పుట:VrukshaSastramu.djvu/511

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

508

మూలలను, కుళ్ళుచున్నచోట్లను నుండు బూజును కూర్చి చదువ నేలని కొందరందురేమో. కాని దీనిని గూర్చి చదువుట జాలయగత్యమే. వీని మూలమున కోట్లకొలది రూపాయల పంట నష్టమగు చున్నది. వరి, గోదుమ, పోక, చెరకు, బంగాళ దుంప మొదలగు ఎన్నో ముఖ్యమైన పయిరులకు తెగుళ్ళు వీని వలన పుట్టు చున్నవి. కావున వాని సంగతెరిగి వానిని రూపు మాప యత్నింప వలసి యున్నది. చేయునది ఇట్టి పాడు పనియే కాదు, అదికొంచెము మంచి పని కూడ చేయుచున్నది. కుళ్ళు చున్న పదార్థముల పయిన బెరిగి త్వరగ వానిని మంటిలో గలిపి వేయును. మరియు ఐరోపినియునులు, మరి కొందరు కుక్క గొడుగులను కొన్నిటిని తిందురు.

............................................. సమాప్తము......................................................