పుట:VrukshaSastramu.djvu/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మామిడితోటలను మన దేశమునం దంతటను బెంచు చున్నారు. వానిలో జాల రకములు వచ్చినవి. ఏరకమయినను టెంకనుండి మొలచును గాని యా మొలచిన చెట్టు పండ్లు మంచివి కాక పోవచ్చును. మంచి టెంకల నుండి చెడ్డ చెట్లును, తక్కువ రకము టెంకల నుండి మంచి చెట్లును గూడ వచ్చుట గలదు. కావున మంచి రకము వచ్చునని రూఢము చేసికొనుటకై అంటు గట్టెదరు. టెంకలను బాతి ఆ చిన్న మొక్క లేడాది ఎదిగిన పిమ్మట వర్షాకాలము నందు నంటు గట్టెదరు. ఈ అంటులను వర్ష కాలములోనే దూర దూరముగ బాతుట మంచిది. అందులకు ఇరువది యడుగుల దూరమున మూడేసి యడుగుల వెడల్పున గోతులు దీసి ఎరువు వేసి మొక్కలు పాతుదురు. ఆరునెలల వరకు వానికి నీడ యుండ వలయును. ఆమధ్య ప్రదేశములందు నేదయిన పైరు జల్లినను జల్లవచ్చును. అయిదేండ్లలో దోట కాపునకు రాగలదు. ఇంత వరకును అప్పుడప్పుడు నీరు పోయు చుండ వలెను.

మామిడిపండ్ల రుచియు, కాయల యూరుగాయలను, అందరము ఎరిగినదే. మామిడి కలప గట్టిగా నుండును. తలుపులు, ద్వార బంధములు, తొట్టి పడవలు గూడ జేయుదురు. నల్లమందు, నీలి మందు, తేయాకును బెట్టుటకు బెట్టెలను