పుట:Venoba-Bhudanavudyamamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23


VI

792 మైళ్ళ ప్రయాణము చేసి 13 వ. నవంబరు 1951 వ తేదీన భారతదేశ భాగ్యవిధాత వినోబాజీ భారతదేశ ప్రధానియైన పండిట్ జవహర్ లాల్ నెహ్రూని బాపూజీ సమాధివద్ద జమునానది ఒడ్డున కలసిరి. వినోబాజీ రాజబాటలో చిన్నపూరిగుడిసెలో 11 దినములు నివసించిరి. ఆఏకాదశి దినములలో వినోబాజీని అన్ని వర్గములవారు, పేదవారు గొప్పవారు, వున్నతాధికారులు. ఆనామతులు, నాయకులు సామాన్యప్రజలు, అనేకమంది కలసి అనేక విషయముల గురించి చర్చించిరి. ప్రధానమంత్రి, రాష్ట్రపతిగూడ వినోబాజీని ఈచిన్నగుడిసెలో కలియుట పూర్వకాలములో కలియుట పూర్వకాలములో ఆధిక బలవంతులుగూడ పకీరులను ఫకీరుల సలహా నాశ్రయించుచు వారి సహాయమును అపేక్షించిన విధముగ వుండెను. ఈవిచిత్ర సంఘటన విదేశీయుల సహితము ఆశ్చర్యచకితుల నొనర్చినది. బాపూజీ సమాధివద్ద బస చేయుట వినోబాజీకి ఒకవిధమైన వుత్తమప్రేరణ కల్గించినది. వినోబాజీ బాపూజీ ఆత్మ తమ నెప్పుడు వెంటాడు చుండునని, తాముపొరబాట్లు, చేసిన వెంటనే బాపూజీవానిని సరిచేయు చుండునని ఆన్నారు. వినోబాజీ ఢిల్లీ ప్రజలకు తనను వామనునిరూపమాలో పరిచయము చేసికొనిరి. వామనునివలె తాము మూడు అడుగులు దానము కోరుచున్నామని అంటూ, మొదటి అడుగు దానమిచ్చుట, రెండవ అడుగు యితరులసేవలో మగ్నమగుట, మూడవది తమదంతా త్యాగమొనర్చి నిరాడంబర సేవకులై, తమమ తాము సమాజసేవ కర్పిత మొనర్చుకొనుట అని విశదపరచిరి. భూదానము త్యాగస్ఫూర్తి కల్గించుటనేయని, ప్రతిఒక్కరు దరిద్రనారాయణనకు సేవచేయాలని ఆశించవలెనని అన్నారు. ధనాన్ని వినోబాజీ సేకరించరు. ప్రతివర్తకుడిచ్చిన 1000 రూ! ధనాన్ని నిరాకరించుచు వినోబాజీ తాము ధనంతో సంభందము లేకుండా, ధనమునుండి వుత్పత్తి అయ్యే సమస్యలనుండి ముక్తులై కార్యము సాధించాలని వాంఛించుచున్నామని తెల్పిరి. ధనమేదేశాన్ని నేడు హీనస్థితికి తెచ్చిందని, ధనము మానవుని సోమరిగాను, అసత్యవాదిగాను చేయుచున్నదని, దీనినుండి మన దైవిక జీవితమును విముక్తి చేయవలెనని కోరిరి.

ధనముయొక్క తుంటరి తనాన్ని వివరించుచు, "కృషికుని వుత్పత్తి ప్రతి సంవత్సరము ఒకేవిధముగా నున్నప్పటికి, ధరలుమాత్రము భేదమొందు