పుట:Womeninthesmrtis026349mbp.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాధ్యాయము

33

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో పై వర్ణపు పురుషులు క్రిందివర్ణపు స్త్రీలను వివాహ మాడుచో నవి యనులోను వివాహములగును. క్రిందివర్ణపు పురుషులు పైవర్ణపు స్త్రీలను వివాహ మాడుచో నా వివాహములకు ప్రతిలోమ వివాహములని పేరు. అనులోమములకంటెను ప్రతిలోమము లెక్కుడు గర్హ్యములు. అనులోమవివాహములు కాముక పక్షములో నంగీకరింపబడినవి. కాని ప్రతిలోమ వివాహములు ధర్మహీనములని స్పష్టముగ చెప్పబడినవి.

ప్రతిలోమాస్తు ధర్మహీనాః

(గౌ.ధ.సూ. 4-24)

అందునను బ్రాహ్మణస్త్రీ శూద్రుని వివాహమాడుట మిక్కిలి దోషము. అట్టి వివాహమువలన జన్మించువాడు చండాలుడని పైన నీయబడిన గౌతమసూత్రములో (4-17) నున్నది. వా డందఱికంటెను పాపిష్ఠుడని చెప్పబడినది.

అంత్యః పాపిష్ఠ:

(గౌ.ధ.సూ. 4-27)

అనులోమ వివాహములు కాముకపక్షములో నంగీకరింపబడిన విధము నించుక పరిశీలింపవలసియున్నది.

కామతస్తుప్రవృత్తానామి మాస్స్యుః క్రమశోవరా:

(మను 3-12)

   శూద్రైవభార్యాశూద్రస్య సాచస్వాచవిశ: సృతే
   తేచస్మాచైవ రాజ్ఞశ్చతాశ్చస్వాచాగ్రజన్మన:
(మను 3-13)