పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

169


పాపన్న పేట సంస్థానము రాణీ గారికి సంతానము లేదు. వారు వేంకటరామారెడ్డి గారితో ఆలోచించి ఒక సాధారణ కుటుంబముసకు చెందిన ఒక బాలుని దత్తుగా స్వీకరించిరి. కోర్టు ఆఫు వార్డు ఆజ్ఞా ప్రకారము దత్త పుత్రుని రెడ్డిహాస్టులో రాజా వేంకటరామా రెడ్డిగారి పర్య వేక్షణములో నుంచి ఒకటి రెండు సంవత్సరములు విద్యాబుద్ధులు చెప్పిరి. ఆబాలునికి గద్వాల మహారాణీగా, రెండవకుమార్తె నిచ్చి వివాహము గావించిరి.


కొల్లాపురము సంస్థానమునకు జటప్రోలు సంస్థాన మనియు ప్రతీతి. ఈసంస్థా నాధీశ్వరులకును పుత్రసంతానము లేదు. కుమార్తెలు కలరు. సంస్థానాధీశ్వరులు దత్త స్వీకారము చేసిరి. వామచని పోవునప్పుడు తమదత్త పుత్రునికిని, తమ సంస్థానమునకు శ్రీ రెడ్డిగారిని (గార్డియనుగా) విచారణ కర్తనుగా నియమించి పోయిరి. ఇప్పటికిని ఆదత్తపుత్రుని విద్యాభ్యానము వారి అవసరములు, సంస్థానములోని ప్రతి విషయమును రెడ్డిగారి అభిప్రాయాను సారముగా జరుగుచున్నవి.