భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/బేగం ఖుర్షీద్‌ ఖ్వాజా

వికీసోర్స్ నుండి

జైలుకెళ్ళక పోవటం అపచారంగా భావించిన

బేగం ఖుర్షీద్‌ ఖ్వాజా

(1896-1981)

జాతీయోద్యమంలో జైలుకు వెళ్ళటం బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించారు. జైలుకు ఎప్పుడెప్పుడు పోదామని ఎదురు చూశారు. ఏ కారణంగానైనా అరెస్టు కాకపోవటం, జైలుకు వెళ్ళ క పోవటం పెద్దా అపచారంగా పరిగణంచారు. జెలుకెళ్ళకపోవటం అపచారంగా భావించి జైలుకెళ్లాక ఆనందాన్ని వ్యక్తం చేసిన కుటుంబాలు ఆనాడు ఎన్నో ఉన్నాయి. అటువిం ఉద్యామస్పూర్తిగల కుటుంబ సభ్యురాలు బేగం ఖుర్షీద్‌ ఖ్వాజా.

ప్రస్తుత ఆంధ్రాప్రదేశ్‌ రాజధాని హైదారాబాద్‌ నగరంలో బేగం ఖుర్షీద్‌ ఖ్వాజా 1896లో జన్మించారు. ఆమె తండ్రి సర్‌ బులంద్‌ జంగ్‌. ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆమె తాత సమీవుల్లా. ఆయన సర్‌ సయ్యద్‌ గా ప్రఖ్యాతి చెందిన సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌ ఖాన్‌ సన్నిహిత మిత్రులలో ఒకరు.

స్వగృహంలో బేగం ఖుర్షీద్‌ సాంప్రదాయక విద్యను పూర్తి చేశారు. తండ్రితో పాటుగా హైదారాబాదులో నివాసం ఉన్నప్పుడు ఆమెకు సరోజిని నాయుడుతో పరిచయమయ్యింది. ఆ పరిచయం ద్వారా ఆమెస్వేఛ్చా,స్వాతంత్య్ర భావాలతో ప్రభావితులయ్యారు.ఆ క్రమంలో జాతీయోద్యా పట్ల ఆకర్షితులయ్యారు.1920లో 181 ఆమె ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సభ్యులయ్యారు. ఆనాి నుండి 1981లో కన్నుమూసే వరకు ఆమె కాంగ్రెస్‌ సభ్యురాలుగా ఉన్నారు.

బేగం ఖుర్షీద్‌ అలీఘర్‌కు చెందిన న్యాయవాది ఖ్వాజా అబ్దుల్‌ మజీద్‌ను వివాహం చేసుకున్నారు. భర్త మజీద్‌ జాతీయోద్యామకారులు. వివాహానంతరం భర్తతో కలిసి ఆమె జాతీయోద్యమంలో ప్రత్యక్ష్యంగా ప్రవేశించారు. 1921 డిసెంబరు 24, 25 తేదిలలో హైదారాబాద్‌ నగరంలో జరిగిన ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సమావేశాలలో ఆమె ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రతినిధిగా భారత జాతీయ కాంగ్రెస్‌ సబ్జెక్ట్‌ కమిటికి ప్రాతినిధ్యం వహించారు. ఆ సమావేశాలలో బేగం హసరత్‌ మోహాని, బేగం ముహమ్మద్‌ అలీ, కమలా నెహ్రూ,స్వరూపరాణి నెహ్రూలతో కలిసి ఆమె పని చేశారు.

జాతీయోద్యమంలో ప్రవేశించాక ఎదాురైన మానసిక, ఆర్థిక కష్టనష్టాలను చిరునవ్వుతో భరిస్తూ లక్ష్యంసాధనపట్ల దృఢచిత్తంతో ముందడుగు వేసిన బేగం ఖుర్షీద్‌ ప్రజల, ప్రజా నాయకుల ప్రశంసలు అందుకున్నారు. ఖిలాఫత-సహాయ నిరాకరణోద్యామ కార్యకలాపాలలో అవిశ్రాంతంగా పాల్గొంటూ పలువురికి ఆదర్ మయ్యారు. ఈ సందర్బంగా అరెస్టుకావటం, జైలుకెళ్ళటం ప్రతి ఉద్యమకారుని కర్తవ్యంగా ప్రకిటించారు. ఈ మేరకు గాంధీజీకి లేఖ రాస్తూ అందులో నా భర్త సహచరులంతా జైళ్ళకు వెళ్ళారు. నా భర్త మాత్రం ఇంత వరకు స్వేచ్ఛగా ఉండటం పట్ల మాకు బాధగా ఉంది అని పేర్కొన్నారు. ఆ భావనల నేపధ్యం బేగం ఖుర్షీద్‌ బాధమయ వాక్యాల మీద గాంధీజీ వ్యాఖ్యానం చేస్తూ, నిజమైన నిబద్ధతతో కూడిన భావనలు ఇలా ఉంటాయి. స్వాతంత్య్రం కోసం స్త్రీ, పురుషులంతా ఇలాగే జైళ్ళను నింపాటానికి సంతోషంగా ముందుకు వచ్చిన రోజున స్వరాజ్యం తప్పక లభిస్తుంది ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. (Collected Works of Mahathma Gandhi, Govt. Of India Publications, New Delhi)

ఖ్వాజా అబ్దుల్‌ మజీద్‌, బేగం ఖుర్షీద్‌ దాంపతుల త్యాగగుణ సంపన్నతను వివరిస్తూ, మహానీయురాలైన ప్రతిష్టాత్మక ధార్మపత్ని అను శీర్షికతో గాంధీజీ రాసిన వ్యాసంలో సుఖభోగాలను వదలి బేగం ఖుర్షీద్‌ కుటుంబం సాదాసీదా ఉద్యామకారుల జీవితాన్ని చేప్టటం, ఆ విధాంగా ఆ దంపతులు చేసిన త్యాగం, ఆమె భర్త ఖ్వాజా అబ్దుల్‌ మజీద్‌ గుణగణాలను ప్రస్తుతించారు. బేగం ఖుర్షీద్‌ కార్యనిర్వహణాదీక్ష, జాతీయోద్యమ లక్ష్యాల పట్ల ఉన్న నిబద్ధత గురించి గాంధీజీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 182 సహాయనిరాకరణ ఉద్యమం సందర్భంగా ఉద్యామకారులంతా అరెస్టులవుతూ తాను తన భర్త ఖ్వాజా అబ్దుల్‌ మజీద్‌ అరెస్టు కానందుకు ఎంతో చింతిస్తూ వచ్చారు. చివరకు తన భర్త అరెస్టు కాగానే సంతోషం వ్యక్తం చేస్తూ ఆ విషయాన్ని టెలిగ్రాం ద్వారా గాంధీజీకి తెలిపారు. ఆ టెలిగ్రాం అందాుకున్న గాంధీజీ బేగం ఖుర్షీద్‌ ఉద్యమ స్పూర్తిని ప్రశంసిస్తూ ప్రతిష్టాత్మక మహానీయుని ధార్మపత్ని అను శీర్షికతో మరో వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో ప్రభుత్వం నా భర్తను అరెస్టు చేసిందన్న విషయం తెలుసుకున్న మీకు ఆనందం కలిగి ఉంటుంది అని బేగం ఖుర్షీద్‌ ఆయనకు రాసిన లేఖలో పేర్కొన్నట్టు గాంధీజీ తెలిపారు.

ఈ అరెస్టు సమయంలో ఖ్వాజా అబ్దుల్‌ మజీద్‌ జాతీయ విశ్వవిద్యాలయం జామియా మిలియా ఇస్లామియా కులపతిగా బాధ్యాతలు నిర్వహిస్తున్నరు. ప్రభుత్వ కళశాలలు బహిష్కరించిన, ప్రభుత్వ సహాయం నిరాకరించిన విద్యాసంస్థలలోని విద్యారుల కోసం, జాతీయ భావాలను ప్రచారం చేయడనికి ఆచరణాత్మక విద్యాభోధన గావిస్తున్న జామియా మిలియాను ఆయన సమరవంతంగా నిర్వహిసున్నారు. ఆ సమయంలో ఆయన అరెస్టు జరిగింది. ఆయన అరెస్టుతో ఉద్యామ కార్యకలాపాలు ఆగిపోరాదాని బేగం ఖుర్షీద్‌ వాంఛించారు. ఆ విషయాన్ని కూడ గాంధీజీకి తెలియచేస్తూ, నా భర్త గైరాజరీలో జామియా మిలియా ఇస్లామియా (అలీఘర్‌) కార్యకలాపాల బాధ్యతలనన్నిటిని నేను నిర్వహించేందుకు కృషి చేస్తాను అని రాశారు. ఈ మేరకు ఆమె భర్త అరెస్టువలన జాతీయోద్యమ కార్యకలాపాలు కుంటుపడరాదని భావించి భర్త పక్షాన ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టి జాతీయ భావాలకు పుట్టినిల్లుగా నిలచిన జామియా మిలియా ఇస్లామియా విద్యా కేంద్రం కార్యకలాపాలను ఆమె పర్యవేక్షించారు.

జాతీయ భావాలను ప్రచారం గావించేందుకు, దేశభక్తి భావనలను ప్రోదిచేయడానికి అలీఘర్‌ కేంద్రంగా ఆమె హింద్‌ అను ఉర్దూ మాసపత్రికను 1921లో ప్రారంభించి, ఆ పత్రిక సంపాదాకత్వ బాధ్యతలను చేపట్టారు. ఆ పత్రిక ద్వారా దేశభక్తి భావనల ప్రచారం, బ్రిటిషు ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్నిసమర్థ్ధవంతంగా నిర్వహిస్తూ బ్రిటిష్‌ ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు.

మహిళల్లో విద్య ఆవశ్యకతను గ్రహంచిన ఆమె, ఆ దిశగా చాలా శ్రద్దా చూపారు. మహిళలు చదువుకుంటే తప్ప సమాజంలో ప్రగతి సాధ్యం కాదని ఆమె నమ్మకం. 183 జాతీయోద్యమం విజయవంతం కావాలంటే మహిళల్లో చైతన్యం రావాలనీ అది అక్షర జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్య మైతుందని ఆమె విశ్వసించారు. ఈ మేరకు తన విశ్వాసాన్ని ఆచరణలో చూపేందుకు ఎంతగానో శ్రమించారు. ప్రజలలో అకర జ్ఞానం కలించేందుకు ప్రచార కార్యక్రమాల కంటే విద్యవ్యవస్థల నిర్మాణం ద్వారా ఆ లక్ష్యాలు సాధ్యా మైతాయని ఆమె తలంచారు. ఈ మేరకు 1930లో అలహాబాద్‌లో ఆడపిల్లలు, మహిళల కోసం హమీదియా బాలికల సెకండరీ స్కూల్‌ (Hamidiya Girls Secondary School) స్థాపించారు. ఆ విద్యాసంస్థ ఆమె కళ్ళ ఎదుట మహిళలలో విద్యాసుగంథాలను వెదజల్లుతూ క్రమక్రమంగా కళాశాల స్థాయికి ఎదిగింది.

ఖద్దరు ప్రచార కార్యక్రమాలలో ఆమె అత్యంత ఆసక్తి చూపారు. ఆశయాలను ఆచరణలో చూపటం ద్వారా ప్రజలను ఆకర్షించారు. స్వయంగా ఖద్దరు ధారణ చేశారు. నూలు వడకటం మాత్రమే కాకుండ, నూలువడకడాన్ని అమె ప్రజలకు, ప్రధానంగా మహిళలకు, యువతులకు నేర్పారు. జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులకు కూడ ఆమె నూలు వడకటం నేర్పారని గాంధీజీ లేఖల ద్వారా వెల్లడవుతుంది.

మాతృభూమి విముక్తి కోసం ఉద్యమించిన ఫలితంగా బ్రిష్‌ సామ్రాజ్య వాదుల నుండి దేశానికి విముక్తి లభించినప్పటికి, దేశం విభజనకు గురవటం పట్ల బేగం ఖుర్షీద్‌ బాగా కదలిపోయారు. ఆనాటి నుండి రాజకీయ రంగం నుండి వైదొలగి విద్యా, సామాజిక సేవారంగాలకు ఆమె అంకితమయ్యారు. ఈ మేరకు అటు మాతృదేశ సేవ, ఇటు ప్రజాసేవకు అమూల్యమైన జీవితాన్ని అర్పితం చేసిన సమరశీల యోధురాలు బేగం ఖుర్షీద్‌ ఖ్వాజా 1981 జులైలో తుదిశ్వాస విడిచారు.

♦♦♦

బ్రిటిష్‌ న్యాయస్థానం ఎటువంటి శిక్షనైనా విధించనివ్వండి, అది జైలు శిక్ష, బహిష్కరణ, జీవిత ఖైదు, ద్వాపాంతరవాసం, చివరకు ఉరిశిక్ష అయినా కానివండి, తల వంచాల్సిన అవసరం లేదాన్నాను..భారతదేశంలో సోదార-సోదరీమణులంతా ఖిలాఫత్‌- సహాయనిరాకరణ ఉద్యామం కోసం ఉద్యమించి, ప్రభుత్వం అనుసరిస్తున్నఅణిచివేత విధానాలను వ్యతిరేకించాలి.ఖిలాఫత్‌ ఉద్యా ప్రతి ఒక్కరి నుండి అత్యున్నత స్థాయి అర్పణను ఆశిస్తుంది. ఈ ధర్మ పోరాటంలో ప్రతి ముస్లిం ధనమాన ప్రాణాలు అర్పించేం దుకు సరfiదా సిద్ఢంగ ఉండాల్సిన సమయమిది. - బేగం జాఫర్‌ అలీ ఖాన్‌ 184