పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20-ప్రకరణము

సూర్యరాయాంధ్రనిఘంటువు.

సూర్యరాయాంధ్ర నిఘంటు సంపాదకత్వము శాస్త్రుల వారిజీవితమునం దొక విషాదఘట్టము. వా రార్థికక్లేశములలోనుండి శ్రీ వేంకటగిరిరాజావారి సాయ మపేక్షించు చుండినకాలమున శ్రీ రాజాగారి సహాయముతోపాటు ఈసంపాదనాధికారము శాస్త్రులవారికి వాడిన చేనికి వర్షమువలె నైనది. శ్రీయుత గుమ్ముడూరి వేంకటరంగ రావుగారు శాస్త్రులవారిని పలుమార్లు ఈవిషయమై హెచ్చరించిరి. శ్రీ రాజా మంత్రిప్రెగడ భుజంగరావుగారు నిఘంటు సంపాదకత్వము వహింపవలసినదని శాస్త్రులవారికి లెక్క లేని జాబులువ్రాసిరి. పరిషత్తువారును ఈనిఘంటువునకు శాస్త్రులవారే ప్రథానసంపాదకులుగా నుండవలయునని కోరిరి. ప్రతిష్ఠాపకులలో నొకరైన శ్రీ వేంకటగిరి మహారాజాగారన్ననో శాస్త్రులవారుతప్ప నితరులాపదవికి అనర్హులని తమయభిప్రాయముందెలిపి వారే సంపాదకులుగా నుండవలయుననిరి. అంతట శాస్త్రులవారు నిఘంటు సంపాదకత్వమును, నెలకు రు. 250 వేతనముపై, వహించిరి. ఇయ్యది సాస్త్రులవారినివేదిక. -

ఆంధ్ర సాహిత్య పరిషత్ప్రవర్తిత

శ్రీ సూర్యరాయాంధ్రనిఘంటు కార్యనిర్వహణము.

తొలిరెండు సంవత్సరముల పనిం గూర్చిన నివేదనలేశము

ప్రధానసంపాదక కృతము.