234
విజయనగర సామ్రాజ్యము
దుచే సంధి నాశమగును. మనయందజ లాభము కొఱకును
విజయనగర సామ్రాజ్య వినాశము కొఱకును "నేనీ మాత్రము
సహింపఁజాలనా ! పిదప విజయము మనకుఁ జేకూరుటయు
నాపె సిద్ధించుటయు నెట్లీనికలదు. విజయము శత్రువుల
దైనచో, ఆ పై మన కెట్లును సిద్ధింపదు. మనకు వినాశము
తప్పదు. ఇంతలో మనమింత త్వరుపడు టుచితముకాదు.
కావున దీనిని మనము వదలుకొంటయే మంచిది. నా
సందేహము లేదు
బేదర్ నవాబునకును, అహమ్మద్ నగరు నవాబున కును, ఇది సమ్మతమే. ఏలయన ? జగన్మోహినిం గోరిన యెడల శత్రుసమూహదుర్భరమయిన యాంధ్ర జాతీయ ప్రతాపవహ్ని మరల నొకపరి విజృంభించి తమ్ము కాల్చి వేయునని వా రెఱుం గుదురు కాన వారు మఱిమాట్లాడలేదు.
ఆదిల్ : అది తమ చిత్తము.
గోల్కొండ:-నాకా ప్రమేయ మెత్తకుండుటే యిష్టము.
బేదర్ : సరే. వారట్లు స్పష్టముగాఁ జెప్పుచున్నపుడు మనము వేబొకవిధముగా నుండఁదగదు.
ఆదిల్ : మాయిష్ట మే యనుసరింతము. అహమ్మద్ : మనకు గుఱ్ఱములు తక్కువ. ఇది వా రెఱుంగు దురు. అవి మనము కోరవలయును. 15,000 గుఱ్ఱములు కోరినంజాలును. .