పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

163


సభిలాషయే వారిలోనుండును. అట్టి వారిని సుస్కరించు వారే కాని, ఎన్నడును ఎవ్వరిని చేతులార, మససార, శక్తి సామర్ద్యములపారముగా నుండియు జెడగొట్టిన పాపాన పోయిన వారు కారు.


వారికి ప్రభువు గారివద్ద ఆజ్ఞలు పొంది ఆచరించుటలో ఎంతశ్రద్ధయో రెడ్డిహాస్టలులో ఊరుగాయకు కావలసిన సాయిగ్రి సరిగా వచ్చిన దాలేదా? పిల్లలు ఉర్దూ సరిగా చదువు చున్నారాలేదా? బాలికల పాఠశాలకు సరి యైనట్టి ఆగ్గువయైనట్టి ఇటికెలు వచ్చిన వాలేదా? అను చిన్న విషయములలోను అంతటి శ్రద్దయే యుండును.


సుమారు 53 సంవత్సరముల (అర్ధశతాబ్దము) కాలము ఉద్యోగము చేసినందునను, అందుకు పోలీసు ఉద్యోగము వేసి నానా విధములగు మనుష్యులను వారి చర్యలను గమనించినందునను వారు మనిషిని చూచినంతనే వాని గుణ విశేషముల సగము గ్రహించినారో యేమో అనుసట్లుండును. వచ్చిన వ్యక్తి యొక్క లక్షణములను బట్టియే గుర్తింతుకు, మరియు నతడు కొంత మాట్లాడువరకే పర్యవసానము గ్రహించుకోందురు. తమతో మాట్లాడువాడు సత్యము చెప్పుకున్నాడా అబద్ధము చెప్పుచున్నాడా అను అంచెనా వేసికొందురు.