పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170


మరియు దోమకొండ సంస్థానమువారును, ఆత్మకూరు సంస్థానము వారును, గోపాలు పేట సంస్థానమువారును శ్రీ రెడ్డిగారికి ముఖ్య పరిచితులై వారిసలహాను పలుమారు పొందుచుందురు. వీరు కాక అనేక చిన్న చిన్న జూగీరారులును, ఇతర జమీందారులును వీరివలన ఎన్నియో మారులు లాభము పొందినారు. ఇట్లు వీరు సర్వజన ప్రియులై, పరోప కార పారీణులై, కరుణాసముద్రులై, ప్రజాను రంజకులై , రాష్ట్ర సేవా పరాయణు లై అఖండ కీర్తి గడించియున్నారు. -