34
స్మృతికాలపుస్త్రీలు
(కామమార్గమున ప్రవర్తించువారికి క్రమముగ నీక్రింద జెప్పబడిన భార్య లుండవచ్చును. శూద్రునకు శూద్రయే భార్య. వైశ్యునికామెయు వైశ్యయు, క్షత్రియునకు నాయిర్వురు క్షత్రియయు, బ్రాహ్మణునకా మువ్వురును బ్రాహ్మణియు నుండదగును.)
ఇందలి క్రమముననుసరించి బ్రాహ్మణ క్షత్రియులకు శూద్రస్త్రీ భార్యయగుట యధమకాముక పక్షముగ తేలుచుండుటచే మనువు వీరిజాతి శ్లోకములో నీ రెండు విధములగు వివాహములను స్పష్టముగ నిషేధించుచున్నాడు.
సబ్రాహ్మణక్షత్రియయోరాపద్యపి హి తిష్ఠతోః
కస్మింశ్చిదపి వృత్తాన్తే శూద్రాభార్యోపదిశ్యతే
హీనజాతి స్త్రియం మోహాదుద్వహన్తోద్విజాతయః
కులాన్యేవ నయన్త్యాశు ససంతానాని శూద్రతాం
(మను 3-14, 15)
(ఆపత్తులో నున్నపుడుగూడ బ్రాహ్మణ క్షత్రియులకు శూద్రభార్య యెచటను జెప్పబడలేదు. మోహముచే శూద్రస్త్రీవివాహమాడువారు సంతానముతో కూడ తమకులమును శూద్రత్వము నొందించుచున్నారు.)
శూద్రును వివాహమాడినవా డత్రి గౌతముల మతములలోను, సంతానమును గనినవాడు శౌనకుని మతములోను, మనుమలను గనినవాడు భృగుని మతములోను పతితులగుదురని మనువు చెప్పుచున్నాడు.