పుట:VrukshaSastramu.djvu/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జామ చెట్లు మన దేశమున అంతటను పెరుగు చున్నవి. అవిఏనేల లందైనను పెరుగగలవు. గింజలను నాటినను, కొమ్మ పాతినను మొక్క మొలచును. వాని గురించి మనమంత శ్రద్ధ పుచ్చుకొన నక్కర లేదు. జామ పండ్లలో రెండు రకములు గలవు. కొన్ని తెల్ల గాను, కొన్ని ఎర్రగాను వుండును. వీని కలపను బల్లెములు, మొదలగు సాధనములు చేయుటలో వాడు చున్నారు. కొన్ని చోట్ల ఆకులను బెరడును రంగు వేయుటలో ఉపయోగింతురు.

దానిమ్మ చెట్టును కొందరు గోరింట కుటుంబము లో చేర్చెదరు. ఈ చెట్టును పలు తావులలో పెరుగు చున్నది. ఇది గింజలను నాటిగాని కొమ్మలను పాతిన గాని మొలచును. కాని అంటు గట్టుట మంచిది. కాయలు లేతవిగా నున్నప్పుడు వానిలో నొక పురుగు చేరి అంతయు తిని వేయును. కాయలను కుళ్ళ జేయును. పురుగు పట్ట కుండ చేయుటకు లేత కాయ ముచ్చిగను పూర్తిగ కోసి వేసి దానికొన గుట్ట కట్టవలెను. కొన్ని చోట్ల పువ్వులు నెర్రరంగు చేయుటకును కాయ బెరుడు చర్మములు బాగు చేయుటకు వుపయోగించు చున్నారు.

కంబిచెట్టు హిమాలయా పర్వతముల ప్రాంతముల మొలచు చున్నది. ఈచెట్టునుండి జిగురువచ్చును బెర