనికులను, సేనాధిపతులను ప్రజలను కంపెనీ బలగాల దాయాదాక్షిణ్యాలకు వదిలి పెట్టలేనంటూ, ఆ ప్రతిపాదనలను ఆమె తిరస్కరించారు. నా ప్రాణం మీది తీపితో న్యాయమెన హక్కులను వదులుకునేది లేదని బేగం స్పష్టం చేశారు.

భారతదశ వ్యాపితంగా పలుప్రాంతాలలో ఆరంమైన తిరుగుబాట్లను అణచివేసిన, బ్రిటిష్‌ సైన్యాలు,సేనాధిపతులు చివరకు లక్నో మీద పూర్తిగా దృష్టి సారించారు. లక్నోను వీలయినంత త్వరగా పట్టుకోవలసిందిగా అధికారులకు గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కానింగ్ నుండి ఆదేశాలందాయి. 1858 మార్చి 3-4 తేదిలలో బ్రిటిష్‌ సైన్యాధిపతి కోలిన్‌ భారీ సైనిక బలగాలతో లక్నోను చుట్టుముట్టాడు. ఆయనకు తోడుగా నేపాల్‌ ప్రభువు జంగ్ బహద్ధూర్‌ తన బలగాలతో మార్చి 11వ తేదిన ఆంగ్లేయాధికారులతో కలిశాడు. లక్నోను అన్నివైపుల నుండి శతృసైన్యాలు పూర్తిగా చుట్టుముట్టాయి. బేగం హజరత్‌ మహాల్‌ నివాసం కైసర్‌బాగ్ మీద ఆంగ్లేయ సైన్యాల ఫిరంగులు నిప్పుల వర్షం కురిపిస్తుండగా, సైనికుల తుపాకులు గుండ్ల వర్షం కురిపించసాగాయి.

ఆ సమయంలో బేగం హజరత్‌ మహాల్‌ తన వెంట తొమ్మిది వేల మంది సైనికులతో మూసాబాగ్ వద్ద కంపెనీ సైనికులతో చివరిసారిగా తలపడ్డారు. మిడతల దండులా అన్ని వైపుల నుండి వచ్చిపడిన శత్రు సైనికులను తట్టుకుని నిలవటం బేగం సెన్యానికి అతి కష్టంగా మారింది. పరిస్థితి ప్రమాదంలో పడందని గ్రహంచిన సహచరు లు ఆమెను రక్షిత స్థలానికి వెళ్ళ వలసిందిగా సూచించారు. ఆమె అక్కడ నుండి మరోచోటుకు వెడితే అది ఆంగ్లేయులకు విజయం లభించినట్టు కాగలదని భావించిన ఆమె పెనుముప్పు చుట్టుముట్టేంత వరకు ఆ ప్రాంతం నుండి కదాలలేదాు. చివరకు సహచరుల ఒత్తిడి మేరకు తప్పని పరిస్థితులలో మార్చి 16న హజరత్‌ మహాల్‌ లక్నో నుండి తప్పుకున్నారు. ఈ విధంగా తప్పుకుంటున్నప్పుడు కూడ తన క్షేమం కంటె తన వెంటనున్న వారి క్షేమం గురించి ఓ బాధ్యత గల నాయకురాలిగా ఆలోచించారు. ఆ సమయంలో కూడ తన వెంట నున్న ప్రముఖులంతా క్షేమంగా ఆంగ్లేయుల వలయం నుండి తప్పించుకుని వెళ్ళిన తరువాత బేగం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టారు.

బేగం సంరక్షణలోంచి అవధ్‌ జారిపోయాక కంపెనీ సైనికులు పెచ్చరిల్లిపోయారు. 1857 నాటి తిరుగుబాటులో మరెక్కడ ఎదురుకానంత పరాభవాన్ని చవి చూసిన

46



హజరత్‌ మహాల్‌ బ్రిటిషు సైన్యాలతో చివరి పోరాటం జరిపిన మూసాబాగ్ ప్రాంతం ఆంగ్లేయాధికారులు, ఆంగ్ల సైనికులు అవథ్‌ రాజ్యం మీద పడి దోచుకున్నారు. సంపన్నవంతమైన లక్నోను పూర్తిగా ఛిద్రం చేశారు. అవథ్‌ పౌరులను దోచుకోవడమే కాకుండ భయంకర హింసలకు గురిచేశారు. యధేచ్చగా హత్యాకాండ సాగించారు.ఈ మేరకు తాము చేసన కిరాతక చర్య లను తమ వారికి ఉత్తరాల ద్వారా ఆంగ్లేయాధికారులు తెలుపుకున్నారు.

ఆతరువాత అవధ్‌ రాజ్యంలోని స్వదేశీ పాలకుల అధీనంలో ఉన్నపలు ప్రాంతాలు తిరుగుతూ పలుచోట్ల శత్రువును ఎదుర్కొంటూ, మరికొన్నిచోట్ల మిత్రుల ఆతిధ్యం పొందుతూ, బ్రిటిషర్ల దాడుల నుండి తప్పించుకుంటూ ఆమె ముందుకు సాగారు. ఆమె ఎక్కడకు వెళ్ళినా బ్రిటిషు సైన్యాలు ఆమెను వెంబడించ సాగాయి. ఓ క్షణం విశ్రమించేతీరికలేకుండ చేశాయి. ఆమెకు ఆశ్రయమిచ్చినవారిని ఇక్కట్లపాలు చేయ సాగాయి.

ఆ సమయంలో విద్రోహుల కుట్ర ఫలితంగా యోధుడు మౌల్వీ అహమదుల్లా షాను శత్రువులు బలితీసుకున్నారు. ఈ వార్త ఆమెను బాధించింది. పలు ప్రాంతాలలో తిరుగుబాటు యోధులు సాగిసున్న పోరాటాలలో అపజయాలు చవిచూడాల్సిన పరిస్థితు లు ఎదురవుతున్నాయి. ఆమె సహచరులు, స్వదేశీ పాలకులు రాజా బేని మాధావ్‌ సింగ్ 47

తదితరుల పరాజయాలు బేగంను బాగా కృంగదీశాయి. ఈ వాతావరణంలో బేగం తన పరివారం తోపాటుగా అక్కడ కొన్నాళ్ళు, ఇక్కడ కొన్నాళ్ళు తలదాచుకుంటూ గడపసాగారు. బేగం పరివారాన్ని వెంటాడుతున్న కంపెనీ బలగాలు ఆమె తలదాచుకున్న చోటల్లా ప్రవేశించి కసికొద్ది బీభత్సం సృష్టించసాగాయి. ఆమెను ఆమె బలగాలను నీడలా వెన్నంటి కంపెనీ సైనికులు వస్తున్నా ప్రజల అండదండలతో, అత్యంత విశ్వాసపాత్రులైన సైనికాధికారు, సైనికుల రక్షణలో ఆమె ప్రమాదాన్నిఅధిగమిస్తూ సురక్షితంగా సంచరించసాగారు.

బేగం హజరత్‌ మహల్‌ ప్రవాసంలో ఉన్నప్పుడు 1858 నవంబర్‌ 1న విక్టోరియా మహారాణి ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనను రద్దుచేసి, పాలనాధికారాన్నిస్వయంగా స్వీకరించింది. ఈ సందర్బంగా విక్టోరియా రాణి ప్రకటన గా ఖ్యాతి గాంచిన ప్రకటనను ఆమె చేసింది. అందులో స్వదేశీ పాలకులకు, ప్రజలకు ఆమె పలు హామీలు కుమ్మరించింది. పలు ఆకర్షణీయమైన ఆశలను చూపింది. తిరుగుబాటు వీరులకు, నేతలకు కమాబిక్ష ప్రసాదిస్తానంది. తిరుగుబాటులో పాల్గొన్న స్వదేశీ పాలకులను, ప్రజలను ఆ ప్రకటన కొంతలో కొంతగా ఆకర్షించింది. విక్టోరియా రాణి ప్రసాదించే క∆మాబిక∆తో బ్రతికి బయటపడి తమ ప్రాణాలు కాపాడుకోవాలనుకున్న కొందరు సహచరులు, పాలకులు, జమీందారులు, అధికారులు తిన్నగా బేగం పక్షం నుండి తప్పుకోసాగారు. ఈ పరిణామాలు ఆమెను మరింత కలవరపరిచాయి.

ఆ పరిసితులలో ప్రజలలో, సహచరులలో ఆత్మవిశ్వాసం కలిగించేందుకు, బేగం హజరత్‌ మహాల్‌ విక్టోరియా ప్రకటనకు దీటుగా 1858 డిసెంబర్‌ 31న మరో చారిత్రాత్మక ప్రకటనను బిర్జిస్‌ ఖదీర్‌ పేరిట విడుదల చేశారు. ఆ ప్రకటనలో సామ్రాజ్యవాద కాంక్ష కలిగిన ఆంగ్లేయులు ఇండియాలోని స్వదేశీ సంస్థానాలను ఎలా ఆక్రమించుకుందీ, స్వదేశీ పాలకులను ఎలా మోసగించిందీ, స్వదేశీ పాలకులతో పలు ఒప్పందాలు చేసు కుని వాిని నిస్సిగ్గుగా ఎలా ఉల్లంఫిుంచిందీ, ప్రజల మత విశ్వాసాల మీద, ఆచార సంప్రదాయాల మీద ఎటువంటి దాడులు నిర్వహిస్తున్నదీ సవివరంగా పేర్కొన్నారు. స్వదేశీ పాలకుల మీద ఎంతటి దారుణాలకు ఒడిగట్టిందీ ఆ ప్రకటనలో వివరించారు. ఆంగ్లేయులు అపరాధాన్నిక్షమించినట్టు కలలో కూడ ఎవ్వరూ చూడలేదు అంటూ ఆనాడు లొంగుబాటుకు సిద్ధ్దమవుతున్నయోధులను బేగం హెచ్చరించారు. 48 ( '.. no one has ever seen in a dream that the English forgave an offence ..' -Encyclopaedia of Women Biography Vo. II, Ed. by Nagendra.K.Singh, APH Publishing Corporation, New Delhi, 2001, Page. 66) ఆంగేయులు స్వదేశీయుల ఆత్మాభిమానాన్ని ఏవిధగా దెబ్బగొట్టిందీ, స్వదేశీయుల మతధర్మాలను ఏవిధంగా కించపర్చిందీ, మత మనోభావాలను ఏ విధంగా అవమాన పర్చిందీ, తిరుగుబాటుకు భయపడి తిరగబడ్డ సైనికులను, నేతలను మాలిమి చేసుకునేందుకు ఎలాంటి ఆశలు చూపిందీ, గతంలో స్వదేశీ పాలకుల మీద ఎంతటి అఘాయిత్యాలకు పాల్పడిందీ ఆ సుదీర్ఘ…మైన చారిత్రాత్మక ప్రకటన సాక్ష్యాధారాలతో సహా వివరించింది. చివరకు మా ప్రజలు మాదేశాన్నికోరుతున్నప్పుడు ఆమె మాదేశాన్ని మాకెందుకు వదాలిపెట్టదూ? ( '..Why does her Majesty not restore our country to us. when our people want it..' - Encyclopaedia of Women Biography Vol. II, Page.66) అని సూటిగా విక్టోరియా రాణిని ప్రశ్నించారు. విక్టోరియా రాణి మభ్యపెట్టు మాటలను నమ్మవద్దని, మోసపోవద్దని ప్రజలకు, స్వదేశీ పాలకులకు ఆమె విజ్ఞప్తి చేశారు. మాతృభూమి నుండి పరాయిపాలకుల పెతనాన్ని రూపుమాపేందుకు కంకణబద్ధులై అంతా కదలాలని ఆమె ప్రజలను కోరారు.

ఈ పరిస్థితులు ఇలా ఉండగా, ఆంగ్లేయాధికారులు లక్నో తిరుగుబాటును క్రూరంగా అణిచివేయడానికి, తిరుగుబాటు నాయకులను తుదాముట్టించేందుకు పదకాలు రూపొందించసాగారు. అన్ని వెపు ల నుండి తిరుగుబాటు సైన్యాలను తరు ముతూ, వారంతా నేపాల్‌ దిశగా సాగిపోయేందుకు పథకం ప్రకారంగా అనుకూలతను సృష్టించారు. లక్నో నుండి తప్పుకున్న తరువాత బేగం హజరత్‌ మహాల్‌ కూడ మిగతా యోధులతో పాటుగా మరో మార్గం లేక నేపాల్‌ దిశగా సాగాల్సివచ్చింది. ఆ నిర్ణయం వలన ఆమె రక్షణ కూడ ప్రమాదంలో పడింది. బ్రతికుండగా తాను గాని, మరణించాక తన శవం గాని ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల చేతుల్లో పడరాదని నిర్ణయించుకున్న ఆమె నానా సాహెబ్‌ ఇతర తిరుగుబాటు నేతలతో కలిసి నేపాల్‌ అడవుల్లోకి వెళ్ళిపోయారు.

అక్కడ కూడ ఆమెకు ప్రమాదం తప్పలేదు. ప్రమాదాల నుండి తప్పంచుకుంటూ రాత్రి పగలు అని తేడ లేకుండా ఆమె గడపాల్సి వచ్చింది. చివరకు నేపాల్‌ రాజ్యం లోనికి ప్రవేశించిన ఆమెకు నేపాల్‌ పాలకుడు జంగ్ బహుద్ధూర్ నుండి సహకారం 49 లభించక పోగా నేపాల్‌ అడవులు వదిలి వెళ్ళిపోవాల్సిందిగా అతను ఆదేశించాడు. అనివార్యపరిస్థితు లలో ప్రమాదాకర వాతావరణాన్నిఎదుర్కొంటూ బేగం హజరత్‌ మహాల్‌, బిర్జిస్‌ ఖధిర్‌ నేపాల్‌ అడవుల్లో సంచరించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఒక వేళ పోరాడి నేలకొరిగే అవకాశం తనకు లభించకుంటే అత్మార్పణ చేసుకునేందుకు బేగం ఎల్లప్పుడు విషంతో కూడిన పాత్రను తనవెంట ఉంచుకుని ఆంగ్లేయుల మీద పోరాటం సాగించేందుకు ప్రయత్నాలను సాగించారు.

ఆ సమయంలో నేపాల్‌ అడవుల్లోకి బేగం హజరత్‌ మహాల్‌ ఛాయా చిత్రం గీసేందుకు వచ్చిన ఒక బ్రిటిష్‌ చిత్రకారుని ద్వారా, వ్యక్తిగతంగా ఆమెకు ఏడాదికి లక్ష రూపాయలు ఆమె కుమారుడు బిర్జిస్‌ ఖదీర్‌కు 15 లక్షలు అందచేస్తామని ఆశ చూపుతూ బ్రిటిష్‌ పాలకులు, బేగంను లొంగదీసుకునేందుకు విఫల ప్రయత్నం చేశారు. ఈ విధంగా ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ సాగుతుండగా, ఆమె వెంట వచ్చిన యోధులు ఒక్కొక్కరే ఆ కారడవుల్లో, మంచు కొండల్లో మృత్యువువాత పడసాగారు. కాలం గడచేకొద్ సంపదతోపాటుగా, సహచరులు తరిగి పోసాగారు.

ఆ పరిస్థితులలో కూడ శత్రువుకు ఏమాత్రం తలవంచడానికి బేగం ఇష్టపడలేదు. ప్రధాన సహచరులు, అనుంగు అనుచరులు మృత్యువాతపడి అదాశ్యమైపోయారు. ఆ సమయంలో ఒంటరిగా మిగిలిన ఆ అసమాన పోరాటయోధురాలు, అతి నిస్సహాయ పరిస్థితులలో సామాన్య జీవితం గడపసాగారు. చివరకు ఆ మంచు కొండల శిఖరాల మీద రెపరెపలాడుతున్న అవధ్‌ రాజ్యం ఛత్ర ఛాయలో 1874 ఏప్రిల్‌ మాసంలో బేగం హజరత్‌ మహాల్‌ కన్నుమూశారు.

ఆమె బౌతికకాయాన్నిఖాట్మండులో ఆమె స్వయంగా హిందూస్థానీ మసీదులో ఓ ప్రక్కన ఖననం చేశారు. ప్రస్తుతం ఆ ఇమాంబారా శిథిలమైపోయింది. అక్కడ హజరత్‌ మహాల్‌ స్మృతి చిహ్నంగా ఆమె సమాధి మాత్రమే మిగిలింది. అది కూడ ఆక్రమణలకు గురవుతుంది. ఆ సమాధి నూటపాతికేళ్ళుగా అక్కడ ఉన్నా దానిని పట్టించుకున్న వారు లేకపోయారు. 1957లో ప్రథమ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్బంగా, బేగం హజరత్‌ మహాల్‌ సమాధికి ఏర్పడిన దుస్థితి గురించి ఆమె వంశజుడు మీర్జా ఆజం ఖదీర్‌ ఆనాటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్‌ నెహ్రూ ను కలసి ఓ మహాజరు ద్వారా అక్కడున్నపరిస్థితిని ఆయన దాష్టికి తెచ్చారు. 50






51


ఆ మహాయోధురాలి స్మృతిగా మిగిలి ఉన్న ఆమె సమాధి నిర్లక్ష్యానికి గురికావడం గురించి తెలుసుకున్న ప్రదాని నెహ్రూ తన బాధను వ్యకం చేస్తూ తగిన శ్రద్ద తీసుకుంటానని హమీ ఇచ్చారు. ఆ సమాధిని ఫోటోలు తీయించి, వాయటిని ఆజం ఖదిర్‌కు కూడ పంపారు. ఆ ఫోటోలతోపాటుగా, నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం ఆ సమాధి సంరక్షణ బాధ్యతను తీసుకుంటానని ప్రధాని నెహ్రూ హామీ కూడ ఇచ్చారు. ఆ సంవత్సరం ఉత్తర ప్రదశ్‌లో జరిగిన ప్రదమ స్వాతంత్య్రసంగ్రామం ఉత్సవాలలో ఆ మహాయోధ బేగం హజరత్‌ మహాల్‌ ప్రస్తావన కూడ రాలేదు. ఈ విషయమై ప్రిన్స్‌ ఆజం బారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి పలు ఉత్తరాలు రాయడంతో 1958 మే 9న భారత ప్రభుత్వం లోక్‌సభలో 1857 నాటి పది మంది యోధుల పట్ల ప్రత్యేక గౌరవాన్ని ప్రకటిస్తూ ఆ జాబితాలో బేగం హజరత్‌ మహాల్‌కు ఆగ్రపీఠం వేసింది. ఆ తరువాత ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం అప్పటివరకు లక్నోలో ఉన్న విక్టోరియా పార్కు పేరు మార్చి బేగం హజరత్‌ మహాల్‌ పార్కుగా నామకరణం చేసింది.

52